Wednesday, August 19, 2015

మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని : మహేశ్‌బాబు


రాష్ట్రప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతిలో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కేటీఆర్ కోరారని మహేశ్‌బాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ కోరిక మేరకు త్వరలోనే మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మహేశ్ ట్వీట్ చేశారు. దత్తత తీసుకునే గ్రామం వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించారు.