Monday, February 1, 2016

మా మధ్య ఉన్నది అది కాదు

సిద్ధార్థ్‌ మల్హోత్రా, ఆలియా భట్‌ల మధ్య బంధం గురించి కొంత కాలంగా బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’తో అరంగేట్రం చేసిన వీరిద్దరూ అప్పటి నుంÍే మంచి స్నేహితులుగా మారిపోయారు. పార్టీలకు, ప్రివ్యూ షోలకు జంటగా హాజరై మీడియా దృష్టిని ఆకర్షించారు. దీంతో వీరి మధ్య స్నేహానికి మించిన బంధమేదో ఉందన్న వార్తలు బలంగా వినపడుతున్నాయి. దీని గురించి సిద్ధార్థ్‌ స్పందించాడు. ‘‘నాకు, ఆలియాకు సినిమాల్లోకి రాకముందు నుంచే పరిచయముంది. ఒకే చిత్రంతో వెండితెరకు పరిచయం కావడం వల్ల స్నేహితులుగా మారిపోయాం. అవసరమైనప్పుడు ఒకరి సినిమాలకు మరొకరం మద్దతుగా నిలుస్తుంటాం. అంతమాత్రాన మా స్నేహాన్ని వేరే ఉద్దేశంతో చూడకూడదు. అలాంటి వార్తలు నా కుటుంబాన్ని బాధించాయ’’ని చెప్పాడు సిద్ధార్థ్‌. ప్రస్తుతం వీరిద్దరూ ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’లో నటిస్తున్నారు. ఆలియా అద్భుతమైన నటి అని, ‘హైవే’ చూస్తే ఆమె సత్తా అర్థమవుతుందని ప్రశంసించాడు సిద్ధార్థ్‌.

రజనీతో కలిసి చేయడం అద్భుతం!

 దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి రోబో సినిమా సీక్వెల్‌లో కలిసి నటించడం అద్భుతంగా అనిపిస్తోందని బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అంటున్నాడు. సీక్వెల్‌లో కూడా రజనీకాంత్ సైంటిస్టుగాను, ఆయన తయారుచేసే రోబో 'చిట్టి'గాను నటిస్తుండగా, విలన్ పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్నారు. ఇప్పటికే తన సినీజీవితంలో అనేక ఫైట్లు చేశానని, ఇప్పుడు రజనీకాంత్ లాంటి సూపర్ హీరోతో పంచ్‌లు తినడం చాలా గొప్పగా అనిపిస్తోందని అక్షయ్ చెప్పాడు. నెగెటివ్ పాత్ర పోషించాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానన్నాడు. అయితే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధం కావడం లేదు. దానికి ఎలాంటి ట్రైనింగు తీసుకోవట్లేదని అక్షయ్ చెప్పాడు. నన్నెవరూ చూడలేదు
తాను ఇంతకుముందు రజనీకాంత్‌ను కలిసిన సందర్భాన్ని అక్షయ్ గుర్తుచేసుకున్నాడు. తాను ఆయన వద్దకు వెళ్లేసరికి 15 మంది ఆయన కోసం వేచి చూస్తున్నారని, అందరూ ఆయనవైపే చూస్తున్నారని అన్నాడు. ఆయన టీ తాగుతూ.. ప్యాంటుమీద దుమ్ము ఉంటే దులుపుకొన్నారని, అందరూ ఒక్కసారిగా ఊపిరి భారంగా పీల్చుకున్నారని చెప్పాడు. తాను కూడా తన ప్యాంటు మీద దుమ్ము ఉంటే దులుపుకొన్నానని, కానీ అయితే అక్కడ ఎవరూ తనవైపు చూడలేదని తెలిపాడు. రోబో మొదటి భాగంలో ఐశ్వర్యారాయ్ నటించగా.. సీక్వెల్‌లో మాత్రం అమీ జాక్సన్ నటిస్తోంది. అలాగే డేనీ స్థానంలో అక్షయ్ వస్తున్నాడు.