Wednesday, July 6, 2011

మొదటి రోజు వెస్టిండీస్‌ 75/3


 భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు ప్రారంభంమయింది. టాస్‌ గెలిచి భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌ జట్లులో ఇషాంత్‌ శర్మ, మునాఫ్‌పటేల్‌, ప్రవీణ్‌కఁమార్‌ ముగ్గురు పేస్‌ బౌలర్‌తో బరిలోకి దిగారు. టాస్‌ ఓడి బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 35 పరుగులుకే మూడు వికెట్లు కోల్పోయింది. భారత్‌ ( 12), పోవెల్‌ (3), ఎడ్వ్‌ర్స్‌ (6) పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. భారత్‌ బౌలింగ్‌లో ఇషాంత్‌ శర్మ మరో సారి తన సత్తా నిరుపించాడు. ప్రవీణ్‌కుమార్‌ ఒక వికెట్టు లభించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ రెండో రోజుకి వాయిదా పడింది. చివరికి క్రీజులో బ్రావో 22, చందర్‌పాల్‌ 17 పరుగులతో ఉన్నారు.