Monday, July 7, 2014

విలన్‌గా.. చేయాలనుంది..

'చాలా రోజుల తర్వాత మంచి కుటుంబ కథా చిత్రాన్ని చేశాను. 27 సంవత్సరాల కెరీర్‌లో 'హైటైం'లో చేసిన సినిమా ఇది. రైట్‌టైమ్‌ అనేది మనచేతుల్లోలేదు. కానీ హైటైం అనేది ఎప్పుడోవస్తుంది. ఈ విభాగంలో థ్రిల్లర్‌ ఎలిమెంట్‌ ఉన్న కథను చేయలేదు. అది 'దృశ్యం'తోనే కుదిరింది' అని విక్టరీ వెంకటేష్‌ అన్నారు. రాజ్‌కుమార్‌ ప్రొడక్షన్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన 'దృశ్యం' చిత్రం ఈనెల 11న విడుదలవుతుంది.