Saturday, December 10, 2016

చిరు స్టెప్పులు అదుర్స్‌.. స్పాట్‌ వీడియో లీక్‌!

 ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు మళ్లీ వెండితెరపై తళుక్కుమనబోతున్నారు. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటూ 150 చిత్రంతో మరోసారి తన అభిమానుల్ని అలరించబోతున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 150వ సినిమా 'ఖైదీ నంబర్‌ 150'. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్నది.
మరోసారి మెగాస్టార్‌ తనదైన స్టైల్‌తో, స్టామినాతో దూసుకుపోనున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన లీకైన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 'ఖైదీ నంబర్‌ 150' సినిమాలోని ఓ పాటకు చిరంజీవి, కాజల్‌ స్టెప్పులు వేస్తుండగా.. షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న ఓ వ్యక్తి దానిని రహస్యంగా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంతో ఇది బాగా హల్‌చల్‌ చేస్తోంది.

http://www.sakshi.com/news/movies/chiru-movie-shooting-video-leak-430812?pfrom=home-top-story

క్షమాపణ కోరిన మంచు లక్ష్మీ

 సినీరంగంలో జరిగే పరిణామాలతో పాటు సామాజిక అంశాలపై కూడా ఈ మంచువారమ్మాయి లక్ష్మీ ప్రసన్న  స్పందిస్తుంటుంది. త్వరలో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటోంది. ' గత నెల ఇదే రోజు.. కాస్ట్రో జీవించి ఉన్నాడు. అమ్మ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకొనేందుకు సిద్ధమవుతోంది. మీ అందరి దగ్గర డబ్బుంది' అంటూ ట్వీట్ చేసింది.
అయితే ఈ ట్వీట్ తాను ముందుగానే చేశానని అదే ట్వీట్ ను మంచు లక్ష్మీ కాపీ చేసిందంటూ సదరు వ్యక్తి లక్ష్మీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయటంతో ఆమె క్షమాపణ చెప్పింది. తనకు ఫ్రెండ్ ద్వారా వచ్చిన ఆ మెసేజ్ లో పేరు లేకపోవటంతో క్రెడిట్ ఇవ్వకుండానే తాను ట్వీట్ చేశానని అందుకు తనను క్షమించాలని కోరింది. అంతేకాదు ఆసక్తికరమైన ట్వీట్ చేసిన ఆ వ్యక్తిని అభినందించింది.

సినీ రంగంలో వారసురాళ్లుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు చాలా తక్కువ. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో వారసురాళ్లు తెర మీదకు రావడమే చాలా అరుదు. కానీ మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మీ మాత్రం ఈ సాంప్రదాయాలకు మినహాయింపు. కలెక్షన్ కింగ్ వారసురాలిగా వెండితెర అరంగేట్రం చేసిన లక్ష్మీ  నటిగానే కాక నిర్మాతగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినీ రంగంతో పాటు ఇతర వ్యాపార రంగాల్లోనూ దూసుకుపోతోంది.