Sunday, October 25, 2015

శతకాలతో చెలరేగిన సఫారీలు... భారత్‌ లక్ష్యం 439


ముంబయిలోని వాంఖడే మైదానంలో భారత్‌,సౌతాఫ్రికా మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 50 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది. వన్డేల్లో మ్యాచ్‌ల్లో 443 అత్యధికంగా ఉంది. మరో ఆరు పరుగులు చేసి ఉంటే సౌతాఫ్రికా జట్టు నెంబర్‌ వన్‌గా ఉండేది. సఫారీ బ్యాట్‌మెన్లు డికాక్‌ ( 109), డుప్లెసిస్‌ ( 133), డివిలియర్స్‌ (119) శతకాలు బాది జట్టుకు భారీ స్కోరు అందించారు. సఫారీ బ్యాట్‌మెన్ల దాటికి భారత్‌ బౌలర్లు కెరీర్‌లోనే దారుణమైన గణాంకాలు నమోదు చేసుకోన్నాయి. టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకు ది. ఓపెనరు ఆమాల్ల ( 23) పరుగులకే పెవిలియన్‌ చేరుకఁన్నాడు.మరో ఓపెనరు డికాక్‌ సెంచరీతో జవాజు ఇచ్చాడు.డికాక్‌ ( 109) అతని తోడుగా డుప్లెసిస్‌ కూడా సెంచరీతో అదుకున్నాడు. 133 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్డ్‌ వెనుదిగిరాడు. డుప్లెసిస్‌ క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా అడినా శతకం తర్వాత విశ్వరూపం చూపాడు. మరో డైజర్‌అన్‌ బ్యాట్‌మైన్‌ ఎబి డివిలియర్స్‌ మరో సారి తన విశ్వరూపం బౌలర్లపై చూపాడు. డివిలియర్స్‌ ( 119) పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. చివర్లో మిల్లర్‌ (22), బెహార్డీన్‌ (16) దాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా జట్టు 438 పరుగులు చేయగలిగింది. 
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వన్డేల్లో ఆరోసారి 4 వందల పైచిలుకు స్కోర్ చేశారు.