Sunday, May 27, 2012

ఐపీఎల్‌-5 విజేత కోల్‌కతా

ఐపీఎల్‌-5 విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆవిర్భవించింది. చైన్నై సూపర్‌కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా అదిలోనే ఓపెనరు గంభీర్‌ వికెటు కోల్పోయిడు. కానీ మరో ఓపెనర్‌ బిస్లా దిటుగా అడాడు. బిస్లా 89, కల్లిస్‌ 69, శుక్లా 3, యుసుఫ్‌ పఠాన్‌1 పరుగులు చేశారు. ఆఖర్లో షకిబుల్‌ 11, తివారీ 9 లాంఛనాన్ని పూర్తి చేశారు. చైన్నై బౌలింగ్‌లో హిల్ఫెనాస్‌ 2, మోర్కెల్‌, అశ్విన్‌, బ్రావో చెరో వికెటు లభించింది. అంతక ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. హస్సీ 54, విజరు 42, సురేష్‌ రైనా 73 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలింగ్‌లో షికిబుల్‌, కల్లిస్‌, భాటియా తలో వికెటు తీశారు.

జగన్మోహన్‌రెడ్డి అరెస్టు

హైదరాబాద్‌ : అక్రమాస్తుల కేసులో కడప ఎంపీ, వెైఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వెైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఐపీసీ 120బి, 420, 409, 477-ఏ సెక్షన్‌ అవినీతి నిరోధక చట్టం 13-1 సీ మరియు డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తూ జగన్‌ను ఎ-1గా సీబీఐ పేర్కొంది. మూడో రోజు విచారణ అనంతరం సీబీఐ అరెస్టు చేయడం జరిగింది. ఎంపీ సబ్బం హరి, జూపూడి ధ్రువీకరించారు. ఆస్తుల అరెస్టు కేసులో జగన్‌ది ఐదో అరెస్టు. సీబీఐ అధికారులు రేపు జగన్‌ను సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్నారు. మూడో రోజు అరెస్టు తర్వాత జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది.