Sunday, January 30, 2011

' మిరపకాయ్ ' సస్సెస్‌మీట్‌


రవితేజ కథానాయకుడి హరీష్‌ శంకర్‌ యస్‌. దర్శకుడిగా ఎల్లో ప్లవర్స్‌ పతాకంపై రమేష్‌ పుష్పాల నిర్మిస్తున్న ' మిరపకారు ' సినిమా సస్సెస్‌మీట్‌ తాజ్‌దక్కన్‌ హోటల్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో రమేష్‌పుప్పాల, రవితేజ, ఆలీ, బ్రహ్మాజీ, రిచా గంగోపాద్యాయ, సునిల్‌, స్నిద్గ, దీక్షాసేత్‌, దువ్వాసి మోహన్‌, తమన్‌, సాహితి, రామ్‌ ప్రసాద్‌, గౌతమ్‌రాజ్‌, హరీష్‌ శంకర్‌, ఫిష్‌ వెంకట్‌, గిరి, భాస్కర్‌ తదితరులు హజరయ్యారు.
రవితేజ మాట్లాడుతూ ..

 ఈ విజయం చాలా ఆనందాన్ని ఇ చ్చింది. దర్శకుడు నిర్మాతకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు, సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు, స్నిగ్ద వాయిస్‌కు విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది అన్నారు.
సునిల్‌ మాట్లాడుతూ ..
ఆంధ్రా అంతా మిరపకాయ్ తోటలాగా పాకి పోయింది. సినిమా చూసి ఒక ఆడియన్‌గా చాలా ఆనందించాను. సూపర్‌హిటÊ అవుతుందని చెప్పాను. రొటీన్‌ కమర్షియల్‌ సినిమా అని క్రిటిక్స్‌ అన్నారు. అయితే రవితేజ గారి ప్రయోగాత్మక సినిమాలు చేశారు. అయితే అవి ఆశించినంతగా ఆడలేదు. అయితే ఇ ది శాంపిల్‌ మాత్రమే. ముందు అసలు సినిమా చూస్తారు.
ఆలీ మాట్లాడుతూ..
ఈ బేనర్‌ పెట్టడంతోటే సక్సెస్‌ స్టార్ట్‌ అయింది. ఈ బేనర్‌ పేరు అలాంటిది. భవిష్యత్‌లో తీసిన సినిమాలు తప్పకుండా విజయవంతం సాధిస్తాయి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. రవితేజ హైఓల్టేజ్‌లో పని చేశారు. హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. 'మిరపకాయ్' ఘాటుగా తీశారు. సంక్రాంతిలో సూపర్‌ హిట్‌ చేసిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు అన్నారు.
దీక్షా సేత్‌ మాట్లాడుతూ ..
ఈ సినిమా దర్శకుడి సత్తా ఏమిటో తెలిసింది. ఈ సినిమా చేయడం ఒక కొత్త అనుభూతి ఈ సినిమా మంచి విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది.
రిచా మాట్లాడుతూ ..

సినిమా విజయవంతం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఆవకాశం ఇ చ్చిన నిర్మాత దర్శకులకునా కృతజ్ఞతలు అన్నారు.
స్నిగ్థ మాట్లాడుతూ ..
ఇ ది నా తొలిసినమా ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులను నా కృతజ్ఞతులు అన్నారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ..
ఈ సక్సెస్‌ను ఎంజారు చేస్తున్నారు. దర్శకుడు అంటే రవికి నమ్మకం ఆ నమ్మకంతోనే ఈ సినిమా ఇ చ్చాడు. నా కెరియర్‌లోనే నా గురించి ఓ మంచి కేరక్టర్‌ రాశాడు దర్శకుడు అన్నారు.
రాంప్రసాద్‌ మాట్లాడుతూ ..
సినిమా చేయడం చాలా అనందంగా ఉంది. సినిమా తప్పకుండా ఆడుతుందనే నమ్మకం ముందునుండి కలిగింది. దర్శకుడు హరీష్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.
తమన్‌ మాట్లాడుతూ ..
ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞలు తెలపుకుంటున్నాను అన్నయ్య రవితేజకు. హరీష్‌ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. అతను ఎంతో కష్టపడ్డాడు. సినిమా విజయవంతం అయినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
రమేష్‌ పుప్పాల మాట్లాడుతూ ..

చాలా అనందంగా ఉంది. ఈ సినిమా విజయం వెనక కృషి చేసిన సాంకేతిక నిపుణులకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఘాటింగ్‌కు వచ్చినపుడు ఎవరికి వారు ఈ సినిమా నాది అన్నట్లుగా పని చేసుకుంటూ ఉండేవారు. నా నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ నిజం చేశారు. ఈ సినిమ విజయం గురించి వింటుంటే చాలా అనందంగా ఉంది అన్నారు.
హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ ..
ఈ సినిమా విజయవంతం అయిదంటే ఆ క్రెడిట్‌ రవితేజ గారిదే. నా మీద నాకున్న కంటే రవితేజకు నామీద ఎక్కవ దాంతో నేను అప్పుడప్పుడూ టెన్షన్‌ పడ్డాను. ఆ సమయంలో టెన్షన్‌ పడవద్దు ఈ సినిమా కాకపోతే మరో సినిమా చేద్దాము అని ధైర్యం ఇచ్చారు. నా మీద నమ్మకం ఉంచాడు. సినిమా ఇ చ్చాడు. ఈ సినిమాకు టైటిలÊ పెట్టింది రవితేజ కథ విని ఈ టైటిల్‌ను పెట్టాడు. మేము ఏది చేసినా మాకు నమ్మకం
చ్చింది రవితేజనే. అతను లేకపోతే సినిమానే లేదు. స్నిగ్ధ వాయిస్‌ నచ్చి ఆమెను ఈ సినిమా ద్వారా పరిచయం చేశాము. అలాగే సినిమాకు పని చేసిన వారందరకీ పేరు పేరున కృతజ్ఞతలు తెలపుకుంటున్నాను అన్నారు.

రాజకుమారుని సినీ ప్రస్థానం .. .. ..

 మహేష్‌ బాబు నటజీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్ణి కేంద్రీకరించడం కోసం మహేష్‌ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. డిగ్రీ పూర్తి అయ్యాక సినిమా రంగానికి తిరిగివచ్చాడు. హీరోగా మహేష్‌ బాబు తన తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాదించకపోయినా మహేష్‌ నటనకు గుర్తింపు లభించింది. 2001లో సోనాలిబింద్రే సరసన కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్‌కు తొలి హిట్‌ను అందించింది. ఆ తరువాత 2002లో వచ్చిన టక్కరిదొంగ, బాబీ రెండు సినిమాలు కూడా పరాజయం పాలయ్యాయి.
 2003లో గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఒక్కడు' చిత్రం 2003 సంవత్సరంలో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ చిత్రం మహేష్‌ బాబు సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది. అదే సంవత్సరంల విడుదలయిన నిజం చిత్రం పరాజయం పాలయ్యింది. 2003 సంవత్సరంలో మహేష్‌ బాబుకు ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నాడు. 2004లో విడుదలైన అర్జున్‌ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదని చెప్పాలి. ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది.
 2005లో విడుదల అయిన 'అతడు' చిత్రం తెలుగునాట మాత్రమే కాకా విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. ఆ చిత్రం నందగోపాల్‌ పాత్రలో మహేష్‌ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్‌కు మరొకసారి బంగారు నంది లభించింది. 
2006లో మహేష్‌ బాబు నటించిన మరో భారీ హిట్‌ సినిమా 'పోకిరి'. వ్యాపారపరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన ' సైనికుడు ' చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఆ తరువాత వచ్చిన ఏ సినిమా హిట్‌ కాలేదు. ' అతిథి ' ' ఖలేజా ' చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ప్రస్తుతం మహేష్‌ బాబు శ్రీనువైట్ల దర్శకత్వంలో ' దూకుడు ' చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలో పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో ' ది బిజినెస్‌మేన్‌' గా నటించనున్నాడు. ఈ చిత్రాలతో హిట్‌ సాధించి మరోసారి మహేష్‌ బిజినెస్‌ మ్యాన్‌గా, 'దూకుడు' ప్రదర్శిస్తాడని ఆశిస్తూ....
                                                                                      మీ స్నేహితుడు

టెస్టులు, టి20 మావీ .. వన్డేలు మీవీ ..

 ఇంగ్లాండ్‌ ‌ , ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ ‌, ఆస్ట్రేలియా మధ్య ఏడు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 5-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. టెస్టు, ట్వి 20 మ్యచ్‌లో ఇంగ్లాండ్‌ ‌ గెలిచి వన్డే సిరీస్‌లో పరాజయం పాలైంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని 49.3 ఓవర్లలో 249 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో వోక్స్‌ ఒక్కడే 6 వికెట్లు తీసి ఆస్ట్రేలియా కట్టడి చేశాడు. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 198 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది. పీటర్సన్‌ ఒక్కడే 40 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్‌మైన్‌లు ఏ ఒక్కరు రాణించలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో షేన్‌ వాట్సన్‌ బ్యాటింగ్‌లో విఫలమైన బౌలింగ్‌లో మాత్రం 3 వికెట్లు తీసుకున్నాడు. బ్రెట్‌లీ, బోలింగర్‌, హస్టింగ్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వోక్స్‌ లభించింది. ( ఇంగ్లాండ్‌ )

నేడే తేలుస్తాం ..

షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 27న భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌ కోల్‌కత్తా ( ఈడెన్‌) లోనే జరుగుతుందా ? లేదంటే.. మరో వేదికలోనా ? దీనిపై నిర్ణయం ఆదివారమే వెలవడనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి అధ్యక్షుడు శరద్‌ పవారే స్వయంగా ప్రకటించారు. ఈడెన్‌ గార్డెన్స్‌లో ఓవరాల్‌గా 4 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. వీటిలో భారత్‌- ఇంగ్లాండ్‌ ‌ మధ్య జరగాల్సిన మ్యాచే ఆ వేదికన తొలి వన్డే అయితే .. అప్పటికే ఆ స్డేడియం మరమ్యమతు పనులు పూర్తి ఆయ్యే పరిస్థితిలేదని ఈడెన్‌ నుంచి తరలిపోయిన వన్డేకు బెంగుళూరు ఆతిథ్యం ాచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుందని శరద్‌ పవార్‌ ఇప్పటికే తేల్చేశాడు.

ఆకాశమే హద్దు.. అవకాశం వదలోద్దు

నవదీప్‌, రాజీవ్‌ సాలూరి హీరోలుగా పంచి బొరా హీరోయిన్‌గా రవి కార్పొరేషన్‌ సంస్థ నిర్మిస్తున్న ' ఆకాశమే హద్దు ' చిత్రం రెండు పాటలు సహా 70 శాతం టాకీ పూర్తి చేసుకుంది. రవిచరణ్‌ మెరిపో ఈ చిత్రానికి దర్శకుడు. నిమ్మగడ్డ వేణుగోపాల్‌ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఏప్రిల్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాత మాట్లాడుతూ '' నేటి యువతరం అభిరుచులకు అద్దం పట్టే చిత్రమది. ప్రేమ, బాధ్యతల మధ్య భావోద్వేగాలను మా చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం.