Tuesday, April 5, 2016

'కామెంట్లపై వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్'

 ఇకపై ఎవరైనా తనపై కామెంట్స్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని విమర్శకులను హెచ్చరించింది బాలీవుడ్ హీరోయిన్ జరైన్ ఖాన్. తన బాధను వెల్లడించేందుకు ఇన్ స్టాగ్రామ్ ను మార్గంగా ఎంచుకుంది. తన స్కూలు డేస్, కాలేజీ రోజులలో ఎలా ఉండేదో తెలిపేందుకు ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'నా శరీరం నా ఇష్టం. నేను ఎలా ఉండాలో చెప్పేందుకు మీరేవరు. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొంతకాలం నుంచి ఆమె శరీరాకృతి గురించి చాలా రకాల విమర్శలొస్తున్నాయి. ఆమె బాడీ బికినీకి ఒప్పేలా ఉందడని, ఆమె చాలా లావుగా ఉంటుందని అందుకే అవకాశాలు ఇవ్వాలంటే దర్శకనిర్మాతలు బెదురుతారంటూ వచ్చిన కామెంట్లపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
2010లో సల్మాన్ ఖాన్ సరసన 'వీర్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హౌస్ ఫుల్, హేట్ స్టోరీ 3 మూవీలలో నటించింది. బాలీవుడ్ లో జీరో సైజ్ భామలకే గిరాకీ ఎక్కువని, కానీ జరైన్ ఈ ఇండస్ట్రీకి సెట్ అవ్వదంటూ విమర్శల నేపథ్యంలోనూ కొన్నిసార్లు అవకాశాలు కోల్పోయింది. 'ఇప్పటికే చాలా కేజీలు తగ్గాను. అయినా సన్నబడాలని, మెరుపుతీగలా తయారవ్వాలంటే నా వల్ల కాదు. ఒకసారి నా ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతోంది. వైట్ డ్రెస్ 9వ తరగతి, పింక్ డ్రెస్ ఇంటర్ చదువుతున్నప్పుడు దిగిన ఫొటోలు. అప్పటికి, ఇప్పటికీ నన్ను నేను ఎలా మలుచుకున్నానో ఆ బాధలు నాకు తెలుసు. ఇక ఎవరి వ్యాఖ్యలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అని బొద్దుగుమ్మ తీవ్రంగా విరుచుకుపడింది. చాలా మంది హీరోయిన్లు లావుగా ఉన్నప్పటికీ ఆమెను లక్ష్యంగా చేసుకుని కామెంట్లు రావడంతో మనస్తాపానికి లోనై ఈ విధంగా జరైన్ ఖాన్ తన బాధను వెల్లగక్కింది.

వాళ్ల బ్రేకప్‌ ఉత్తిదేనా..?

 బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రణ్‌బీర్‌ కపూర్‌.. కత్రినా కైఫ్‌ బ్రేకప్‌ విషయం ఓ పట్టాన కొలిక్కిరావట్లేదు. ఇటీవల బ్రేకప్‌ అయిన వీరిద్దరిని కలపడానికి ఒకవైపు వారి స్నేహితులు.. సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నా.. మరోవైపు ఎక్కడికి వెళ్లినా రణ్‌బీర్‌.. కత్రినా ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారు. దీంతో ఇక వాళ్లిద్దరు కలిసే అవకాశాలు లేవని బీటౌన్‌లో అనుకున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన వీరిద్దరు మళ్లీ ఒక్కటవుతున్నారన్న సందేహాన్ని కలిగించిందట.
ప్రస్తుతం వీరు బ్రేకప్‌ అయినా.. ‘జగ్గాజాసూస్‌’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రణ్‌బీర్‌.. కత్రినా ఒకరినొకరు కలవకుండా వేరువేరుగా ఉన్నారట. కానీ.. వీరిద్దరికి సన్నిహిత స్నేహితురాలైన ఆర్తి పుట్టిన రోజు పార్టీకి మిస్‌ కాకుండా ఒకే సమయంలో వచ్చారట. అంతేకాదు.. ఇరువురు ఆప్యాయంగా పలుకరించుకొని చాలా సేపు మాట్లాడుకున్నారట. పార్టీ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి రణ్‌బీర్‌ వెళ్లిన తర్వాత కత్రినా వెళ్లిపోయిందట. దీంతో వీరిద్దరు మళ్లీ కలిసిపోతున్నారంటూ బాలీవుడ్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఇది అంత విశ్వసనీయ సమాచారం కాకున్నా ఒకవేళ నిజంగానే సర్దుకుపోయి.. ప్రేమను కొనసాగిస్తే వారి జంటను అభిమానించే అభిమానులకు సంతోషకరమైన విషయమే కదా!