Tuesday, January 11, 2011

నేటి నుంచి వన్డే సిరీస్‌

 భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య ఐదు వన్డే సిరీస్‌ ప్రారంభం కానున్నంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను 1-1తో సమానంచేసి, టి20 మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది. దక్షిణాఫ్రికాతో బుదవారం మొదటి వన్డే ప్రారంభంకానుంది. సెహ్వాగ్‌, గంభీర్‌ ాద్దరు గాయలతో జట్టుకు దూరం కానున్నారు. అలాగే దక్షిణాఫ్రికా జట్టులో కల్లిస్‌ తొలి రెండు వన్డేలకు దూరం.

వాంటెడ్ ‌ పాటలు విడుదల

 గోపీచంద్‌ - దీక్ష జంటగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ' వాంటెడ్‌' బి.వి.ఎస్‌ రవి దర్శకుడు ఆనంద్‌ ప్రసాద్‌ వెనిగళ్ల నిర్మాత. చక్రి సంగీత దర్శకుడు. హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో పాటలు ఆవిష్కరించారు. ఆడియో వేడుకలో రామ్‌గోపాల్‌ వర్మ, చంద్రసిద్ధార్థ, పూరీ జగన్నాథ్‌, శ్రీనువైట్ల, పోకూరి బాబూరావు, రానా, ప్రభాస్‌, భగవాన్‌, జయసుధ, బుజ్జి, సునిల్‌నారంగ్‌, స్మిత సహా గోపిచంద్‌, దీక్షసేత్‌, బి.వి.ఎస్‌.రవి, ఆనంద ప్రసాద్‌, భాస్కరభట్ల, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. ఆడియో తొలిసిడిని ప్రభాస్‌ ఆదిష్కరించి జయసుధకి ఆందించారు. రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ ' రవి చాలా కష్టించి పనిచేసే దర్శకుడు విజయం సాధించాలి' అన్నారు. పూరీ జగన్నాథ్‌ మాట్లాడుతూ ' చక్రి సంగీతం అద్బుతంగా ఉంది.