Monday, August 29, 2011

బాలయ్యతో జతకట్టనున్న త్రిష

 బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ' హరహరమహాదేవ ' చిత్రం బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన త్రిష నటించనుంది. ఇప్పటికే నాగర్జున, వెంకటేష్‌, చిరంజీవి, సరసన నటించిన త్రిష ఇప్పడు బాలకృష్ణతో నటించనడానికి సిద్దం కాన్నుంది. టీలీవుడ్‌లో అగ్రహీరోలతో నటించిన త్రిష ఇప్పుడు బాలకృష్ణతో నటిస్తుంది. శ్రీ సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో బెల్లకొండ సురేష్‌ నిర్మించే ఈ చిత్రానికి పరూచూరి బద్రర్స్‌ కథను సమకూర్చస్తున్నారు.

చిరంజీవి 150వ చిత్రానికి హీరోయిన్‌గా శ్రీదేవి ఎంపిక ... ?

 చిరంజీవి 150వ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు ? అంశంపై ఎప్పటికప్పుడు రకరకాల ఊహగానాలు చెలరేగుతున్నాయి. ఈ ఊహాగానాల్లో భాగంగా అతిలోక సుందరి శ్రీదేవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకోవడం వలన చిరంజీవి కలిగే అడ్వాంటేజ్‌ ఏమిటంటే.. హిందీలోనూ ఈ సినిమాకు విపరితమైన ప్రచారం లభిస్తుంది. కాబట్టి శ్రీదేవి హీరోయిన్‌గా తీసుకుంటే.. తనకు, తన చిత్రానికి జాతీయస్థాయిలో ప్రచారం లభిస్తుంది.

Saturday, August 27, 2011

అనుష్క స్థానంలో తమన్నాకు చోటు

ప్రభాస్‌ హీరోగా లారెన్స్‌ దర్శకత్వంలో ' రెబల్‌ ' చిత్రంలో వస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించాల్సిన అనుష్క అర్థాంతరంగా తప్పుకుంది. అయితే ప్రస్తుతం అనుష్క స్థానంలో మిల్క్‌ బ్యూటీ తమన్నాను తీసుకున్నారు. ఇంతకుముందు ఎవరైన అవకాశిమిస్తే బాగుండని ఎదురు చూసిన తమన్నాకి ఇప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

Friday, August 26, 2011

దసరా సినిమాలివే

సినిమాలకి కలిసొచ్చే సీజన్లలో ఒకటైన దసరాకి ప్రతి ఏటా భారీ సినిమాలు అనేకం విడుదలవుతుంటాయి. ఈ సారి కూడా దసరాకి భారీ చిత్రాలు విడుదలకు సిద్దంగా వున్నాయి. ఏకంగా అరడజనుకి పైగా చిత్రాలు వస్తున్నాయి. ముందుగా దసరా సందర్భంగా మహేష్‌ బాబు ఓపెనింగ్‌ చేస్తున్నాడు. దూకుడు సినిమా తర్వాత, బాలకృష్ణ చిత్రం శ్రీరామరాజ్యం వస్తుంది. ఎన్టీఆర్‌ నటించిన ఊసరవెల్లి కూడా దసరాకే విడుదల సిద్దంగా వున్నాయి అని నిర్మాతలు చెబుతున్నారు. ఇవి కాకా గోపిచంద్‌ ( మొగుడు ), నాగార్జున ( రాజన్న ), వెంకటేష్‌ ( బాడీగార్డ్‌) విడుదలకు సిద్దంగా వున్నాయి. ఈ సారి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Wednesday, August 24, 2011

ఇంగ్లాండ్‌ సిరీస్‌ కారణాలు ఇవేనా ..!!

నెంబర్‌వన్‌గా ఉన్న టీమిండియా ఇప్పుడు నెంబర్‌ త్రీ స్థానంలో ఉంది. దానికి కారణాలు పలురకాలు కనిపిస్తున్నాయి.
ఎప్పుడు ఊహించని విధంగా టీమిండియా, ఇంగ్లాండ్‌ సిరీస్‌లో మరీ చెత్త బ్యాటింగ్‌, బౌలింగ్‌తో కూడిన జట్టు అని నిరూపించుకుంది. ఇంగ్లాండ్‌ సిరీస్‌ ప్రారంభమైన నుంచి అని ఎదురు సమస్యలు ఎదురుకొట్టుంది. తొలి టెస్టు మ్యాచ్‌లో జహీర్‌ ఖాన్‌ గాయంతో తప్పుకున్నాడు. అదే మ్యాచ్‌లో ఓపెనరు గంభీర్‌ కూడా గాయం పాలయ్యాడు. టీమిండియాలో ఒకరి తరువాత మరోకరు గాయంతో తప్పుకోవడం తప్ప జట్టుకు ఎవరు సహాయపడలేదు. జట్టులో ఉన్న వారుకూడ సరిగా అడలేకపోవడం అది కూడా సమస్యగా మారింది.
బ్యాటింగ్‌ .......
1) గంభీర్‌
2) సెహ్వాగ్‌
3) సచిన్‌
4) లక్ష్మణ్‌
5) రైనా
6) ముకుంద
7) కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ
బౌలింగ్‌ .......
1) శ్రీశాంత్‌
2) ఇషాంత్‌ శర్మ
3) జహీర్‌ ఖాన్‌
4) మునాఫ్‌ పటేల్‌
5) అమిత్‌ మిశ్రా
పైన ఉన్న వాళ్లు కనీసం ఒక్కరు కూడా సెంచరీ సాధించలేకపోయారు.
ఇంగ్లాండ్‌ సిరీస్‌లో టీమిండియాకు ఒక్కరి కూడా కలసి రాలేదు. ముఖ్యంగా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్స్‌లను అవుట్‌ చేయ్యడానికి పలు విధాలుగా ప్రతియ్నంచాడు. సెంచరీలు, డబులు సెంచరీలు చేస్తుంటే వాళ్లను చూడడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది.

Monday, August 22, 2011

ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ వైట్‌వాష్‌

ఇంగ్లాండ్‌ 4-0 కైవసం
సచిన్‌ సెంచరీ మిస్‌ 
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు అలౌట్‌ అయ్యింది. ఇంగ్లాండ్‌ ఎనిమిది పరుగులతో ఇన్నింగ్స్‌ విజయం సాధించింది. సిరిసీను 4-0తో ఇంగ్లాండ్‌ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌ 300 పరుగులు చేసిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 129/3తో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ నాలుగో వికెటుకు 144 పరుగులు జోడించింది. సచిన్‌, మిశ్రా ఇద్దరు మరో వికెటు పడకుండా జాగ్రత పడ్డారు. కనీసం ఈ మ్యాచ్‌నైనా డ్రా చేసుకోవాలిని భారత జట్టు భావిస్తోంది. చివరికి ఆశ నిరాశగా మిగిలిపోయింది. లంచ్‌ వరకు భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 216/3 పరుగులు చేసింది. సచిన్‌ 72, మిశ్రా 57 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మరో వికెట్టు పడ్డకుండా జాగ్రత పడ్డారు. చివరికి అమిత్‌ మిశ్రా స్వాన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. 141 బంతులలో 10 ఫోర్లు సహయంతో 84 పరుగులు చేశాడు. 16 పరుగులు తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. మరుసటి ఓవర్లలో బెన్నస్స్‌ బౌలింగ్‌లో ఎల్‌ బిడబ్యూగా సచిన్‌ అవుట్‌ అయ్యారు. 172 బంతులలో 11 ఫోర్లు సహయంతో 91 పరుగులు చేశాడు. తోమ్మిది పరుగుతో సెంచరీ కోల్పోయ్యాడు. సచిన్‌ తన 100వ సెంచరీ చేసి డ్రాగా ముగించాలిన భావించాడు. కాని సచిన్‌ సెంచరీ చేయలేదు. అతరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు కనీసం ఒక్కరు కూడా క్రీజులో ఉండాలని ప్రయత్నించాల లేదు. సురేష్‌ రైనా 0, కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని 3, ఆర్‌ పి సింగ్‌ 0, గంభీర్‌ 3, శ్రీశాంత్‌ 6 పరుగులు చేసి అలౌట్‌ అయ్యారు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లో స్వాన్‌ 6, బ్రాడ్‌ 2, బెన్నస్‌ , అండర్సన్‌ చెరో వికెటు లభించింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఇయాన్‌ బెల్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ బ్రాడ్‌ లభించింది. దీంతో భారత్‌ మూడవ స్థానానికి దిగజారింది. ఇంగ్లండ్‌ నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంది.

Thursday, August 18, 2011

దర్శకుడు బిజీ, హీరో బిజీ కాని, ఇద్దరి కాంబినేషన్‌లో మరొ సినిమా

ఎన్టీఆర్‌- పూరీ కాంబినేషన్‌లో మరో సినిమాకి రెడీ అయ్యారు. ఇంతక ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ' ఆంధ్రావాలా' వచ్చింది. ఈ జోడీ మరోసారి సినిమాకి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ' ఊసరవెల్లి' , ' దమ్ము' చిత్రాలలో బిజీగా ఉండగా, దర్శకుడు పూరీ కూడా ' బిజినెస్‌ మ్యాన్‌ ' ' ఇండియట్‌ -2' చిత్రాలలో అంతే బిజీగా ఉన్నారు. కాబట్టి వీరి సినిమా దాదాపు 2012 సంవత్సరంలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్యాయి.

రజనీకాంత్‌కు మరోసారి వైద్యపరీక్షలు

రాణా చిత్రం ఘాటింగ్‌ సమయంలో రజనీకాంత్‌ అనారోగ్యానికి గురైన సంగంతి తెలిసిందే. రజనీకాంత్‌కు మరో సారి వైద్య పరీక్షలు చేయాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం రజనీకాంత్‌ తన పెద్ద కూతురు ఐశ్వర్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు రజనీకాంత్‌కు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

Wednesday, August 17, 2011

చికిత్స కోసం ఆస్ట్రేలియా వెళ్తుతున్న అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ హీరోగా ఇటీవలే ' వరుడు ' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘాటింగ్‌ సమయంలో అల్లు అర్జున్‌ చేతికి గాయమైంది. ఆ గాయాన్ని ఏ విధంగా లెక్క చేయకుండా ఆ సినిమాను పూర్తి చేశాడు. ఆ గాయంతోనే మరో చిత్రం ' బద్రీనాథ్‌ ' సినిమా కూడా పూర్తి చేశాడు. అ తరువాత తెలిసింది గాయం పెద్దది. గాయం కోసం ఆస్ట్రేలియా తగిన శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. ఆగస్టు 20న తేదీన అల్లు అర్జున్‌ గాయానికి తగ్గిన ఆపరేషన్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. అక్కడే వారం రోజుల పాటు ఉండి విశ్రాంతి తీసుకొని, తిరిగి సెప్టెంబర్‌ మొదటి వారంలో ఇండియాకు రానున్నాడు.

Tuesday, August 16, 2011

150 రోజుల తర్వాత మరో అవకాశం


  ' ప్రేమకావాలి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఇషాచావ్లా 150 రోజుల తర్వాత మరో అవకాశం వచ్చింది. వీరభ ద్రం దర్శకత్వంలో సునీల్‌ సరసన ఇషాచావ్లా జతకట్టనుంది. ఈ చిత్రం ఆగస్టు 18న లాంఛనంగా ప్రారంభం కానుంది.

ధోని తర్వాత కెప్టెన్‌ ఎవరు ... ?

 టీమిండియాలో కొత్త కోణం వచ్చింది. మూడు టెస్టు సిరీస్‌లు వరుసగా ఓడిపోయిన టీమిండియా కెప్టెన్‌పై భారం పడింది. భారత్‌ బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ఏది విధమైన రకమైన రాణించలేకపోవడం వల్ల కెప్టెన్‌పై భారం పడింది. వరుసగా మూడు టెస్టు సిరీస్‌లు ఓడిపోయివడం అంటే టీమిండియా జట్టు లోపం వల్లనే, జట్టు సభ్యులు రాణించలేకపోవడం. అందులో వరుసగా గాయలపాలైన వారిని మళ్లీ జట్టులో అనుమతించడం ఇలా చాల అనుమానాలు వస్తున్నాయి. గాయలుపాలైన వారిని మళ్లీ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అడించడం వంటి ప్రయోగాలు వంటి చేసి జట్టులో అనుమతించాలి.
మాజీ క్రికెటర్లు బీసీసీఐపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే కెప్టెన్‌ సరైన నిర్ణయం తీసుకోపోవడం వల్లనే జట్టు పరిస్థితి చాలా దారుణంగా తయారైయింది. ధోని తర్వాత నాయకత్వ లక్షణాలెవరికైనా వున్నాయి. గంభీర్‌ కెప్టెన్సీకి తగ్గ వ్యక్తి కానే కాదు. సెహ్వాగ్‌ సంగతి సరై సరి. సచిన్‌ అల్‌రెడ్రీ కెప్టెన్సీ చేసి, తన వల్ల కాదని పక్కకు తప్పుకున్నాడు. ఇంకా దావ్రిడ్‌ ఇంతకా ముందు టెస్టు సిరీస్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. లక్ష్మణ్‌ ఇప్పటివరకు కెప్టెన్‌ అన్న సందేహాములు తన దృష్టికి రాలేదు. అతను జట్టు సభ్యుడిలా అందరితో కలసి వుండటటమే తప్ప కెప్టెన్సీపై అలోచన లేదు. యువరాజ్‌సింగ్‌ అతను ఎప్పుడు జట్టు వస్తాడో, వెళ్తుతాడో తెలియదు. ఇంకా కొత్తగా వచ్చిన వారిలో విరాట్‌ కోహ్లీ, రైనా ఇద్దరు జట్టు కొత్త ముఖాలు ఉన్నాయి. వారికి అనుభవం తక్కువ ఉంది. ఇలా జట్టులో అందరీ చూస్తే కెప్టెన్సీపై ఎవరికి అలోచన లేదు.

Saturday, August 13, 2011

కాజల్‌తో ముచ్చటగా మూడోసారి

 'డార్లింగ్‌', మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌' చిత్రాలతో హిట్‌ కొట్టి పేరు తేచ్చుకున్న ఈ జత మరో సారి సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమా ఫ్యామిలి ఎంటర్‌మెటర్స్‌గా నిలిచాయి. ' రెబల్‌ ' సినిమాలో అనుష్క నిష్క్రమించిందనే వార్తలు వస్తుండండంతో ఆ సినిమాలో అనుష్క స్థానంలో కాజల్‌ భర్తీ చేయనుందా... లేక ఆ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించే సినిమా కోసం కాజల్‌ తీసుకుటారా అన్నది తెలియాల్సి వుంది.

Friday, August 12, 2011

మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ గెలుస్తుందా ? సచిన్‌ సెంచరీ చేస్తాడా... ?

 భారత్‌,ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమాయానికి భారత్‌ 35/1 పరుగులు చేసింది. గంభీర్‌ 14, రాహుల్‌ దావ్రిడ్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 710/7 డిక్టెర్‌ చేసింది. స్ట్రాస్‌ 87, కుక్‌ 294, బెల్‌ 34, పీటర్స్‌న్‌ 63, మోర్గాన్‌ 104 , బెన్నస్న్‌ 53 పరుగులు చేసింది. భారత్‌ బౌలింగ్‌లో అమిత్‌ మిశ్రా 3, ప్రవీణ్‌ కుమార్‌ 2, ఇషాంత్‌ శర్మ, రైనా చెరో వికెట్‌ లభించింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఒక వికెటు నష్టానికి 35 పరుగులు చేసింది. సెహ్వాగ్‌ డకౌట్‌ అయ్యాడు. ఇంకా రెండు రోజుల సమయం ఉంది. రెండు రోజులలో భారత్‌ 451 పరుగులు చేస్తుందా... ? లేక అలౌట్‌ అవుతుందా. ఇంకా భారత్‌ బ్యాట్స్‌మెన్‌లపై ఆధారపడి వుంది. ఒక వేళ టీమిండియాలో బ్యాట్స్‌మెన్‌లు రాణింస్తే డ్రాగా ముగుస్తుంది. లేకపోతే 0-3 తేడాతో ఇంగ్లాండ్‌ విజయం సాధిస్తుంది.

Tuesday, August 9, 2011

ఆసుపత్రిలో సూపర్‌స్టార్‌

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వెన్ను నొప్పి కారణంగా గత నాలుగు రోజుల క్రితమే కృష్ణ హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రసుత్తం ఆయన కోటుకుంటున్నారనీ, చిన్నపాటి సర్జరీ కూడా జరిగిందనీ, డాక్టర్‌ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి అవుతారనీ కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ అనారోగ్యం వార్త బయటకు తెలియగానే అయన అభిమాన్యులు అంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. కుటుంబ సభ్యులనుంచి ఆయన కోలుకుంటున్నారన్న ప్రకటన రావడంతో అభిమానుల్లో కొంతమేర ఆంతోళన తగ్గింది. కృష్ణ 300పైగా సినిమాల్లో నటించాడు.

Monday, August 8, 2011

పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదట వీళ్లకు

ప్రభాస్‌, గోపిచంద్‌, నాగచైతన్య, తరుణ్‌ వీళ్లందరు పెళ్లి విషయం మాట్లాడే వరకు ఇప్పట్లో లేదు. దానికి టైమ్‌ రావాలి అట్టున్నారు. సినిమా వాళ్లు కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వాళ్లు పెళ్లిళ్లకు వీళ్లు వెళ్తుతున్నారు. అక్కడ ఎవరో ఒక్కరు మరీ మీ పెళ్లి ఎప్పుడు సారు అన్ని అడిగితే ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టిపెట్టాననీ అంటున్నారు. అందరు పెళ్లి చేసుకుంటే వీళ్లు మాత్రం పెళ్లికు దూరం ఉంటున్నారు. మారి అసలు విషయం బయటికి రావడం లేదు.

Saturday, August 6, 2011

ఇంగ్లాండ్‌తో వన్డే, ట్వంటీ20కి టీమిండియా రె‘ఢీ’

crickets
ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, ట్వంటీ20 క్రికెట్‌ మ్యాచ్‌కు భారత జ ట్టు సిద్ధమైంది. అయితే ఎంపిక జట్టులో గాయంతో బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌, ఆల్‌రౌండర్‌ హర్భజన్‌ దూరమయ్యారు. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లను ఓడిపోయిన భారత్‌ వన్డే జట్టులోకి సెహ్వగ్‌, గంభీర్‌ కోహ్లీ, శర్మ వచ్చి చేరారు. ఇదిలా ఉంటే హిట్‌ ప్లేయర్‌ యువరాజ్‌ గాయం వల్ల బాధపడుతుండటంతో దాదాపు రెండేళ్ల అనంతరం మిస్టర్‌ వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు వన్డే జట్టులో ఆడే అవకాశం దక్కింది. 2009 సెప్టంబర్‌లో చాంపియన్స్‌ టోఫ్రీలో భాగంగా దక్షిణాఫ్రికాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా ద్రవిడ్‌ భారత తరపున వన్డేలో ఆడాడు.  మరోవైపు భారత్‌ను గాయాల భూతం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. మొన్న జహీర్‌, గంభీర్‌ తీవ్రమైన నొప్పితో రెండవ టెస్టుకి దూరమమైతే ఇపుడు వన్డే జట్టుకు యువరాజ్‌, భజ్జీ దూరమైయారు. ఇంగ్లాండ్‌ టెస్ట్‌ పర్యటనలో బౌలింగ్‌లో ఎలాంటి ప్రభావం చూపించని భజ్జీ కడుపు కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. ‘ ఇంగ్లాండ్‌ పరిస్థితులను ఆధారంగా చేసుకునే జట్టును సెల క్ట్‌ చేశాం. ఎంపిక ప్రక్రియను చాలా జాగ్రత్తగా నిర్వహించాము’ అని సెక్షన్‌ క మిటి ఛీఫ్‌ శ్రీకాంత్‌ విలేఖరులతో చెప్పారు. ఆఫ్‌ స్పిన్నర్‌, హర్భజన్‌, బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ ఇద్దరిని మినహాయించి 15 మంది సభ్యులతో జట్టును ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే, ట్వంటీ20కి ఎంపిక చేశారు

పెళ్లికొడుకు కాబోతున్న రామ్‌చరణ్‌

 చిరంజీవి ఏకైక కుమారుడు రాంచరణ్‌ తేజకు అపోలో గ్రూపు సంస్థల ఛైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డి మనవరాలు ఉపాసనతో తర్వలో వివాహం జరగనుంది. రెండు రోజుల్లో ఈ వివాహానికి సంబంధించిన ఇరు కుటుంబాలు ఉమ్మడి ప్రకటన చేయనున్నాయి. రాంచరణ్‌, ఉపాసన చైన్నెలో కలిసి చదువుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పెళ్లికి ఏర్పాట్లు చేసేందుకు చిరంజీవి సిద్దమవుతున్నారు. అపోలో గ్రూపు ఛైర్మన్‌ మనవరాలితో తన కుమారుడు రాంచరణ్‌ తేజ్‌కు వివాహం నిశ్చయం కానున్న విషయాన్ని చిరంజీవి నేడు ధ్రువీకరించాడు. ఈ ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం జరపాలని నిర్ణయించినట్లు సమాచారం.

Friday, August 5, 2011

ఉత్తమ నటుడు బాలయ్య

 2010వ సంవత్సరం ‘నంది’ ఉత్తమ చిత్రంగా క్రిష్‌ ‘వేదం’, ఉత్తమ ద్వితీయ చలనచిత్రంగా ‘గంగపుత్రులు’ అవార్డులకి ఎంపికయ్యాయి. ‘సింహా’ చిత్రంలో ప్రదర్శించిన రాజసానికి ఉత్తమ హీరోగా బాలకృష్ణ, ‘అలామొదలైంది’లో హుషారైన నటనతో ఆకట్టుకున్న మలయాళీ భామ నిత్యామీనన్‌ ఉత్తమ కథానాయికగా ఎంపికయ్యారు. జాలరుల వెతలను హృద్యంగా ఆవిష్కరించిన పి.సునీల్‌కుమార్‌ రెడ్డి ఉత్తమ దర్శకుడిగా ‘నంది’కి ఎంపికయ్యారు. 
‘వేదం’, ‘గంగపుత్రులు’, ‘సింహా’, ‘మర్యాదరామన్న’, ‘వరుడు’ ..ఒక్కోటీ మూడేసి అవార్డుల చొప్పున తమ ఖాతాలో జమేసుకున్నాయి. హైదరాబాద్‌ ఎఫ్‌డిసిలో (చలనచిత్ర అభివృద్ధి సంస్థ) శుక్రవారంనాడు ఈ అవార్డులను నంది జ్యూరీ అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌ ప్రకటించారు. 15 మందితో కూడిన జ్యూరీ కమిటీ సభ్యులు ఈ అవార్డుల ఎంపి ప్రక్రియను పర్యవేక్షించినట్లు ఈ సందర్భంగా ఎన్‌.శంకర్‌ అన్నారు. అవార్డుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగిందని ఆయన అన్నారు. ఉత్తమ చిత్రానికి బంగారు నంది, 75వేల నగదు దక్కుతుంది. ఉత్తమ ద్వితీయ చిత్రానికి వెండి నంది, రూ.40వేల నగదు అందజేస్తారు. 

నందికి ఎంపికైన సినిమాల జాబితా:
ఉత్తమ చిత్రం-వేదం
ఉత్తమ ద్వితీయ చిత్రం-గంగ పుత్రులు
ఉత్తమ తృతీయ చిత్రం- ప్రస్థానం
ఉత్తమ కుటుంబ కథాచిత్రం -అందరి బంధువయ
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం -పరమ వీర చక్ర
ఉత్తమ ప్రజాదరణ చిత్రం- మర్యాద రామన్న
ఉత్తమ బాలల చిత్రం-లిటిల్‌ బుద్ధ
ఉత్తమ డాక్యుమెంటరీ-అదె్వైతం
ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ-ఫ్రీడమ్‌ పార్క్‌
ఉత్తమ దర్శకుడు -పి.సునీల్‌కుమార్‌ రెడ్డి (గంగపుత్రులు)
ఉత్తమ కథానాయకుడు-నందమూరి బాలకృష్ణ (సింహా)
ఉత్తమ కథానాయిక-నిత్యామీనన్‌ (అలా మొదలైంది)
ఉత్తమ సహాయ నటుడు -ఏవిఎస్‌ (కోతిమూక)
ఉత్తమ సహాయ నటి-ప్రగతి (ఏ మాయ చేశావె)
ఉత్తమ కేరెక్టర్‌ నటుడు- సాయికుమార్‌ (ప్రస్థానం)
ఉత్తమ హాస్యనటుడు-ధర్మవరపు సుబ్రహ్మణ్యం (ఆలస్యం అమృతం)
ఉత్తమ హాస్యనటి-ఝాన్సీ (సింహా)
ఉత్తమ ప్రతినాయకుడు-నాగినీడు (మర్యాదరామన్న)
ఉత్తమ బాలనటుడు-మాస్టర్‌ భరత్‌ (బిందాస్‌)
ఉత్తమ ఆరంగేట్ర దర్శకురాలు-నందిని రెడ్డి (అలా మొదలైంది)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత-గౌతమ్‌ మీనన్‌ (ఏ మాయ చేశావె)
ఉత్తమ నేపథ్యగాయకుడు-ఎం.ఎం.కీరవాణి (మర్యాదరామన్న)
ఉత్తమ సంగీత దర్శకుడు-చక్రి (సింహా)
ఉత్తమ గీత రచయిత- నందిని సిద్దారెడ్డి (వీర తెలంగాణ)
ఉత్తమ గాయని -ప్రణవి
ఉత్తమ కళాదర్శకుడు-అశోక్‌కుమార్‌
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌- గంగాధర్‌
ఉత్తమ కొరియోగ్రాఫర్‌- ప్రేమ్క్ష్రిత్‌
ఉత్తమ మేల్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌- ఆర్‌.సి.ఎం.రాజు
ఉత్తమ మహిళా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌- చిన్మయి
ఉత్తమ ఫైట్‌ మాస్టర్‌-శేఖర్‌ (మనసారా)
ఉత్తమ కథా రచయిత-ఆర్‌.పి.పట్నాయక్‌ (బ్రోకర్‌)
ఉత్తమ స్ఫెషల్‌ ఎఫెక్ట్స్‌‌ట- అళగర్‌ స్వామి (వరుడు)
ఉత్తమ ఎడిటర్‌- కోటగిరి వెంకటేశ్వరరావు( డార్లింగ్‌)

Thursday, August 4, 2011

నాగచైతన్య, రామ్‌ డీ

నాగచైతన్య ' దడ' , రామ్‌ ' కందిరీగ' సినిమాలు ఒకే ఒక రోజు వ్యవధితో విడుదలవుతుంది. ఈ రెండింటి సినిమాలో ఎవరు ఎక్కువ .. ఎవరు తక్కువ ? ఎవరికి ఎక్కువ క్రేజ్‌ ఉంది.. ఎవరికి తక్కువుంది? వంటి విభేదాలు వస్తున్నాయి. దడ సినిమాలో కాజల్‌ నటింస్తుండగా, కందిరీగ సినిమాలో హన్సిక నటిస్తుంది. కాజల్‌కున్నంత పాపులారిటి హన్సికకు లేకపోయినా.. గ్లామర్‌ విషయంలో కాజల్‌కు హన్సిక ఏమాత్రం తీసిపోదు. రామ్‌, హన్సికల మధ్య కాంభినేషన్‌లో మస్కా సినిమా హిట్‌ కొట్టి ఇంకా రెండో సినిమా కోసం రెడీ అయ్యారు. నాగచైతన్య వరుసగా రెండు సినిమాలు హిట్‌ కొట్టి ఇంకా మూడో సినిమాలో విజయం సాధించి హాట్రిక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు.

Wednesday, August 3, 2011

బాలీవుడ్‌లో సినిమాలో మొదటి అవకాశం మిస్‌ అయినా అనుష్క , ఇంకా రెండో అవకాశం కోసం ఎదురు చూస్తుంది

 ' సింగం' చిత్రాన్ని హిందీలోకి రీమేక్‌ చేయాలని రోహిత్‌ శెట్టి నిర్ణయించుకోగానే ముందుగా కథానాయిక పాత్ర కోసం అనుష్కా శెట్టిని సంప్రదించాడు. ' సింగం' సినిమాలో ఒరిజినల్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకున్న అనుష్క బాలీవుడ్‌లో అదరగొడుతుందని అతను ఆశించాడు. కానీ అనుష్క మాత్రం ఆ చిత్రంలో నటించడానికి అనుష్క ససేమీరా అనేసింది. ఆ సినిమాలో ఎందుకు వదులుకున్నందో అర్థం కాలేదు. అజరు ఎంత పెద్ద స్టార్‌ అనేది అనుష్క అంచనా వేయలేకపోయింది. దీంతో ఈ అవకాశం కాజల్‌కు దక్కింది. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందని తెలిసినా అనుష్క ఇంకోసారి కూడా అవకాశం కోసం ఎదురు చూస్తోంది.