Thursday, July 6, 2017

అప్పుడు ‘ఈగ’ ఇప్పుడు ‘చేప’?

 నాని కథానాయకుడిగా నటించిన ‘ఈగ’ చిత్రాన్ని ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు ఓ చేప నేపథ్యంలో సినిమా రాబోతోంది.
అది కూడా నాని ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రశాంత్‌ శర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు టాక్‌. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని సైతం రూపొందించారట. అయితే ఈగ సినిమాలోలాగా ఈ సినిమాలోనూ నాని నటిస్తారా లేదా అన్న విషయం మాత్రం తెలీదు.
నాని కథానాయకుడిగా నటించిన ‘నిన్ను కోరి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నివేదా థామస్‌ కథానాయిక. ఆది పినిశెట్టి మరో ప్రధాన పాత్రలో కన్పిస్తారు.

Monday, July 3, 2017

కప్పు కాఫీ కూడా ఇవ్వలేదు

  చిత్ర రంగానికి చెందిన వారి ప్రేమ వివాహాలు చిరకాలం కొనసాగుతాయన్నది అరుదనే చెప్పాలి. అలాంటి వారిలో ఆదర్శ దంపతులుగా ఆనంద జీవితాన్ని గడుపుతున్న జంట సూర్య, జ్యోతిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక తరంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్, కమలహాసన్‌ల నుంచి శింబు, ధనుష్‌ల వరకూ జత కట్టి ప్రముఖ కథానాయకిగా రాణించిన జ్యోతిక అత్యధిక చిత్రాల్లో జత కట్టింది మాత్రం నటుడు సూర్యతోనే. ఆ పరిచయం వారి మధ్య సాన్నిహిత్యాన్ని, ఆ తరువాత ప్రేమను, ఆపై పెళ్లికి దారి తీసింది. సూర్య, జ్యోతికలకు ఇప్పుడు దియా, దేవ్‌ అనే ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే.
అలా అందమైన జీవితాన్ని అనుభవిస్తున్న జ్యోతిక సుదీర్ఘ విరామం తరువాత 36 వయదినిలే చిత్రం ద్వారా నటిగా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ప్రేక్షకామోదం పొందడంతో తాజాగా మగళీర్‌ మట్టుం చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాలు అటుంచితే సూర్య లాంటి మంచి లక్షణాలున్న మగాళ్లు చాలా తక్కువ మంది ఉంటారని జ్యోతిక ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఆయనకు తానింత వరకూ ఒక కప్పు కాఫీ కూడా కలిపివ్వలేదన్నారు. పలాన పని చేయమని సూర్య తనకు చెప్పింది లేదని అన్నారు. సూర్యలో సగం మంచి గుణాలు తన కొడుకు దేవ్‌కు అబ్బినా చాలని జ్యోతిక పేర్కొన్నారు. ఇక సూర్య కూడా జ్యో తనకు భార్యగా లభించడం తన అదృష్టం అని చాలా సార్లు బహిరంగంగానే చెప్పారన్నది గమనార్హం.