Friday, January 21, 2011

ఈ. వి. వి సత్యనారాయణ కన్నుమూత

 కామెడీ చిత్రాల నిర్మాత డైరెక్టర్‌ ఈ.వి.వి సత్యనారాయణ ఇక లేరు. ఆయన గత కొద్ది కాలం గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈయన ఈ నెల 19 న అపొల్లో హస్పటల్‌ లో. ఱ. ష. బ లో చికిత్స పొందుతున్నారు. ఆయన తొలి సినిమా ' చెవిలో పువ్వు ' తో సినిమాలో ప్రవేశించారు. ఈయన చివరి సినిమాగా తన కొడుకు అల్లరి నరేష్‌తో కత్తి కాంతారావు సినిమాకు దర్శకత్వం వహించారు.ఈయన వయసు 55 సంవత్సరాలు. 1958 జూన్‌ 10. పశ్చిమ గోదావరి, జిల్లా దొమ్మేరు గ్రామంలో వ్యవసాయం కుటుంబంలో జన్మించారు.

నాల్గొవ వన్డేలో పరాజయం

భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతన్న నాల్గొవ వన్డేలో 48 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఇరు జట్లు 2-2 సమానంగా నిలిచాయి. భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న నాల్గోవ వన్డేలో సౌతాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నది. 50 ఓవర్లలో 265 పరుగులు చేసింది. డుమ్మిని 71, స్టెయిన్స్‌ 4 పరుగులుతో క్రీజులో ఉన్నారు. ఆమ్లా, స్మిత్‌ ఇద్దరు కలిసి బ్యాటింగ్‌ ప్రారంభించారు. ఆరభంలో పరుగుల వరద కురిపించారు. ఆమ్లా అర్థ సెంచరీ కదం తోక్కాడు. మరో ఓపెనరు స్మిత్‌ 18 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌గా వచ్చిన వాన్వఆక్‌ 15 తక్కువ పరుగులకే పెవిలియమ్‌ చేరుకున్నాడు. క్రీజులో ఆమ్లా, డివిలర్సు ఉన్నారు. అ తరువాత వికెట్ల పతనం ఆరభం అయ్యింది. నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసుకుంది. వాన్వఆక్‌ 15, డివిలర్సు 3 పరుగులు చేసి యువరాజ్‌ సింగ్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యారు. ఆమ్లా లేని పరుగుల కోసం ప్రయత్నించి రనౌట్‌గా అయ్యాడు. ప్లెస్సిన్‌ 1 పరుగు చేసి రనౌట్‌ అయ్యాడు. డుమ్మిని, బోథా ఇద్దరు 50 పరుగులు అర్థ సెంచరీ బ్యాగస్వాముల అయ్యారు. బోతా 44 పరుగులు చేసి యువరాజ్‌ సింగ్‌ బౌలింగ్‌లో ధోని క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. తన అత్యధిక స్కోరు కూడా చేయలేక పోయాడు. భారత్‌ బౌలింగ్‌లో యువరాజ్‌ సింగ్‌ 3 , నెహ్రా ఒక వికెట్‌ తీసుకున్నాడు. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 32.5 ఓవర్లలో 142 పరుగుల చేసింది. అప్పటికే వర్షం అడ్డుకోవడంతో డక్‌వర్త్‌ ప్రకారం 48 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. భారత్‌ బ్యాటింగ్‌లో ఏ మాత్రం పదును లేదు. కోహ్లీ ఒక్కడే 87 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మురళీ విజరు పక్కన పెట్టి పార్థివ్‌ పాటేల్‌ తీసుకున్నారు. పార్థీవ్‌ పాటేల్‌, రోహిత్‌ శర్మ ఇద్దరు కలిసి బ్యాటింగ్‌ ప్రారంభించారు. రోహిత్‌ శర్మ 1 పరుగు చేసి నిరాశ పరిచాడు. మరో ఓపెనరు 11 పరుగుల చేసి అవుట్‌ అయ్యాడు. యువరాజ్‌ అదుకున్న అనిపిచినా 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. రైనా కొద్ది సేపు సహాకరించాడు. అతరువాత అతను కూడా పెవిలియన్‌ చేరుకున్నాడు. ధోని, పఠాన్‌ చెరో రెండు పరుగులు చేసి పెవిలియన్‌ క్యూ కట్టారు. సౌతాఫ్రికాతో జరిగినా నాల్గువ వన్డేలో కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఒక మ్యాచ్‌లో కూడా అర్థ సెంచరీ చేయలేదు. మొదటి వన్డేలో కోహ్లీ అర్థ సెంచరీ. రెండో వన్డేలో యువరాజ్‌ సింగ్‌ అర్థసెంచరీ, మూడోవన్డేలో యూసుఫ్‌ పఠాన్‌ చేలరేగడంతో భారత్‌ 2-1 తేడాతో ఉన్నది. నాల్గొవ వన్డేలో మాత్రం కోహ్లీకి ఎవరు సహకరించలేపోయారు. వర్షం కారణంగా మ్యాచ్‌ రెండు సార్లు నిలిపివేశారు. అప్పటికే క్రీజులో కోహ్లీ, హర్భజన్‌ సింగ్‌ ఇద్దరు. ఉన్నారు. 87 బంతులలో 123 పరుగులు చేయాలి.

రెండో వన్డేలో గెలుపు

 ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఏడు వన్డే సిరీస్‌లో ఆసీస్‌ 2-0 తేడాతో ముందుంది. యాషెస్‌, టి20 మ్యాచ్‌లో ఓడిపోయిన ఆసీస్‌ వన్డే సిరీస్‌ గెలిచి ప్రతీకారం తీసుకోవాలని పట్టుదలగా ఉన్నది. ఇప్పటికే 2-0 తేడాతో కోనసాగుతుంది. మొదటి వన్డేలో వాట్సన్‌ 161 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ రోజు జరిగిన రెండో వన్డేలో మార్ష్‌ 110, వైట్‌ 45 పరుగులు చేశారు. మిగితా బ్యాట్‌మెన్‌లు రాణించలేకపోయారు. బౌలింగ్‌లో బొలింగర్‌ 4, బ్రెట్‌లీ 2, వాట్సన్‌, స్మిత్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. ఇంగ్లండ్‌ 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 184 పరుగులు చేసింది.

వినాయక్‌ డైరెక్షన్‌లో చిరంజీవి !

చిరంజీవి 150వ చిత్రంగా వినాయక్‌ డైరక్షన్‌లో ' అధినాయకుడు' ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి- వినాయక్‌ల కాంభినేషన్‌లో 'ఠాగూర్ వచ్చింది. అర్నెల్ల క్రితం మీడియాలో చాలా హడావిడి జరిగింది. అయితే అంతలోనే రాజకీయపరంగా వచ్చిన పెను మార్పులతో చిరంజీవి సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం వినాయక్‌ అల్లు అర్జున్‌తో ' బద్రీనాథ్‌' చేస్తున్నారు.

వ్యభిచారం కేసులో పట్టుబడ్డ సినినటి .......

పలు తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన యమున, బెంగుళూరులోని ఓ హోటల్‌ వ్యభిచారం చేస్తూ వుండగా, ఆమెను పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారుa, నిన్న రాత్రే జరిగినా ఈ రోజు మధ్యాహ్నం పోలీసులు బయలు పెట్టరు. యమునతో పాటు మరో 9 మంది పోలీసులు అరెస్ట్‌ చేసినట్లుగా తెలిసింది. వీరిలో కొందరు సినీ నటీమణులూ వున్నట్లు సమాచారం వ్యక్తమవుతున్నాయి.