Thursday, January 31, 2013

' ఛీ ' కొడతారు

కాంగ్రెస్‌ తీరు ఎప్పటి మారుతుందో. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైపోతుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ప్రజలల్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్‌ను తిట్టిపోతున్నారు. ఎంత తిట్టినా కాని కాంగ్రెస్‌లో మార్పు ఉండదు అన్ని గట్టిగా చేబుతున్నారు. ఒకప్పుడు చెయ్యి గుర్తు అనగానే ప్రజల్లో అనందం కలిగేది. ఇప్పుడు అదే ప్రజలు ' ఛీ ' అంటున్నారు.   
ఎందుకు అనగా ... ?
కాంగ్రెస్‌ ప్రజల సమస్యలను తీర్చడం లేదు. అలాగే ప్రజలపై తీవ్ర భారాలు వేస్తున్నారు. ఓటేసిన పాపానికి అనేక రకాలుగా భారాలు మోపుతూ చక్కటి బుద్ధి చెబుతున్నారు. డీజిల్‌, పెట్రోల్‌, ఆర్టీసి ఛార్జీలు ఇలా ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోతే ప్రజల జీవనం రోజురోజుకూ దుర్భరంగా మారిపోతోంది. కాంగ్రెస్‌ అధిరారంలో ఉన్నన్నిరోజులు ఈ నాటకాలు కొనసాగిస్తుందని సమాన్య ప్రజానికానికి చాలా భాగా అర్థమైంది. ఈ విధంగా అడ్డగోలుగా పరిపాలిస్తూ పోతే, వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెబుతారు.