Monday, January 18, 2016

టీ20 హీరోలు యూవీ = క్రిస్‌ గేల్‌ సమం

టీ20లో వేగవంతమైన అర్థశతకం రికార్డు సమం
 


క్రికెట్‌ చరిత్రలో కొన్ని అరుదైన రికార్డులు నిమిషాలో, రోజుల్లోనే గడిచిపోతుంటాయి. మరికొన్ని తరాలు మారినా, ఏళ్లు, దశాబ్దాలు గడిచినా చెక్కు చెదరగకుండా చరిత్ర పుటల్లో నిలిచి ఉంటాయి. అలాంటి వాటిల్లో భారత బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌ 2007లో తొలిసారి జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సృష్టించి అరుదైన 12 బంతుల్లో అర్థ శతకం రికార్డు. 2007 సెప్టెంబర్‌ 19న జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ ఫ్లింటాప్‌ బౌలింగ్‌ సమయంలో క్రీజులో ఉన్న యువరాజ్‌తో వాగ్వాదాఁకి దిగాడు. దీఁపై యూవీ ఘాటుగా స్పందించాడు. ఫ్లింటాప్‌ తర్వాత బౌలింగ్‌కు వచ్చాన స్టువర్డ్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతులను సిక్సర్లుగా మలిచేశాడు. 12 బంతులల్లో3/4,6/6 సాయంతో 50 పరుగులు చేసి టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ రికాడ్డు సమీపంలోకి చాలా మంది క్రికెటర్లు వచ్చినా దాన్ని బద్దలు కొట్టలేకపోయారు.
వెస్టిండీస్‌ వీరుడు సమం చేశాడు...?
తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ టీ20 టోర్నీలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌గేల్‌ రికార్డును సమం చేశాడు. టోర్నీలో మెల్‌బోర్న్‌ రెఁగేడ్స్‌ తరపున బరిలోకి దిగిన క్రిస్‌గేల్‌ 12 బంతులల్లో 1/4, 7/6 సాయంతో 50 పరుగులు చేశాడు.

ఆ కుటుంబాన్ని కలవడం ఆనందం: నాగార్జున

 బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ దంపతులను కలవడం ఎప్పటికీ ఆనందమేనని నాగార్జున అన్నారు. ఓ వాణిజ్య సంస్థ ప్రకటన షూటింగ్‌లో భాగంగా నటుడు ప్రభుతోపాటు అమితాబ్‌, జయ బచ్చన్‌లను కలిసిన ఫొటోను నాగార్జున తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రకటన కోసం తన స్నేహితుడు ప్రభు, అమితాబ్‌, జయ బచ్చన్‌లను కలవడం ఆల్‌వేస్‌ ప్లెజర్‌ అంటూ ట్వీట్‌ చేశారు. అదేవిధంగా వారితో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. గతంలో కూడా నాగార్జున బిగ్‌బి అమితాబ్‌తో కలిసి ఓ వాణిజ్యసంస్థ ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే.