Wednesday, February 22, 2017

ఆయన ప్రపోజ్‌ చేశారు: ఖుష్బూ

 అందం, చక్కటి అభినయంతో ఒకప్పుడు అగ్రకథానాయికగా రాణించిన నటి ఖుష్బూ తన ప్రేమ జీవితం గురించి సోషల్‌మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. 22 ఏళ్ల క్రితం తీసిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఆ సందర్భాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘22 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 22న నేను ‘మురైమమన్‌’ సినిమా షూటింగ్‌లో ఉన్నా.. ఆ సమయంలో ఆయన నాకు ప్రపోజ్‌ చేశారు. జంటగా ఇద్దరి ప్రయాణం అలా మొదలైంది’ అని ఖుష్బూ ట్వీట్‌ చేశారు.
2001లో ఖుష్బూ, సి. సుందర్‌ల వివాహం జరిగింది. వీరికి అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖుష్బూ ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌- త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న మరో చిత్రంలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.