Sunday, August 22, 2010

ఎనిమిది వికెట్ల తేడాతో లంక ఘన విజయం


 టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 103 పరుగులకే అలౌట్‌ అయ్యింది. 104 లక్ష్యంతో దిగిన లంక 15.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి, 104 పరుగులు చేసి విజయం సాధించింది. జయవర్థన్‌ 33, దిల్షాన్‌ 35, పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. సంగక్కర 13, తరంగ 12 పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. భారత్‌ బ్యాట్‌ మెన్స్‌లో యువరాజ్‌ సింగ్‌ 38 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు రెండు అంకెల స్కోరు కూడా చేయలేదు. లంక బౌలర్లలో పెరారి 5, మలింగా , కులశేఖర్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మాథ్యస్‌ 1 వికెటు లభించింది. పెరారి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.