Tuesday, December 13, 2011

2011 రౌండప్‌

డిసెంబర్‌ సగం రోజులు పూర్తరుుపోరుుంది. కొత్త సంబరాల నవ ఉత్సాహంతో 2012 సంవత్సరం రాబోతోంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే తెలుగు సినిమా 80 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం. ఈ సంవత్సరం అనూహ్యంగా పెద్ద హీరోలు నటించిన చిత్రాలకు కలెక్షన్ల రికార్డులు సృష్టించడం ఒక విశేషమైతే తెలుగు సినిమా స్టామినా పెంచిన చిత్రంగా ‘దూకుడు’ రికార్డుల పరంపర కొనసాగించింది.
pavvann
బాలకృష్ణ హీరోగా బాపు దర్శకత్వంలో ఎలమంచిలి సాయిబాబు నిర్మించిన ‘శ్రీరామరాజ్యం’ నెమ్మదిగా వసూళ్లు పెంచుకుంటూ మ్యాజిక్‌ను ప్రారంభించింది. ఈ చిత్రానికి యువత ఆదరణ రోజురోజుకి పెరుగుతుండడంతో థియేటర్లు ఫుల్‌ అవుతున్నాయని సమాచారం. మనవైన పురాణేతిహాసాలను, మరుగున పడుతున్న సంస్కృతిని పునశ్చరణ చేసుకోవాలన్న యూత్‌ ఆలోచన..ఈ సినిమాకి అస్సెట్‌గా నిలుస్తోంది.తెలుగు సినిమాలలో టాప్‌ 5 సినిమాలలో అగ్రశ్రేణి వరుసలో నిలిచిపోయిన చిత్రంగా ‘దూకుడు’ నిలిచింది. హిట్టు కోసం 5 సంవత్సరాలుగా నిరీక్షించిన మహేష్‌కు పోకిరిని మించిన హిట్టుగా దూకుడు చిత్రం నిలిచిపోయింది.

ఇక మిగిలిన హీరోలను తీసుకుంటే బాలకృష్ణ హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘పరమవీరచక్ర’ అంచనాలను అందుకోలేపోయింది.కాగా బాపు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ హిట్‌ మూవీగా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుని స్టడీగా సాగిపోతోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ‘శక్తి’ చిత్రం పరాజయం కాగా ‘ఊసరవెల్లి’ చిత్రం మాత్రం కలెక్షన్ల పరంగా యావరేజ్‌గా నిలిచింది. ప్రభాస్‌కు ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ చిత్రం హిట్‌గా నిలిచింది. ఇక పవన్‌కళ్యాణ్‌ నటించిన ‘తీన్‌మార్‌’ చిత్రం ఫ్లాప్‌ కాగా ‘పంజా’ చిత్రం డివైడ్‌ టాక్‌తో నడుస్తోంది.

మరో వారం రోజులు గడిస్తేగానీ ఆ చిత్రం నిలబడిందో లేదో అనేది తెలియదు. నాగార్జున నటించిన ‘గగనం’ చిత్రం ప్రయోగాత్మకంగా ప్రశంసలందుకుందిగానీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. నాగచైతన్యకు విడుదలైన మూడు చిత్రాలలో ఒకటి హిట్టుకాగా రెండు ఫ్లాపులయ్యాయి. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘100%లవ్‌’ హిట్టుకాగా ‘దడ’, ‘బెజవాడ’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. మరి కొందరు హీరోల జయాపజయాల గురించి తర్వాత తెలుసుకుందాం....

భజ్జీ కారులో దొంగతనం

భారత స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పాస్‌పోర్టు, క్రెడిట్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఎవరో దొంగిలించారు. కర్నాల్‌ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. భజ్జీ, అతని స్నేహితుడు కలసి ఢిల్లీకి సోమవారం సాయంత్రం బయలుదేరిన సమయంలో వారు మధుబన్‌ దగ్గరే ఉన్న కర్నాల్‌లో ఆగారు. కాఫీ తాగుదామని ఇద్దరు ఆలా లోపలకి వెళ్లి పనిముగించుకుని వచ్చి చూస్తే కారు అద్దాలు పగిలిపోయి ఉండటం గమనించారు. సరికదా అనుకుని కారులోపలకెళ్లి చూస్తే పాస్‌పోర్ట్‌, క్రెడిట్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మాయం చేశారు. ఈ సంఘటన మధుబన్‌ పోలీస్‌ అకాడమీ సమీపంలోనే జరగటం విశేషం. ‘ నేను , నా స్నేహితుడు మధుబన్‌ పోలీస్‌ అకాడమీ దగ్గరలో ఉన్న ‘ కేఫ్‌ కాఫీ డే’ లో కాఫీ తాగుదామని కారు దిగాం. కారుకు లాక్‌ వేసి కాఫీ షాపులోకి ప్రవేశించాం. 

ఐదు నిమిషాల తరవాత వచ్చే చూస్తే షాక్‌. కారు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. బ్యాగ్‌లో ఉన్న వస్తువులన్ని కూడా మాయమైయిపోయాయి. ’ అని దొంగతనం అనంతరం భజ్జీ వాపోయాడు. పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు భజ్జీకి చెందిన 10 క్రెడిట్‌కార్టులు దొంగలు ఎత్తుకుపోయారు. విషయాన్ని గ్రహించిన భజ్జీ వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కనీసం తన పాస్‌పోర్టునైనా వెంటనే తిరిగి తనకు అప్పగించాలని పోలీసులను వేడుకున్నాడు.