Monday, October 10, 2011

క్రికెట్‌లో కొత్త నిబంధనలు

ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు అమలులోకి రానున్నాయి. రానున్న ఇండియా, ఇంగ్లాండ్‌ సిరీస్‌ ఈ నిబంధనల ప్రకారమే నడుస్తుంది. ఈ నెల 14 నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి వన్డే ప్రారంభమవుతుంది. క్రికెట్‌కు ఒ కొత్త లుక్‌ తీసుకురావడానికి ఐసీసీ తీసుకున్న నిర్ణయాలు అమలులోకి వచ్చాయి. ఐసీసీ క్రికెట్‌ కమిటీ సూచించిన ప్రతిపాదలను ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోందించింది. దీని ప్రకారం వన్డేలతో పాటు అన్ని ఫార్మాట్‌లలోనూ కొన్ని కీలక మార్పులు రానున్నాయి. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగి మ్యాచ్‌లో అన్ని నిబందంనలు జరుగుతాయి. ఐసీసీ కొత్త నిబంధనలు ప్రకారం వన్డేల్లో ఒక్కో ఎండ్‌ నుంచి ఒక్కో బంతి వాడాలన్నది ఇందులో ముఖ్యమైనది. ఒక పవర్‌ ప్లేలలోనూ కీలక మార్పులు తెచ్చారు. గతంలోలాగే 20 పవర్‌ ప్లే ఓవర్లలో తొలి 10 ఓవర్లు తప్పనిసరి. అయితే మిగతి 2 పవర్‌ప్లేలను మాత్రం 16 నుంచి 40 ఓవర్ల మధ్య వాడాలని నిబంధన విధించారు. ఇప్పటి నుంచి ఏ ఫార్మాట్లోనైనా రన్నర్‌ను అనుమతించరు. ఇక ఫీల్డర్‌ను బ్యాట్స్‌మెన్‌ కావాలనే అడ్డుకుంటే ఔట్‌గా ప్రకటించే అవకాశం అంపైర్‌లకు వుంటుంది. మిగిత నిబంధనలు సంగతి ఎలా వున్నా వన్డేల్లో ఒక్కో ఎండ్‌ నుంచి ఒక్కో బాల్‌ వాడటం, పవర్‌ప్లేలో మార్పులు 50 ఓవర్ల ఫార్మెట్‌కు కొత్త లుక్‌ను తీసుకొస్తాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా 16 నుంచి 40 ఓవర్ల మధ్య రెండు పవర్‌ప్లేలను వాడలనే నిబంధనలతో ఇక నుంచి మధ్య ఓవర్లలో మ్యాచ్‌ బోర్‌ కొట్టే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. భారత్‌, ఇంగ్లాండ్‌ సీరిస్‌తోనే ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానుండడంతో మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా నడుస్తాయని అభిప్రాయం.