Sunday, February 5, 2017

బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటా

 ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో నటిగా ఎదుగుతోంది రెజీనా. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ నటి.. త్వరలోనే బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై స్పందిస్తూ బిగ్‌బితో నటించేందుకు ఆతృతగా ఉన్నానంటోంది రెజీనా.
అమితాబ్‌బచ్చన్‌.. అక్షయ్‌కుమార్‌ ప్రధానపాత్రలో 2002లో వచ్చిన ‘ఆంఖేన్‌’ బాక్సాఫీసు వద్ద హిట్‌ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆంఖేన్‌-2’ వస్తోంది. ఇందులో నటించడంపై మాట్లాడిన రెజీనా.. ‘‘ అమితాబ్‌బచ్చన్‌తో నటించడానికి భయపడటం లేదు. సినీ ఇండస్ట్రీలో సీనియర్‌ నటుల నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. కాకపోతే ఇక్కడ ఇదే నా మొదటి చిత్రం కాబట్టి అందరి దృష్టి నాపై ఉంటుంది. వారంతా నా నటనపై దృష్టిపెడతారు.. కాబట్టి వారిని మెప్పించగలగాలి. ఇక్కడ నాకంటూ గుర్తింపు తెచ్చుకోగలగాలి. ఆ విషయంలోనే కొద్దిగా భయంగా ఉంది.’’ అని చెప్పుకొచ్చింది.