Monday, November 30, 2015

ఆమిర్‌కు షాకిస్తున్న మహేష్‌బాబు

 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ సూపర్ స్టార్ లకు కూడా చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఎండార్స్ మెంట్ల విషయంలో ఇప్పటికే సౌతిండియాలో టాప్ ప్లేస్ లో ఉన్న మహేష్ బాబు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా పోటీ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు సంబంధించిన యాడ్స్ మాత్రమే చేస్తున్న ఈ రాజకుమారుడు త్వరలోనే నేషనల్ యాడ్స్ లో మెరిసేందుకు రెడీ అవుతున్నాడు.
                    ప్రస్తుతం ఆమిర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న పలు కంపెనీలు, ఆయనతో తమ అగ్రిమెంట్ ముగియటంతో, మహేష్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు రెడీ అవుతున్నాయట. శ్రీమంతుడు సినిమాతో భారీ కలెక్షన్లతో పాటు ఓవర్ సీస్ లో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో పలు కంపెనీలు మహేష్ మీద దృష్టి పెట్టాయి. ఇప్పటికే నెంబర్ పరంగా అత్యధిక బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్.. నేషనల్ యాడ్స్ లో కూడా సత్తా చాటితే సంపాదన పరంగా కూడా రికార్డ్ సృష్టించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

'చెంపదెబ్బ కొట్టినందుకు క్షమాపణలు చెప్పు' ... బాలీవుడ్ అగ్ర నటుడు

 ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు బాలీవుడ్ అగ్ర నటుడు గోవిందాకు సూచించింది. 'మీరు పెద్ద హీరో. పెద్ద హృదయాన్ని కూడా చాటండి' అని గోవిందాకు సలహా ఇచ్చింది. 2008లో తనను చెంపదెబ్బ కొట్టి.. బెదిరించాడని సంతోష్‌రాయ్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇదే విషయమై గతంలో ఆయన వేసిన పిటిషన్‌ను బొంబాయి హైకోర్టు కొట్టివేసింది. నేరపూరిత ఉద్దేశంతోనే గోవిందా ఆయనను చెంపదెబ్బ కొట్టాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది.
             రాయ్‌ను గోవిందా చెంపదెబ్బ కొడుతున్న వీడియోను మొబైల్‌లో చూసిన ధర్మాసనం.. ఆయనకు గోవిందా క్షమాపణ చెప్పాలని సలహా ఇచ్చింది. సినీతారలు బహిరంగ ప్రదేశాల్లో కొట్లాటలకు దిగకూడదని సూచించింది. రీల్‌లైఫ్‌లో చేసినట్టు ఇష్టం వచ్చినట్టు రియల్‌లైఫ్‌లో చేయడం సరికాదని హితవు పలికింది. 'మేం మీ సినిమాలను చూస్తాం. కానీ మీరు ఎవరినైనా నిజంగా చెంప ఛెళ్లుమనిపిస్తే సహించం' అని జస్టిస్ వీ గోపాల గౌడతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది.

హన్సికకు రక్తపరీక్ష

 తనకేం కాలేదని, తాను బాగానే ఉన్నానని హీరోయిన్ హన్సిక  తెలిపింది. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, కంగారు పడాల్సిన పనిలేదని ట్విటర్ ద్వారా సోమవారం వెల్లడించింది. హన్సిక రక్త పరీక్ష చేయించుకుందని తెలియడంతో ఆమె సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందారు. 'ఏం జరిగింది. ఏమైనా సీరియస్సా' అంటూ ట్వీట్లు చేశారు. విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యమే ముఖ్యమని ఆమెకు సలహా ఇచ్చారు. అయితే రెగ్యులర్ చెకప్ లో భాగంగానే టెస్టు చేయించుకున్నానని హన్సిక వివరణ ఇచ్చింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. పరీక్ష కోసం రక్తం తీసుకున్నప్పుడు తాను గట్టిగా ఏడ్చానని, తన తల్లి ఎంతో ఓపికగా సముదాయించిందని అంతకుముందు హన్సిక ట్వీట్ చేసింది. దీంతో కంగారు పడిన అభిమానులు ఆమె ఆరోగ్యంపై ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం హన్సిక పలు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Sunday, November 29, 2015

స్కూటర్‌ మీద చక్కర్లు కొట్టిన అమితాబ్‌ ...

 దాదాపు ఏడాది కిందట సైకిల్ తొక్కి హల్‌చల్‌ చేసిన బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ తాజాగా స్కూటర్‌ నడిపారు. చక్కగా హెల్మెట్ పెట్టుకొని, గళ్ల చొక్కా, ముదురు రంగు ప్యాంటు తొడుక్కొని ఆయన అలా కోల్‌కతా వీధుల్లో స్కూటర్‌పై సవారీ చేశారు. పశ్చిమ బెంగాల్ అధికార కేంద్రానికి చిరునామా అయిన రైటర్స్ బిల్డింగ్‌ వద్ద శనివారం ఈ దృశ్యం కనిపించింది. రిబూ దాస్‌గుప్తా రూపొందిస్తున్న తాజా చిత్రం 'టీఈ3ఎన్' (Te3N) సినిమా కోసం అమితాబ్ ఇలా స్కూటర్ ఎక్కారు.
           
గతంలో 'పీకూ' సినిమా కోసం అమితాబ్ సైకిల్ తొక్కి.. అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. 'పీకూ'లో దీపికా పదుకొణే తండ్రిగా నటించిన అమితాబ్ తాజాగా రిబూ దాస్‌గుప్తా సినిమాలో విభిన్న పాత్రతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. విఖ్యాత సినీ దిగ్గజం సుజయ్‌ ఘోష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నవాజుద్దీన్ సిద్దిఖీ, విద్యాబాలన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం అమితాబ్ శ్రద్ధగా దర్శకుడి సూచనలు వినడం.. కొన్ని సెకండ్లపాటు కోల్‌కతా వీధుల్లో స్కూటర్ నడుపడం.. అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడిన ఆయన అభిమానులు, ప్రజలకు ఎంతో సంతోషం కలిగించింది.

' బాహుబలి'తో ' శ్రీమంతుడు' ఢీ


                    మొదటి సారి ఐఫా అవార్డులను సౌత్‌ సినిమాలకు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నారు. త్వరలో హైదరాబాద్‌లో జరుగబోతున్న ఈ అవార్డు వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోగా హీరో అల్లు శిరీష్‌ ఈ కార్యక్రమానికి హెస్ట్‌గా వ్వవహరించనున్నాడు. ఈ వేడుకల్లో మొత్తం 14 అవార్డులలు విభాగాలను అందజేయనున్నారు. ఈ 14 విభాగాల్లో ఏకంగా 11 విభాగాల్లో బాహుబలి మరియు శ్రీమంతుడు చిత్రాలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఉత్తమ చిత్రం, ఉతమ్మ హీరో, ఉత్తమ హీరోయిన్‌ ాలా 11 విభాగాల్లో కూడా ఈ రెండు చిత్రాలు పోటీ పడుతున్నాయి. అయితే ఏ సినిమాకు ఎక్కువ అవార్డులు దక్కుతాయా అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా ఉంది. చివరిగా ఈ రెండు చిత్రాలు ఢీ అంటే ఢీ అనబోతున్నాయి.

Saturday, November 28, 2015

పిలవని పేరంటానికి వెళ్తే...కొట్టి చంపారు ..!

పెండ్లి జరిగితే బంధువులే కాదు...ఆకలి బాధలో ఉన్నవారు కూడా ఆ సందడిలో హాజరవుతారు. ఓ వేళ అలా వచ్చిన వారిని బయటకు పంపటమో..లేకపోతే పోనీలే అని ఊరుకుంటాము. అది మానవత్వం..కానీ పంజాబ్‌లో ఓ దళితుడు పిలవని పెండ్లికి హాజరయ్యాడు. అతన్ని గుర్తించి తీవ్రంగా కొట్టి చంపేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లా గాగా గ్రామంలో భారీఏర్పాట్లతో పెండ్లి వైభవంగా జరుగుతున్నది. అది చూసి ముచ్చటపడ్డ జర్నేల్‌సింగ్‌ లోనికి వెళ్లాడు. తమ బంధువుల్లోని వ్యక్తి కాదని పెండ్లివారు గుర్తించారు. అతన్ని బయటకు పంపకుండా తీవ్రంగా కొట్టారు. పిడిగుద్దులు కురిపించారు. ఈ దారుణం జరుగుతున్నప్పుడు స్కూలు నుంచి తిరిగి వస్తున్న జర్నేల్‌ సింగ్‌ తనయుడు గురుదీప్‌ సింగ్‌ చూశాడు. తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రిని చూసి కన్నీరుమున్నీరైన కొడుకు సమీపంలో ఉన్న బంధువులను పిలిచి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ, మార్గమధ్యంలోనే జర్నేల్‌ సింగ్‌ మృతిచెందాడు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్న హ్యాఫీడేస్‌ హీరో ...


 శేఖర్‌కమ్ములా దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ మూవీతో ఒక్కసారిగా స్టార్‌డమ్ పేరు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్. త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న వరుణ్ సందేశ్ చర్చలో భాగంగా మాట్లాడుతూ తన సోదరి వివాహం గురించి వెల్లడించారు. ఈ క్రమంలో తన సినీ జీవితం, వివాహంపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అస్పష్టంగా ఇచ్చాడు. పెళ్లికి సంబంధించిన విషయాలను చెబుతూ డిసెంబర్ 7న తన నిశ్చితార్థం అని పేర్కొన్నాడు. కాగా జీవిత భాగస్వామి ఎవరో మాత్రం వెల్లడించలేదు.
           కానీ ఈ యువ హీరో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోనున్నట్లు గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. పడ్డానండి ప్రేమలో, ఝామ్మంది నాథం, ప్రేమ్ ఇష్క్ కాదల్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ వితికా శేరుగా ఊహాగానాలు. పడ్డానండి ప్రేమలో చిత్రం నుంచి వీరిరువురి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లిపీటల దాకా చేరినట్లు సమాచారం.

Thursday, November 26, 2015

రాజుగారింట్లో ఏడు రోజులు..

 అజయ్, భరత్, అర్జున్, వెంకటేష్, సుస్మిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రాజుగారింట్లో 7వరోజు. భరత్‌కుమార్ పీలం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫిరోజ్ రాజ దర్శకుడు. కనిష్క్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు ఇటీవలే హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఆడియో సీడీలను హీరో తరుణ్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని తమ్మారెడ్డి భరద్వాజ స్వీకరించారు. దర్శకుడు మాట్లాడుతూ హారర్ అంశాలకు వినోదాన్ని మేళవించి రూపొందించిన చిత్రమిది. ఓ భవంతిలో కొందరు యువతీయువకులకు ఎదురైన అనూహ్య సంఘటనలేమిటి? ఆ భవంతి గురించి వారు తెలుసుకున్న నిజాలేమిటి? అన్నది సినిమాలో ఉత్కంఠను కలిగిస్తుంది. వాణిజ్య హంగులన్ని పుష్కలంగా ఉంటాయి అని తెలిపారు. కథలోని కొత్తదనాన్ని నమ్మి చేసిన చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. కథానుగుణంగా నాలుగు పాటలు అద్భుతంగా కుదిరాయని సంగీత దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాదాల రవి, సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, November 25, 2015

ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలతో స్నాప్ డీల్ కంపెనీ సెగ

                       భారత్ లో పెరుగుతున్న అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలపై పలు వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రాజకీయ, సినీ రంగ ప్రముఖుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అంతేకాకుండా ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ కు ఈ వ్యాఖ్యల సెగ తగిలింది. దేశంలో  చోటుచేసుకుంటున్న అసహనపు ఘటనల నేపథ్యంలో దేశాన్ని విడిచి వెళ్లిపోదామా? అని తన భార్య కిరణ్ రావు అడిగిందని ఆమిర్ చెప్పడం.. తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే.
            ఆయన వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన పలువురు నెటిజన్లు గూగుల్ ప్లే స్టోర్ లో స్నాప్ డీల్ యాప్  పట్ల ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. స్నాప్ డీల్ యాప్ కు పెద్ద ఎత్తున పూర్ రేటింగ్ ఇచ్చారు. వెంటనే ఆమిర్ ఖాన్ ను స్నాప్ డీల్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై మొదట మౌనంగా స్నాప్ డీల్ సంస్థ ఎట్టకేలకు బుధవారం పెదవి విప్పింది. ఈ వివాదంతో తమకేమీ సంబంధం లేదని ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
            'ఆమిర్ ఖాన్ వ్యక్తిగత పరిధిలో చేసిన వ్యాఖ్యలలో స్నాప్ డీల్ కు ఎలాంటి పాత్ర కానీ, సంబంధం కానీ లేదు. స్నాప్ డీల్ భారత్ కు గర్వకారణమైన సంస్థ. యువ భారతీయులు అత్యంత ప్రేమతో నిర్మించిన ఈ సంస్థ.. సమ్మిళిత డిజిటల్ ఇండియా నిర్మాణంలో దృష్టి పెట్టింది. ప్రతిరోజూ మేం భారత్ లోని వేలాది చిన్న వ్యాపారులు, లక్షలాది వినియోగదారులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. భారత్ లో పది లక్షలమంది విజయవంతమైన ఆన్ లైన్ వ్యాపారవేత్తలను తయారుచేయాలన్న పెట్టుకున్న లక్ష్యం దిశగా మేం ముందుకు సాగుతున్నాం' అని స్నాప్ డీల్ తెలిపింది.

Tuesday, November 24, 2015

అక్కడ ఆయనను ముద్దు పెట్టుకోవడం అవసరం!

-మధుశాలిని

‘‘ ‘చీకటి రాజ్యం’లో కమల్‌హాసన్ గారితో ముద్దు సీన్‌లో నటించా. సాధారణంగా ప్రతి సినిమాలో కిస్ అనేది రొమాంటిక్ సీన్‌లో చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో అక్కడ కమల్ గారిని ముద్దు పెట్టుకోవడం కథకు అవసరం. ఈ సినిమా చూసిన వాళ్లందరికీ ఆ ముద్దు సీన్ కన్విన్సింగ్‌గా అనిసిస్తుంది’’ అని నటి మధుశాలిని చెప్పారు. ఇటీవల విడుదలైన ‘చీకటి రాజ్యం’లో మధుశాలిని కీలకపాత్ర పోషించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘ కమల్ హాసన్ గారంటే ఇష్టం. ఆయన సినిమాకు ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. వెంటనే ఓకే చెప్పారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. నేను త్వరలో తమిళ, మలయా ళాల్లో సినిమాలు చేయ నున్నా. తెలుగులో మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా’’ అని తెలిపారు.

పవన్‌కు జోడిగా మరో హీరోయిన్‌ ...

 పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ' సర్దార్‌ గర్బర్‌ సింగ్‌'లో మరో హీరోయిన్‌ నటిస్తుంది. ప్రస్తుతం కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ఐటెం సాంగ్‌ కోసం ప్రత్యేకంగా లక్ష్మీరారు ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. అలాగే ఒక ముఖ్య పాత్ర కోసం హీరోయిన్‌ సంజనను ఎంపిక చేయడం జరిగిందని సమాచారం. సంజన 'బుజ్జిగాడు ' చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కూడా నటించినా పెద్ద అవకాశాలు రాకపోవడంతో తమిళం, కన్నడంలో ఈమె నటించింది. అక్కడ కూడా స్టార్‌ హీరోయిన్‌గా అనిపించుకోవడంలో విఫలం అయింది. ఈ సమయంలో అనుకోనుండా పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో అవకాశం రావడం బఫర్‌ ఆఫ్పర్‌ వచ్చింది. అమెకు ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని నమ్మకం.

Monday, November 23, 2015

నా 'పెళ్లెప్పుడో నాకే తెలియదు' ...

      నా వివాహమెప్పుడో నాకే తెలియదు అంటున్నారు నటి అనుష్క. చారిత్రక కథా చిత్రాలకు చిరునామాగా మారిన నాయకి ఈమె. ఇలా అసమాన పాత్రల్ని అవలీలగా నటించేస్తున్నారు అనుష్క. తాజాగా బొద్దుగా, ముద్దుగా, సన్నగా, నాజూకుగా అవన్నీ ఒకే చిత్రంలో, ఒకే పాత్రలో ఒదిగిపోయింది. సినీ రస హృదయాలను వశపరచుకుని పరవశింపజేయడానికి రానున్నారు. అవును అనుష్క నవరసభరితంగా నటించిన ద్విభాషా చిత్రం ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరో సైజ్) చిత్రం అందంగా ముస్తాబై శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా అందాల భామ అనుష్కతో చిన్న భేటీ.

ప్ర: ఎలాంటి కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారు?
జ: ఫలానా కథా చిత్రాల్లో నటించాలని అనుకోవడం కంటే మంచి కథా చిత్రాల్లో నేనుండాలని ఆశిస్తాను. బాహుబలి, ఇంజి ఇడుప్పళగి లాంటి చిత్రాలు అలా అమరినవే. ఇంజి ఇడుప్పళగి చిత్రం అమ్మాయిలందరికి నచ్చుతుంది. అలాంటి పాత్రను నేనీ చిత్రంలో నటించాను.

ప్ర: సాధారణంగా ఇప్పటి వరకూ నటులే పాత్రల కోసం బరువు తగ్గడం,పెరగడం లాంటివి చేస్తున్నారు. నటిగా మీరు ఇంజి ఇడుప్పళగి చిత్రంలో పాత్రగా మారడానికి బరువు పెరగడం గురించి?
జ: ఈ చిత్రం కోసం తొలుత ఫొటో షూట్ చేసినప్పుడు పాత్రకు గెటప్ సరిగా సెట్ కాలేదు. మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్‌లో సరిచేద్దాం అన్నారు. మరి కొందరు అధిక మేకప్‌తో ముప్పు కలిగే అవకాశం ఉందన్నారు. బరువు పెంచడంలోనూ ఆపదే అన్నారు. అలాంటివి నాకు సంతృప్తినివ్వలేదు. చిత్ర కథా పాత్రకు తగ్గట్టు బరువు పెరగడమే సరైన చర్య అని నేను భావించాను. అలాంటి నిర్ణయం తీసుకున్న తరువాత మూడు నెలల్లో 17 కిలోల బరువు పెరిగాను.

ప్ర: బరువు పెరగడం కష్టమా? తగ్గడం కష్టమా?
జ: నిజం చెప్పాలంటే రెండూ కష్టమే
 
ప్ర: ఇంజి ఇడుప్పళగి చిత్రంలో సందేశం లాటిదేమయినా ఉంటుందా?
జ: ప్రత్యేకంగా సందేశం అంటూ ఏమీ ఉండదు. అందం అనేది సన్నం లావులను బట్టి ఉండదు. మంచి మనసున్న వారందరూ అందమైన వారేనని చెప్పే చిత్రం ఇంజి ఇడుప్పళగి.

ప్ర: నటి కాకుంటే ఏమైఉండేవారు?
జ: నేను 17వ ఏట నుంచే యోగా చేస్తున్నాను. కాబట్టి నటి కాకుంటే యోగా టీచర్ అయ్యేదాన్ని.

ప్ర: విశాల్, సూర్య, ఆర్య, ప్రభాస్‌లలో మీకు సరైన జోడీ ఎవరనుకుంటున్నారు?
జ: మీరు చెప్పిన వారందరూ నాకు మంచి స్నేహితులే. విక్రమ్, సూర్యలు సీనియర్ నటులు. యూనిట్‌లోని వారినందర్నీ గౌరవించే నటుడు సూర్య. నాకు ఏదైనా సందేహం కలిగినప్పుడు విక్రమ్‌తో చర్చిస్తుంటాను.
 
ప్ర: సినిమాలో అధికంగా నేర్చుకుంది ఎవరి నుంచి?
జ: రజనీకాంత్ నుంచీ చాలా నేర్చుకున్నాను. ఆయన నటన, జీవితం నాకు ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. సూపర్‌స్టార్ అయిన ఆయన నిరాడంబరత చాలా నచ్చింది. అలాగే నటి మనోరమ. అరుంధతి చిత్రంలో నటిస్తున్నప్పుడు నటనపై ఆమె అంకితభావం నన్ను విస్మయపరచింది.

ప్ర: తమిళం,తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఏ భాషా అభిమానులంటే మీకు ఇష్టం?

జ: ఏ భాషా కథా చిత్రం అయినా నచ్చితేనే చేస్తాను. నన్ను గెలిపించేది అభిమానులే. వాళ్ల విషయంలో తారతమ్యాలు లేవు.

ప్ర: చిత్ర రంగప్రవేశం చేసి దశాబ్దం దాటింది. ఏదైనా మంచి పాత్ర పోషించాలనే కోరిక ఉందా?
జ: బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించాలని అందరూ కోరుకుంటారు. అలాంటి మంచి పాత్ర ఏదైనా ఉంటే చెప్పండి. సినిమా అనేది మాయాజాల లోకం. అసలు నేనీ రంగంలోకి వస్తాననే ఊహించలేదు. అంతా దైవేచ్ఛ.

ప్ర: కథానాయికల మధ్య ఇప్పుడు పోటీ అధికం అంటున్నారే?
జ: అలాంటి పోటీ అవసరమే. అప్పుడే ది బెస్ట్ ఔట్‌పుట్‌ను ఇవ్వగలం. అయితే నెంబర్‌ఒన్ పోటీపై నాకు నమ్మకం లేదు. దాని వల్ల అదనంగా లాభం ఉంటుందని కూడా అనుకోను. మంచి కథాపాత్రల్లో నటిస్తే చాలు. నాకు వరుసగా మంచి చిత్రాలు అమరడం సంతోషంగా ఉంది.
 

ప్ర: మీరు నటించిన చిత్రాల్లో ఉత్తమ చిత్రాలుగా మారు చెప్పేది?
జ: మొదటి వరుసలో నాగార్జునతో నటించిన సూపర్ చిత్రం. ఆ తరువాత వేదం, దైవతిరుమగళ్, అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి ఇలా చెప్పుకుంటూపోవచ్చు.

ప్ర: అందరూ అడిగే అరిగిన ప్రశ్నే. పెళ్లెప్పుడు చేసుకుంటారు?
జ: ఏడాది పొడుగునా నటులతోనో, వ్యాపారవేత్తలతోనో నన్ను కలుపుతు గ్యాసిప్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక నేను ప్రేమ వివాహమా? తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటానా? ... అసలు అది ఎప్పుడు అన్నది కూడా నాకు తెలియదు. అయితే పెళ్లి ఎప్పుడు జరిగినా రహస్యంగా మాత్రం జరగదు.

బ్రహ్మానందానికి ఆఫర్లు తగ్గాయా?

       అహ నా పెళ్లంట సినిమాతో 'అరగుండు' బ్రహ్మానందంగా తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన హాస్యనటుడు బ్రహ్మానందానికి ఆఫర్లు ఏమైనా తగ్గాయా? ఇటీవల స్టార్ హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ఈ స్టార్ కమెడియన్‌ను పక్కన పెడుతున్నారా? రెమ్యునరేషన్ భారీగా ఉండటంతో పాటు... స్క్రిప్టులో వేలు పెట్టడం లాంటివి చేస్తున్నారనే ఇలా ఆయనను దూరం పెడుతున్నట్లు సినీ జనాలు చెబుతున్నారు. కొందరు కొత్త దర్శకులైతే బ్రహ్మానందంతో పనిచేయాలంటే చాలా కష్టమని వాపోతున్నారట. దీంతో కొత్తతరం కమెడియన్లయితే బెటరని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మరోవైపు తెలుగులో హర్రర్ కామెడీ సినిమాలకు బాగా ప్రాధాన్యం పెరిగిందని, అందుకే ఆ తరహా నటులకే మంచి ఆదరణ లభిస్తోందని సినీ పండితుల వాదన.          కాగా ఇప్పటివరకు దాదాపు వెయ్యికి పైగా సినిమాల్లో తనదైన నటనతో తెలుగు సినీ చరిత్రలో కామెడీ డాన్‌గా అలరించిన నటుడు బ్రహ్మానందం. అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్ఎంపీ, జిలేబీ, గచ్చిబౌలి దివాకర్, విద్యాబాలన్, జిల్‌బిల్ పాండే, బద్దం భాస్కర్, హంసరాజ్.... ఇలా వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతమైన కామెడీని పండించిన నటుడాయన. అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు.

Sunday, November 22, 2015

అనుకోని కలయిక!

 అది గుజరాత్‌లోని ఓ హోటల్. ఆ హోటల్‌లో ఇద్దరు స్టార్స్ బస చేశారు. ఒకరు క్రికెట్ స్టార్ కపిల్ దేవ్. మరొకరు సినిమా స్టార్ పవన్ కల్యాణ్. ఈ ఇద్దరూ అనుకోకుండా ఆ హోటల్‌లో కలిశారు. ఆత్మీయంగా కరచాలనం చేసుకున్నారు. ‘‘మీ సినిమాలు నేను చూశాను. చాలా ఎంజాయ్ చేస్తుంటాను’’ అని పవన్‌తో భారత మాజీ కెప్టెన్ కపిల్ అన్నారు. ఆ మాటలకు పవన్ కల్యాణ్ తనదైన శైలిలో నవ్వారు. 
ఈ హీరోగారు గుజరాత్‌లో ఎందుకు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాబీ దర్శకత్వంలో ఆయన హీరోగా శరత్ మరార్ నిర్మిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ అక్కడ జరుగుతోంది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్ మెంట్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంయు క్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

టీమ్‌ ఇండియాలో చోటుపై ఆశ ఇంకా ఉంది ...

 జట్టులో చోటు కోల్పోయిన ఆల్‌ రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ టీమ్‌ ఇండియాకు ఆడాలనే కోరిక ఇంకా అలాగే ఉందని తెలిపాడు. ఫామ్‌ కోల్పోవడంతో పాటు గాయాల బారిన పడి మూడేళ్ల క్రితం జట్టులో స్థానం కోల్పోయిన ఇర్ఫాన్‌ భారత జట్టు తరఫున ఆడాలనే ఆశ, కోరిక ఇంకా అలాగే ఉన్నాయని, సెలెక్టర్ల నుంచి పిలుపొస్తుందని ఎదురుచూస్తున్నట్లు తెలి పాడు. ఇటీవల రంజీ మ్యాచుల్లో 12 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాటిం గ్‌లో 90 పరుగులు చేసి రాణించమే దీనికి శుభసూచకమన్నాడీ ఈ బరోడా ఆల్‌రైండర్‌. ఇర్ఫాన్‌ ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు చెప్పాడు. 'ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడే ప్రతి క్రికెటర్‌కు భారత్‌ తరఫున ఆడాలని ఉంటుంది. నాక్కూడా టీమ్‌ ఇండియా తరఫున ఆడాలనే కోరిక ఇంకా అలాగే ఉంది. ప్రసు తం ఆటకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ నైపుణ్యం పెంచుకోవడానికి ప్రాధాన్యమి స్తున్నాను. సెలెక్టర్లు గుర్తిస్తారనే నమ్మకముంది' అని ఆశాభావం వ్యక్తం చేశాడు.  2003లో భారత్‌ తరఫున ఆరంగేట్రం చేసిన ఇర్ఫాన్‌ 29 టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టడంతో పాటు 1105 పరుగులు చేశాడు. 120 వన్డేల్లో 173 వికెట్లతో తీసి 1544 పరుగులు సాధించిన ఇర్ఫాన్‌ 2012 ఆగస్టులో చివరి వన్డే ఆడాడు.

Saturday, November 21, 2015

సినిమా రివ్యూ: చీకటి రాజ్యం


రేటింగ్‌: 2.75/5


               ఫ్రెంచ్‌ సినిమా 'స్లీప్‌లెస్‌ నైట్‌'కి అధికారిక రీమేక్‌ అయిన 'చీకటి రాజ్యం' సగటు ఇండియన్‌ మసాలా చిత్రాల మూస పోకడలన్నిటికీ భిన్నంగా తెరకెక్కింది. హాలీవుడ్‌ లేదా ప్రపంచ భాషల్లో ఏ సినిమాల్లో చూసినా హీరో గ్లోరిఫికేషన్‌ అనేది యాక్షన్‌ సినిమాల్లో తప్ప మిగతా వాటిలో ఉండదు. కానీ మనకి ప్రతి సినిమాలోను కథానాయకుడినే హైలైట్‌ చేస్తుండాలి. 'చీకటి రాజ్యం' ఎలాంటి 'నేల విడిచి సాము' చేయని ఒక మామూలు థ్రిల్లర్‌. కథాపరంగానే పాత్రలన్నీ కనిపిస్తుంటాయి తప్ప ఒకరు హీరో, ఒకరు హీరోయిన్‌, వీళ్లకో పాట, వీళ్లకిక్కడ కామెడీ అంటూ కొలతలేమీ ఉండవు.
               రొటీన్‌ పోకడలేం లేకపోవడం వల్ల 'చీకటి రాజ్యం' ఫ్రెష్‌ అనుభూతినిస్తుంది. స్టోరీగా చెప్పుకుంటే చాలా సింపుల్‌ పాయింట్‌. కొకైన్‌ బ్యాగ్‌ స్వాధీనం చేసుకున్న అండర్‌ కవర్‌ పోలీస్‌ (కమల్‌) కొడుకుని విలన్‌ (ప్రకాష్‌రాజ్‌) కిడ్నాప్‌ చేస్తాడు. బ్యాగ్‌ ఇస్తే పిల్లాడ్ని ఇస్తా అని డీల్‌ మాట్లాడితే ఆ బ్యాగ్‌ పట్టుకుని వెళ్లిన పోలీస్‌ తమ డిపార్ట్‌మెంట్‌ వాళ్లకే (త్రిష, కిషోర్‌) క్రిమినల్‌గా కనిపిస్తాడు. విలన్‌ ఉన్న పబ్‌లోకి వెళ్లి బ్యాగ్‌ని బాత్రూమ్‌లో దాచి కొడుకు క్షేమం తెలుసుకుని బ్యాగ్‌ ఇచ్చేద్దామని వస్తే అక్కడ అది ఉండదు. తన వెనకపడ్డ పోలీసులు అది తీసేస్తారు. ఆ బ్యాగ్‌ ఇవ్వకపోతే కొడుకుని సేఫ్‌గా తీసుకెళ్లడం కష్టమైన పరిస్థితుల్లో ఆ పోలీస్‌ ఏం చేస్తాడు? రాత్రి గడిచేలోగా కొడుకుని ఎలా కాపాడుకుంటాడు?
                           కథ మొత్తం ఇరవై నాలుగు గంటల్లో నడుస్తుంది. దాదాపుగా ఒక నైట్‌ క్లబ్‌లోనే సినిమా అంతా సాగుతుంది. కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో తండ్రి, క్రిమినల్‌ కాప్‌ని పట్టుకోవాలనే లేడీ పోలీస్‌, కొకైన్‌ బ్యాగ్‌ కోసం చూసే డాన్‌, అతడినుంచి కొకైన్‌ ఆశిస్తున్న మరో క్రిమినల్‌ (సంపత్‌ రాజ్‌), తండ్రి కోసం ఎదురు చూస్తూ ఒక కిడ్నాపర్‌తో కాలక్షేపం చేసే కొడుకు, బాయ్‌ఫ్రెండ్‌తో పబ్‌కొచ్చి అతని నిజ స్వరూపం తెలిసి కాపాడిన పోలీస్‌ వెంట తిరిగే నర్స్‌ (మధు షాలిని)... ఇలా వివిధ క్యారెక్టర్స్‌ అన్నీ ఆ నైట్‌ క్లబ్‌లో చేరితే తెల్లారేలోగా కథ కంచికెలా చేరుతుందనేదే 'చీకటి రాజ్యం'. కిడ్నాప్‌, కొకైన్‌, క్లబ్‌, పోలీస్‌.. ఇలా అన్నీ ఒక బిగి సడలని థ్రిల్లర్‌కి కావాల్సిన లక్షణాలే ఉన్నాయి. కానీ 'చీకటి రాజ్యం' మాత్రం ఆద్యంతం చప్పగా సాగిపోతుంది. 


ప్రథమార్థం వరకు ఎలాంటి థ్రిల్స్‌ లేకుండా మామూలుగా వెళ్లిపోయినా ద్వితీయార్ధంలో అయినా కథనంలో ట్విస్టులు, ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లాంటివి కోరుకుంటాం. కానీ 'చీకటి రాజ్యం' ద్వితీయార్ధం కూడా ఏ విధమైన ఎక్సయిట్‌మెంట్‌ లేకుండా అలా ఫ్లాట్‌గా వెళ్లిపోతుంది. క్రిమినల్‌ చేతిలో కొడుకు కిడ్నాప్‌ అయి ఉన్నాడు, తండ్రి కీలకమైన కొకైన్‌ బ్యాగ్‌ పోగొట్టుకున్నాడంటే ఉత్కంఠ పుట్టించే అవకాశమున్న సరంజామా ఉన్నా కానీ ఎంతసేపు ఒకరికి కనిపించకుండా ఒకరు తప్పించుకు తిరగడమే సరిపోయింది. కొకైన్‌ బ్యాగ్‌ మిస్‌ అయినప్పుడు దానికి బదులుగా మైదా పిండి ప్యాకెట్లు పట్టుకెళ్లి ఇవ్వడం, ఆ బ్యాగ్‌ చుట్టూ నడిపిన పాటి కాస్త డ్రామా అయినా మళ్లీ ఎక్కడా లేకపోయింది. అంతో ఇంతో బాగున్న అంశం ఏదైనా ఉంటే కమల్‌హాసన్‌, త్రిషల ఫైట్‌ సీన్‌. హీరో హీరోయిన్లు సీరియస్‌గా ఫైట్‌ చేసుకోవడం తరచుగా చూసే సన్నివేశం కాదుగా. 
               ఫైట్ల చిత్రీకరణ మాత్రం బాగా చేసారు. నిజంగా ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది తప్ప ఎక్కడా సినిమాటిక్‌ ఫీల్‌ ఉండదు. షర్టు నలగకుండా కొట్టేసే హీరో కనిపించడు. ఒకడ్ని కొట్టి చెయ్యి నొప్పెడితే ఆ బాధని భరిస్తున్న సంగతి చూపెడతాడు. సహజత్వానికి దగ్గరగా ఉందనేది ప్లస్‌ పాయింటే కానీ ఆకట్టుకునే కథనం లేకపోవడంతో ఇది వెండితెరపై వీక్షించే సినిమాలా అనిపించలేదు. ఏదో సరదాగా డివిడిలో కాలక్షేపం చేయడానికి పనికొచ్చే బాపతు సినిమా అన్నమాట. తన ప్రతి సినిమాలోను హాస్యం జోడించే ప్రయత్నం చేసే కమల్‌ ఇందులో కూడా అక్కడక్కడా కామెడీని ఇరికించారు కానీ సీరియస్‌ సెటప్‌ మధ్య అదంతగా పేలలేదు. 
                         కమల్‌లోని నటుడ్ని పరీక్షించేంత సీన్‌ ఉన్న క్యారెక్టర్‌ కాదు. ఆయన చాలా ఈజీగా చేసుకుపోయాడు. త్రిష మేకప్‌ లేకుండా పోలీస్‌ పాత్రలో సహజంగా కనిపించింది. పదేళ్లుగా హీరోల వెంట చెట్లు, పుట్టలు తిరుగుతోన్న ఆమెకిది కొత్త ఎక్స్‌పీరియన్సే. మధు షాలిని కేవలం కమల్‌కి ముద్దులు పెట్టడానికి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రకాష్‌రాజ్‌కి కూడా చాలా సాధారణ క్యారెక్టర్‌. సంపత్‌ రాజ్‌ ఫర్వాలేదు. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగా ఉంది.
                       లొకేషన్స్‌ ఎక్కువ లేని ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్‌ ప్రతిభ బాగా కనిపిస్తుంది. జిబ్రాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బ్రహ్మాండంగా ఉంది. దర్శకుడు ఉన్న కథని బాగానే తెరకెక్కించాడు కానీ ఉత్కంఠభరిత సన్నివేశాలని జోడించగలిగి ఉంటే 'చీకటి రాజ్యం' మంచి ప్రయత్నంగానే కాక బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని కూడా దక్కించుకునేది. రొటీన్‌ సినిమాలతో విసిగిపోయిన వారికి కాస్త రిలీఫ్‌ అయితే ఇస్తుంది కానీ ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మాత్రం అందించలేకపోయింది.

Friday, November 20, 2015

సినిమా రివ్యూ: కుమారి 21ఎఫ్‌

రేటింగ్‌: 3/5

 


                    సుకుమార్‌ సినిమాల్లో ఎప్పుడూ రొటీన్‌కి భిన్నమైన ఆలోచనలే కనిపిస్తుంటాయి తప్ప రెగ్యులర్‌ కథలు కానరావు. ఏదైనా కొత్తగా ఉండాలని తపన పడే సుకుమార్‌ తనే నిర్మాతగా మారి ఒక సినిమా తీసాడంటే తప్పకుండా అందులో వైవిధ్యం ఒక పిసరంత ఎక్కువే ఉంటుందని అనుకుంటాం. 'కుమారి 21ఎఫ్‌'లో సుకుమార్‌ నుంచి మనం ఊహించే దానికంటే కాస్త ఎక్కువ సంచలనం, కాస్త ఎక్కువ ఆశ్చర్యం, కాస్త ఎక్కువ వైవిధ్యం ఉన్నాయి. ఇది సగటు తెలుగు సినిమా కాదు. సగటు సోకాల్డ్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ అసలే కాదు. బోల్డ్‌ సినిమా. బోల్డ్‌ అంటే అలాంటిలాంటి బోల్డ్‌ కాదు... పలక తీసుకుని అదే పనిగా ఒకే అక్షరాన్ని దిద్దీ, దిద్దీ బలపం అరిగిపోతే వచ్చేటంత బోల్డ్‌ సినిమా! 
              
     ప్రేమలో పడ్డ టీనేజ్‌ అబ్బాయిలు కొందరు తమ ప్రేయసి తనతోనే ముందుగా ప్రేమలో పడిందా లేక ముందే ఏవైనా అనుభవాలున్నాయా అనే సంఘర్షణకి గురవుతారు. ఆ సంఘర్షణనే సుకుమార్‌ కథావస్తువుగా ఎంచుకున్నాడు. ఒక అమ్మాయి వేషధారణ, సామాజిక పరమైన నడవడికని బట్టి 'క్యారెక్టర్‌'ని తూకమేసే చదువుకున్న బడుద్దాయిలు మనకి అడుగడుగునా కనిపిస్తారు. ఇలాంటి సెన్సిటివ్‌ ఇష్యూని సుకుమార్‌ కథగా మలిచాడు. అబ్బాయిలతో ఫ్రెండ్‌ అంటూ చనువుగా తిరిగేసి, ఎంత రాత్రయినా ఎలాంటి బెరుకు లేకుండా వెళ్లేసి వచ్చేసే కుమారి (హెబా పటేల్‌) ఒక మామూలు కుర్రాడు సిద్ధుని (రాజ్‌) ప్రేమిస్తున్నానంటుంది. అతనికీ ఆమె నచ్చుతుంది. కానీ ఆమె తననే ప్రేమిస్తుందా లేక తాను ప్రేమిస్తున్నానని చెప్పుకు తిరిగే చాలా మందిలో తానూ ఒకడా? తనకున్న సందేహాలు చాలవన్నట్టు ఆమె బిహేవియర్‌ దృష్ట్యా కుమారి 'కన్య' కాదని సర్టిఫై చేసేస్తారు స్నేహితులు. తప్పని పరిస్థితుల్లో ఆమె క్యారెక్టర్‌కి టెస్ట్‌ పెట్టాలని చూస్తాడు. నన్ను ప్రేమించేంత పరిపక్వత నీలో వచ్చినప్పుడు చూద్దామంటూ సిద్ధూని కడిగేస్తుంది. కుమారికి తనకి తెలియని గతం ఒకటుందని తర్వాత తెలుస్తుంది. ఇంతకాలం తనని మోసం చేసిందని సిద్ధు ఊగిపోతాడు. అతను రియలైజ్‌ అయ్యేలోగా ఒక అనర్ధం జరిగిపోతుంది. కానీ కుమారి కోరుకున్న పరిపక్వతని మించి మెచ్యూరిటీ చూపిస్తాడు.
 కొన్ని కథలు ఊహలోకి వస్తేనే 'చూస్తారా లేదా' అనే సందేహం దాటి ముందుకు కదలవు. కానీ సుకుమార్‌ అలాంటి ఒక కథని ఊహించాడు, రాసాడు, తనే నిర్మాతగా మారి తెరకెక్కించాడు కూడా! 'కుమారి' చిత్రానికి రచయితగా సుకుమార్‌ తన మెచ్యూరిటీ లెవల్స్‌ చూపించాడు. ఇందులో హీరో ఒక మాదిరి లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ కాలనీలో ఉంటాడు. కనీస అవసరాలు కూడా సరిగా లేని ఆ కాలనీలో పెరిగిన కుర్రాళ్లు చాలా ఈజీగా క్రైమ్‌కి అలవాటు పడతారనేది చెప్పకనే చెప్తాడు. ఏటీమ్‌ల వద్ద దొంగతనాలకి పాల్పడే స్నేహితుల బృందంతో కలిసి తిరిగే హీరో వారి దగ్గర్నుంచి షేర్‌ కూడా తీసుకుంటూ ఉంటాడు. తను చేసేదీ, తిరిగేదీ అంతా తప్పే అయినా కానీ తనని ప్రేమించే అమ్మాయి మాత్రం పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాడు.

            కుమారి అయితే తనకి ఎంత 'రేటు' పలుకుతుందో హీరోనే అడుగుతుంది. అతనితో కలిసి చాలా క్యాజువల్‌గా మందు కొడుతుంది. అంతే క్యాజువల్‌గా పెదాలపై ముద్దులు కూడా పెట్టేస్తుంది. తనని ప్రేమించడం వల్లే ఇదంతా చేస్తుందని అనుకునేంత మెచ్యూరిటీ హీరోకి లేకపోవడం వల్ల క్యారెక్టర్‌లెస్‌ అనేసుకుని పొరపడతాడు. ఆమె ప్రవర్తన, వేషధారణ అతని అనుమానాలకి ఆజ్యం పోస్తాయి. కానీ సరిగ్గా గమనిస్తే కుమారి ఎక్కడా హీరోతో తప్ప ఎవరితోను చనువుగా మూవ్‌ అవదు. ఎవరి దగ్గర లూజ్‌గా మాట్లాడదు. పక్షవాతంతో కుర్చీలో పడి ఉన్న తాతతో జోక్‌లు వేస్తుందీ, హీరో దగ్గర ఫిల్టర్‌ లేకుండా మాట్లాడేస్తుంది తప్ప మిగిలిన ఎవరి దగ్గరా 'లూజ్‌'గా బిహేవ్‌ చేయదు. ఆర్టిస్ట్‌ ఒక బొమ్మ గీస్తున్నప్పుడు దానిని స్టార్టింగ్‌లో చూస్తే ఏవో పిచ్చిగీతల్లా అనిపిస్తాయి. బొమ్మ పూర్తయితే తప్ప దాని అసలు అందం ఏంటనేది తెలీదు. కుమారి క్యారెక్టర్‌ స్కెచ్‌ని ఒక ఆర్టిస్ట్‌ మాదిరిగా తీర్చిదిద్దాడు సుకుమార్‌. ఆ పాత్ర ఏంటనేది పరిపూర్ణంగా తెలిసాక కానీ ఆమె ఏంటనేది అర్థం కాదు. అయితే హీరోతో పాటు ప్రేక్షకులకి కూడా 'కుమారి'ని 'లవ్‌ చేయాలా వద్దా' అనే అనుమానాన్ని అలాగే ఉంచాలని ఆమెతో గీత దాటించి మాట్లాడించడం, ప్రవర్తించడం చేయించారు. కుమారి ఏంటనేది హీరోతో పాటే చూసేవాళ్లకీ ఒక్కసారే క్లారిటీ వస్తుంది.
            ఇలాంటి కథకి ఎలాంటి క్లయిమాక్స్‌ అయితే పర్‌ఫెక్ట్‌ అనిపిస్తుందో అదే ముగింపునిచ్చాడు సుకుమార్‌. ఈ విషయంలో మెజారిటీ ప్రేక్షకుల ఆమోదం ఉంటుందా లేదా అనేది ఆలోచించకుండా కథౌచిత్యానికే ప్రాధాన్యమిచ్చి తాను మిగిలిన వారి కంటే చాలా భిన్నమని మరోసారి చాటుకున్నాడు. హీరో పేరెంట్స్‌ త్రెడ్‌ ద్వారా హీరోకి రియలైజేషన్‌ వచ్చే సీన్‌ని సృష్టించి 'కుమారి'కి సుకుమార్‌ ఇచ్చిన రైటర్‌ 'టచ్‌' సూపర్బ్‌ అనిపిస్తుంది. అలాగే హీరోయిన్‌ కోరుకునే మెచ్యూరిటీకి మించిన మెచ్యూరిటీని హీరో చూపించడమనే థాట్‌కి సుకుమార్‌ హేట్సాఫ్‌ చెప్పాలి. అందరికీ ఆమోదయోగ్యం కాని దానిని ఆమోదించేలా చేయడంలోనే ఒక రచయిత గొప్పతనం దాగి ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఉత్తమోత్తమ రచయితల్లో సుకుమార్‌కి సముచిత స్థానం ఇస్తుంది కుమారి. ఈ కథని ఇంకాస్త అండర్‌ ప్లే చేస్తూ ఇంకా ఎక్కువ మందికి రీచ్‌ అయ్యేలా చెప్పి ఉండొచ్చు. 'అడల్ట్‌ సినిమా' ముద్ర పడకుండా కనీసం 'పీజీ (యు/ఏ)' స్థాయి కంటెంట్‌తో అయినా సరిపెట్టి ఉండొచ్చు. అయితే ఫక్తు అడల్ట్‌ సినిమా మాదిరిగానే డీల్‌ చేయడం వల్ల కుమారి మెజారిటీ ఆడియన్స్‌కి రీచ్‌ కాకపోవచ్చు.
                     రాజ్‌ తరుణ్‌ తన పాత్రకి అతికినట్టు సరిపోయాడు. ఆ పాత్రకి కావాల్సిన భావోద్వేగాలని చాలా అలవోకగా పలికించేసి తన ప్రతిభ చాటుకున్నాడు. హెబా పటేల్‌కి అలవాటు పడడానికి కాస్త టైమ్‌ పడుతుంది. ఒక్కసారి అలవాటయ్యాక ఆమె బాగానే అనిపిస్తుంది. నోయల్‌ నటన ఆకట్టుకుంటుంది. హేమ తను చేసే పాత్రలకి భిన్నమైన సాత్విక పాత్రలో కొత్తగా కనిపిస్తుంది. హీరో స్నేహితుల బృందంలో సుదర్శన్‌ తన మార్కు యాస డైలాగులతో నవ్విస్తాడు. దేవిశ్రీప్రసాద్‌ పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ప్రత్యేకించి ఆ వయొలిన్‌ థీమ్‌ విశేషంగా మెప్పిస్తుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీతో ఈ చిత్రం చాలా క్వాలిటీగా అనిపిస్తుంది. దర్శకుడు సూర్య ప్రతాప్‌ కథలోని సోల్‌ని క్యారీ చేయగలిగాడు. ప్రతాప్‌ బాగానే హ్యాండిల్‌ చేసినా కానీ ఇది సుకుమార్‌ తీసి వుంటే ఇంకెలా ఉండేదో అనే ఆలోచన అయితే రాకపోదు.
 

Thursday, November 19, 2015

లాలు తనయుడికి డిప్యూటీ సీఎం పదవి?


ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ కు బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఆర్జేడీ శాసనసభ పక్ష నాయకుడిగా తేజస్వి యాదవ్ ను నియమించవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం బిహార్ ముఖమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. నితీశ్ కేబినెట్ లో లాలు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ లకు బెర్తులు దక్కనున్నట్టు సమాచారం. లాలు చిన్న కొడుకు తేజస్వి కి డిప్యూటీ సీఎం పదవి దక్కే చాన్స్ ఉంది.


లాలు ఈ విషయంపై నితీష్ తో చర్చించినట్టు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. లాలు కొడుకులు తాజా ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా లాలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి పార్టీలు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 సీట్లు గెల్చుకున్నాయి.

పోస్టర్ అదిరింది...



ధనుష్‌, సమంత జంటగా నటిస్తున్న తమిళ చిత్రం 'తంగ మగన్‌' చిత్ర పోస్టర్లు గురువారం విడుదల చేశారు. ధనుష్‌ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమీజాక్సన్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రేమ, పెళ్లి... పెళ్లి తర్వాత ప్రేమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అమీ జాక్సన్ మోడ్రన్ లుక్ లో ఉండగా, సమంత కొత్తగా పెళ్లైన యువతిగా కనిపిస్తూ అభిమానులకు సినిమా మీద అంచనాలను పెంచుతున్నారు. ఈ సినిమా ఆడియోను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Wednesday, November 18, 2015

రోడ్లపై షికార్లు కొట్టిన బజ్జీ దంపతులు


 కొత్తగా పెళ్ల్లె ప్రముఖ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ తన భార్య గీతా బస్రాతో కలిసి రోడ్లపై షికార్లు కొట్టాడు. అయితే ఇందులో చిన్న తిరకాసు ఉందండోరు అది ఎంటో తెలిస్తే మీరు ఆశ్చర్యాని కి గురవ్వక తప్పదు. వారిద్దరూ ఫికార్టు కొట్టింది ఓ ద్విచక్ర వాహనంపై ఇంతకీ ఆ వాహనాన్ని నడిపింది ఎవరో తెలుసా... బజ్జీ సతీమణి గీతా బస్రా. వీరిద్దరూ షికార్లు కొడుతున్న సమయంలో తీసుకఁన్న కొన్ని ఫోటోలను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకఁన్న బజ్జీ.

'శ్రీమంతుడు' సైకిల్‌ను విజేతకు అందించిన సూపర్‌స్టార్‌ మహేష్‌


సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ 'శ్రీమంతుడు'. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచిన విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి జరిగిన కాంటెస్ట్‌లో విజేతను ఇటీవల డ్రా ద్వారా మహేష్‌ ఎంపిక చేశారు. కరీంనగర్‌కు చెందిన జి.నాగేందర్‌ రెడ్డి 'శ్రీమంతుడు' సైకిల్‌ విజేతగా నిలిచారు. విజేత జి.నాగేందర్‌ రెడ్డికి సూపర్‌స్టార్‌ మహేష్‌ చేతుల మీదుగా 'శ్రీమంతుడు' సైకిల్‌ను ప్రదానం చేశారు.

Tuesday, November 17, 2015

సునీల్ కోసం కథ రాశా!



‘‘సుకుమార్ ితీసే చిత్రాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అందుకే ఆయన ఈ కథ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నా’’ అని హీరో రాజ్ తరుణ్ అన్నారు. సుకుమార్ నిర్మాతగా మారి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. సూర్యప్రతాప్ దర్శకత్వంలో విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ 20న విడుదల కానుంది.


హీరో సునీల్ నాకు మంచి ఫ్రెండ్.  అప్పుడప్పుడూ ఆయనను  కలుస్తుంటాను. అప్పుడు తన కోసం ఓ కథ సిద్ధం చేయమన్నారు. సరదాగా కథ రాశాను గానీ దాన్ని తెరకెక్కించాలనే ఆలోచన లేదు. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఆలోచించను. ఖాళీ దొరికినప్పుడల్లా కథలు రాసుకుంటుంటాను

ఐటెం సాంగ్స్‌ ఓకే చెప్పిన స్టార్‌ హీరోయిన్‌


టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ ఐటెం సాంగ్స్‌ చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే శృతిహాసన్‌ ' ఆగడు' చిత్రంలో తమన్నా ' అల్లుడు శీను' చిత్రంలో ఐటెం సాంగ్స్‌ చేశారు. అదే బాటలో మరో స్టార్‌ హీరోయిన్‌ ఐటెం సాంగ్స్‌ చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా కాజల్‌ సైతం ఐటెం సాంగ్‌పై మక్కువ చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

Monday, November 16, 2015

ఇరవై రోజుల గ్యాప్‌లో మరొ మూడు సినిమా ...

  ఈ 27నే... ‘సైజ్ జీరో’
ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘సైజ్ జీరో’ ఒకటి. ఈ చిత్రం కోసం అనుష్క బరువు పెరగడం ప్రధాన ఆకర్షణ. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఆర్య, అనుష్క కాంబినేషన్‌లో ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు.

కానీ, అనుష్క నటించిన ‘రుద్రమదేవి’ని కూడా చిత్ర దర్శక-నిర్మాత గుణశేఖర్ అదే సమయంలో విడుదల చేయాలనుకోవడంతో ‘సైజ్ జీరో’ను వాయిదా వేశారు ప్రసాద్ వి. పొట్లూరి. ఆ వెనువెంటనే రావడానికి రామ్‌చరణ్ ‘బ్రూస్లీ’, అక్కినేని అఖిల్ పరిచయ చిత్రం ‘అఖిల్’ ఇవన్నీ ఉండడంతో ‘సైజ్ జీరో’ ఆగాల్సి వచ్చింది. దాంతో, నవంబర్ 27న విడుదల చేస్తున్నట్లు అప్పుడే పీవీపీ ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ డేటే సినిమాకు ఖాయమైంది.

డిసెంబర్ 10కి మారిన ‘బెంగాల్ టైగర్’

వాస్తవానికి ఈ నెల 26, 27తేదీల్లో ఒక రోజున ‘బెంగాల్ టైగర్’ను విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాత కేకే రాధామోహన్ అనుకున్నారు. కానీ, సరిగ్గా అప్పుడే ‘సైజ్ జీరో’ ఉంది. ‘బెంగాల్ టైగర్’ను దర్శకుడు సంపత్ నంది రవితేజ మార్క్ భారీ కమర్షి యల్ చిత్రంగా తీర్చిదిద్దారు.

ఈ రెండు చిత్రాలూ ఒకేరోజు విడుదలైతే వసూళ్లు డివైడ్ అవుతాయి. ఫలితంగా సినిమాలు పూర్తిస్థాయి బాక్సాఫీస్ సత్తా చాటుకొనే వీలుండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉభయతారకంగా ఉండేలా, రాధామోహన్ ‘బెంగాల్ టైగర్’ను వాయిదా వేసుకున్నారు. డిసెంబర్ 10వ తేదీని రిలీజ్ డేట్‌గా ఖరారు చేశారు. మధ్యలో డిసెంబర్ 4 శుక్రవారమైనా,  ‘శంకరాభరణం’ రిలీజ్‌కు ఉండడంతో 10వ తేదీకి వస్తున్నారు.

ప్రకటించిన డిసెంబర్ 4కే... ‘శంకరాభరణం’
 నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శంకరాభరణం’. టైటిల్ ప్రకటన నుంచే ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకట్టుకోగలిగింది. మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే ఈ సినిమాకు న్యాయం జరుగుతుందన్నది కోన వెంకట్ అభిప్రాయం.

‘బెంగాల్ టైగర్’, ‘శంకరాభరణం’ ఒకే రోజు రిలీజై, ఒకదానికి మరొకటి పోటీ కావడం కరెక్ట్ కాదని నిర్మాతలు ఒక అంగీకారానికి వచ్చారు. ‘సైజ్ జీర్’ డేట్‌తో క్లాష్ కాకుండా చూసుకున్న నిర్మాత రాధామోహన్ ‘శంకరాభరణం’తో కూడా డేట్స్ క్లాష్ లేకుండా సహాయపడ్డారు. ఫలితంగా, ముందుగా ప్రకటించిన డిసెంబర్ 4నే ‘శంకరాభరణం’ వస్తుంది. ఆ వెంటనే 10న ‘బెంగాల్ టైగర్’ పలకరిస్తుంది.

మొత్తం మీద ఇరవై రోజుల గ్యాప్‌లో ‘సైజ్ జీరో’, ‘బెంగాల్ టైగర్’, ‘శంకరాభరణం’ తెర మీదకొచ్చేస్తాయ్. ఒకే తేదీకి ఒకదానిపై మరొకటి పోటీ పడకుండా జాగ్రత్త పడ్డాయి.  వసూళ్ళు డివైడ్ కాకుండా, ఒక వారం పాటు ఏ సినిమాకు ఆ సినిమాకు పూర్తి ఎడ్వాంటేజ్ ఉండేలా ఈ మూడు చిత్రాల నిర్మాతలూ కలసి ఒక నిర్ణయానికి రావడం విశేషమే. సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మరీ పీవీపీ, రాధామోహన్, కోన వెంకట్‌లు తమ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం





బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తమిళనాడు ప్రభుత్వం 16 జిల్లాల్లో అన్ని విద్యాలయాలకు సెలవులు ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఆదివారం అర్దరాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తిరుమలలోనూ కుండపోత వర్షంలో ప్రజలు తీవ్ర ాబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మూడు చెరువులకు గండ్లు పడ్డాయి.
                  తిరుమల, నెల్లూరులో ఆదివారం నుంచి ఎడతతెరిపిలేని వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వెంకటగిరిలో 24 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. బాలాయపల్లిలో 14, డక్కిలిలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే ప్రకాశంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Sunday, November 15, 2015

లక్కీ డ్రాలో సొంతం చేసుకున్న నాగేందర్‌ రెడ్డి : ( శ్రీమంతుడు) సైకిల్‌





సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ 'శ్రీమంతుడు'. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నవంబర్‌ 14కి 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. గత కొంతకాలంగా ఈ చిత్రంలో ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించిన కాంటెస్ట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సైకిల్‌ విజేతను ఈరోజు డ్రా ద్వారా సూపర్‌స్టార్‌ మహేష్‌ ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్‌, రవి, సివిఎం మాట్లాడుతూ - ''మా శ్రీమంతుడు చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి గత కొంతకాలంగా ఒక కాంటెస్ట్‌ రన్‌ అవుతోంది. ఈ కాంటెస్ట్‌కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. వేలాదిగా ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. ఈ కాంటెస్ట్‌లో సైకిల్‌ విజేతను సూపర్‌స్టార్‌ మహేష్‌ ఈరోజు డ్రా ద్వారా ఎంపిక చేశారు. కరీంనగర్‌కు చెందిన జి.నాగేశ్వరరెడ్డి ఈ సైకిల్‌ను గెలుచుకున్నారు. విజేత జి.నాగేశ్వరరెడ్డికి మహేష్‌ చేతులమీదుగా సైకిల్‌ను అందజేయడం జరుగుతుంది'' అన్నారు.  

Saturday, November 14, 2015

' జబర్ధస్త్‌' యాంకర్‌గా చేయనున్న శ్యామల


తెలుగు బుల్లి తెరపై సంచల కార్యక్రంగా దూసుకు పోతుంది. ' జబర్దస్త్‌'. ఈటీవీలో ప్రసారం అయ్యే ఈ కామెడీ కార్యక్రమానికి నాగబాబు మరియు రోజా న్యాయ నిర్ణేతలు. ఇక ఈ కార్యక్రమంకు మొదట హాట్‌ యాంకర్‌ అనసూయ యాంకరింగ్‌ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రష్మి యాంకర్‌గా చేస్తోంది. గత కొంత కాలంగా రష్మికి వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. దాంతో రష్మి కూడా జబర్ధస్త్‌ నుండి దూరంగా వెళ్లబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ స్థానంలో శ్యామల రాబోతున్నట్లుగా ఈటీవీ వర్గాల నుండి సమాచారం. గత కొంత కాలంగా పలు ఆడియో ఫంక్షన్స్‌తో పాటు బుల్లి తెరపై పలు కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుది శ్యామల. ఈమెను జబర్దస్త్‌ యాంకర్‌గా ఎంపిక చేయాలని నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అతి తర్వలోనే జబర్దస్ల్‌ వేదికపై శ్యామలను చూపిస్తామేమో చూడాలి.

Thursday, November 12, 2015

హాజల్ కీచ్‌ తో యువీ నిశ్చితార్థం!

 టీమిండియా వన్డే వరల్డ్ కప్ హీరో,  ప్లే బాయ్ యువరాజ్ సింగ్ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యువరాజ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడన్నవార్తలకు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లే కనబడుతోంది. దీపావళి రోజున యువీ వివాహ శుభవార్త చెబుతాడని అభిమానులు ఎదురు చూపులు నిజం కాబోతున్నాయి. గత కొంతకాలంగా బ్రిటీష్ నటి హాజల్ కీచ్‌ తో ప్రేమాయణ సాగిస్తున్నయువీ..  ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం.  వీరద్దిరి నిశ్చితార్థం బాలిలో జరిగినట్లు తెలుస్తోంది.  ఈ మేరకు వారి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హజల్ ఓ ఉంగరంతో దర్శనమివ్వడం కూడా దీనికి మరింత బలం చేకూరుస్తోంది.

Tuesday, November 10, 2015

బ్లాస్టర్స్ లెక్క సరి చేస్తారా!

వారియర్స్‌తో నేడు రెండో టి20
  క్రికెట్ ఆల్‌స్టార్స్ సిరీస్

                 అమెరికాలోని క్రికెట్ అభిమానులు దిగ్గజాల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు మరో అవకాశం. ఆల్‌స్టార్స్ సిరీస్‌లో భాగంగా నేడు జరిగే రెండో టి20 మ్యాచ్‌లో సచిన్ బ్లాస్టర్స్ జట్టు వార్న్ వారియర్స్‌లో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సచిన్ సేన సిరీస్‌లో నిలబడాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం తప్పనిసరి. మొదటి మ్యాచ్‌లాగే దీనికి కూడా స్థానిక బేస్‌బాల్ మైదానం వేదిక కానుంది. ఇక్కడి మినట్ మెయిడ్ పార్క్‌లో టి20 మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్ తర్వాత వరుసగా క్రికెట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న వెటరన్లు రెండో మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యారు.
                సచిన్ జట్టులో అతనితో పాటు సెహ్వాగ్ మాత్రమే గత మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రంజీ ట్రోఫీ ద్వారా ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఉన్న సెహ్వాగ్ తనదైన శైలిలో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్మణ్‌కు బదులుగా గంగూలీ బరిలోకి దిగే అవకాశం ఉంది. బౌలింగ్‌లో షోయబ్ అక్తర్, మురళీలలో కాస్త మెరుపు కనిపించింది. పదును లేని ఆంబ్రోస్ స్థానంలో మెక్‌గ్రాత్‌కు అవకాశం దక్కవచ్చు.

'మరి కొన్నేళ్లు ఆ జోడిదే హవా'

  ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్ నంబర్ వన్ క్రీడాకారిణులు సానియా మీర్జా-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)లపై భారత టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది రెండు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ తో సహా తొమ్మిది టైటిల్స్ ను గెలిచిన సానియా-హింగిస్ ల జోడి కొన్నేళ్ల పాటు అదే ఊపును కొనసాగించి మరిన్ని గ్రాండ్ స్లామ్స్ ను సొంతం చేసుకుంటారని భూపతి అభిప్రాయపడ్డాడు.
' సానియా ఒక స్ఫూర్తి.  గత మూడు సంవత్సరాల నుంచి తీవ్రంగా కష్టపడుతూ  మంచి ఫలితాలను సాధిస్తోంది. ఆ జోడి జైత్రయాత్ర ఈ ఏడాదికి మాత్రమే పరిమితం కాదు..  వారి హవా మరి కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఆటలో సానియా-హింగిస్ ల సహకారం నిజంగా అద్భుతం' అని భూపతి కొనియాడాడు. 2016 రియో ఒలింపిక్స్ లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో సానియా-హింగిస్ ల ద్వయం, పురుషల డబుల్స్ లో రోహన్ బోపన్న-లియాండర్ పేస్ ల జోడి పతకాలను సాధించే అవకాశం ఉందన్నాడు.

Sunday, November 8, 2015

మగాళ్లు చెడ్డవాళ్లేం కాదు!

                         ఇంటర్వ్యూ

                              కాన్ఫిడెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తుంది నిత్యామీనన్. దాపరికాలు లేకుండా ఏ రహస్యాన్నయినా విప్పి చెబుతుంది. నదురూ బెదురూ లేకుండా ఏ అభిప్రాయాన్నయినా కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంది. తన దగ్గర వేషాలేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తానంటూనే, మగవాళ్లందరూ చెడ్డవాళ్లేమీ కాదంటూ నమ్మకాన్ని వ్యక్తపరుస్తోన్న నిత్య మనోభావాలు...

 మొదటిసారి మేకప్ వేసింది..?
                   ఎనిమిదేళ్ల వయసులో. మా ఇంటి పక్కన ఓ ఫొటోగ్రాఫర్ ఉండేవారు. ఆయన నా ఫొటో ఒకటి తీసుకుని తన యాడ్ ఏజెన్సీలో పెట్టారు. అది ఓ డెరైక్టర్ చూసి ఫోన్ చేశారు. తను తీయబోతోన్న ఇంగ్లిష్ సినిమాలో టబుకి చెల్లెలిగా నన్ను తీసుకుంటానన్నారు. మొదట ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు కానీ నేను సరదా పడటంతో ఓకే అన్నారు. అలా ‘హనుమాన్’ సినిమాతో యాక్టర్‌ని అయిపోయా! 
 నటిగా సెటిలవ్వాలని అప్పుడే  ఫిక్సైపోయారా?
                  లేదు. మా కుటుంబాల్లో అందరూ బాగా చదువుకున్నవాళ్లే. అందుకే నా దృష్టీ చదువుపైనే ఉండేది. మాస్ కమ్యునికేషన్స్ చదివి కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేశా. కానీ ఆ ఫీల్డ్ నాకు సరిపడదనిపించి మానేశా.
  మరి ఈ ఫీల్డ్ మీకు సరిపడిందా?
                     ఊహూ... నాకిది కరెక్ట్ ప్లేస్ కాదని ఎన్నోసార్లు అనిపించింది. ఈ ఫీల్డ్‌లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. ఓ మంచి పాత్ర చేసినప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ సెలెబ్రిటీ స్టేటస్ విసు గనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు దొంగచాటుగా ఫొటోలు తీయడం, మా గురించి ఏవేవో ఊహించి ప్రచారం చేయడం నాకు నచ్చదు. అలాగే మేము తమతో క్లోజ్‌గా ఉండాలని కొందరు ఆశిస్తారు. అలా చేయకపోతే మంచి అమ్మాయి కాదంటూ ముద్ర వేసేస్తారు. అయినా నేను నాకు నచ్చినట్టే ఉంటాను.
  మీరు యారొగెంట్ అనేది అందుకేనా?
                      ఏమో. నిజానికి నేను పొగరుగా ఉండను. స్ట్రిక్ట్‌గా ఉంటాను. అమ్మ, నాన్న ఉద్యోగస్తులు. నాతో రాలేరు. నా మేనేజర్ కూడా నాతో ఉండడు. అలాంటప్పుడు నా గురించి నేనే జాగ్రత్త తీసుకోవాలి కదా! అందుకే ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే ఊరుకోను. లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. అది యారొగెన్సీ కాదు. మంచి విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా నిర్భయంగా చెప్పేయాలి. లేదంటే మనల్ని మనమే తక్కువ చేసుకున్నవాళ్లం అవుతాం.
  ఎక్కువగా లేడీ డెరైక్టర్స్‌తో పని చేస్తారు... సేఫ్టీ కోసమా?
                      అంజలీ మీనన్, నందిని, అంజు, శ్రీప్రియ లాంటి మహిళా దర్శకురాళ్లతో పని చేసే చాన్స్ అనుకోకుండానే వచ్చింది తప్ప నేను కావాలని వాళ్లని ఎంచుకోలేదు. అయినా నేనింత వరకూ పనిచేసిన వాళ్లలో ఏ మేల్ డెరైక్టర్, యాక్టర్ నన్ను ఇబ్బంది పెట్టలేదు. మగాళ్లంతా చెడ్డవాళ్లు కాదుగా!   గ్లామర్ పాత్రలు చేయరేం?
 నాకు సౌకర్యవంతంగా అనిపించనిదేదీ నేను చేయను. అందుకే కథ వినేటప్పుడే సీన్ల గురించి, కాస్ట్యూమ్స్ గురించి క్లియర్‌గా మాట్లాడేసుకుంటాను. 
అలా అయితే అవకాశాలు తగ్గవా?
            నాకు తగ్గలేదుగా! ఓ పాత్రకి నేనైతేనే సరిపోతాను అనుకున్నప్పుడు దర్శకులు నా దగ్గరకే వస్తున్నారు. వేరే వాళ్లకి ఇవ్వట్లేదుగా!
 లావుగా ఉంటారని... పొట్టి అని?
 (నవ్వుతూ) నేను ఫిజిక్‌ని మెయిం టెయిన్ చేయను. అందుకే కాస్త లావుగా ఉంటాను. నటన కోసం తిండిని త్యాగం చేయడం పిచ్చితనం అనిపిస్తుంది నాకు. ఇక హైట్ సంగతి. పొడవు, పొట్టి, అందం... ఇవన్నీ ఇచ్చేది దేవుడు. ప్రవర్తన సరిగ్గా లేకపోతే విమర్శించాలి గానీ, దేవుడు ఇచ్చినవాటిని విమర్శించకూడదు.
  పెళ్లెప్పుడు?
            ఇతనితో నా జీవితం ఇప్పటికంటే బాగుంటుంది అనుకోదగ్గ వ్యక్తి ఎదురు పడినప్పుడు. తగనివాణ్ని చేసుకుని బాధపడే బదులు, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడమే మంచిది.
 
    ఇంతవరకూ అలాంటి వ్యక్తి ఎదురు పడలేదా?
             లేదు. పద్దెనిమిదేళ్ల వయసులో ఓసారి ప్రేమలో పడ్డాను. కానీ అతనితో జీవితం అంత గొప్పగా ఉండదనిపించి విడి పోయాను. తర్వాత ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు. చూద్దాం... మళ్లీ నా మనసులో ప్రేమ ఎప్పుడు పుడుతుందో!

దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. - See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.vr1GUlTl.dpuf
దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. - See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.vr1GUlTl.dpuf
దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. - See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.vr1GUlTl.dpuf
దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. - See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.vr1GUlTl.dpuf
దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. - See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.vr1GUlTl.dpuf
మహబూబ్‌నగర్: దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
- See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.iMFXc8u7.dpuf
మహబూబ్‌నగర్: దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
- See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.iMFXc8u7.dpuf
మహబూబ్‌నగర్: దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
- See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.iMFXc8u7.dpuf
మహబూబ్‌నగర్: దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
- See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.iMFXc8u7.dpuf
మహబూబ్‌నగర్: దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
- See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.iMFXc8u7.dpuf
మహబూబ్‌నగర్: దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
- See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.iMFXc8u7.dpuf
మహబూబ్‌నగర్: దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
- See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.iMFXc8u7.dpuf
మహబూబ్‌నగర్: దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నటుడు ప్రకాశ్‌రాజ్ నేడు టాయిలెట్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు గ్రామంలో పర్యటించిన ఆయన గ్రామ సభల నిర్వహణ ద్వారా సమస్యలను గుర్తించారు. వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు మౌలిక సమస్యల పరిష్కారంపై ఆయన దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగానే నేడు గ్రామంలో టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యమే మా బలమని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు చాలా మంచిగా గడిచిందంటూ పేర్కొంటూ నేటి కార్యక్రమ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
- See more at: http://www.namasthetelangaana.com/cinema-news-telugu/actor-prakashraj-started-building-toilets-in-kondareddypally-1-1-460268.html#sthash.iMFXc8u7.dpuf

Saturday, November 7, 2015

సచిన్ @ వార్న్

 నేటి నుంచి క్రికెట్ ఆల్ స్టార్స్ లీగ్
     న్యూయార్క్‌లో తొలి మ్యాచ్

అంతర్జాతీయ క్రికెట్‌లో తమ అద్భుత విన్యాసాలతో ఆటపై చెరగని ముద్ర వేసిన దిగ్గజ ఆటగాళ్లు మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ నిర్వహిస్తున్న ‘క్రికెట్ ఆల్ స్టార్స్’ టి20 లీగ్‌కు నేటి (శనివారం) నుంచి తెర లేవనుంది. దీంట్లో భాగంగానే ఆయా దేశాల మాజీ ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్నారు. తమ సత్తా ఏమిటో నేటి తరానికి పరిచయం చేయనున్నారు.
సచిన్ జట్టే ఫేవరెట్
 ఇక జట్ల విషయానికొస్తే.. గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్, బ్రియాన్ లారా లాంటి దిగ్గజాలతో సచిన్ జట్టు బ్యాటింగ్‌లో బలంగా ఉంది. భారత్ తరఫున గంగూలీతో పాటు సెహ్వాగ్‌తోనూ సచిన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఈసారీ అలాంటి దృశ్యమే కనిపించనుందా లేక దాదా, వీరూ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారా అనేది వేచి చూడాలి. బ్రియాన్ లారా, జయవర్ధనే, ఆల్‌రౌండర్ క్లూసెనర్ ప్రత్యర్థిని ఎలా వణికిస్తారనేది ఆసక్తికరం. ఇక బౌలింగ్‌లో పేసర్లు అక్తర్, పొలాక్, మెక్‌గ్రాత్, స్పిన్నర్ మురళీధరన్, స్వాన్  సత్తా తెలిసిందే. వీరంతా తమ పూర్వపు స్థాయి అందుకుంటే గెలుపు ఖాయమే..

 సంగక్కరే కీలకం
 వార్న్ వారియర్స్ జట్టులో కుమార సంగక్కర కీలకంగా కనిపిస్తున్నాడు. ఇటీవలి వరకు క్రికెట్‌తో టచ్‌లో ఉండడంతో పాటు పొట్టి ఫార్మాట్‌లో మంచి అనుభవముంది. వార్న్ కూడా బిగ్‌బాష్‌లో మెరిసినవాడే. కలిస్ ప్రభావం చూపించవచ్చు. ఫీల్డింగ్‌లో జాంటీ రోడ్స్ పాదరసంలా కదిలితే సచిన్ జట్టు పరుగుల కోసం చెమటోడ్చాల్సిందే. బౌలింగ్‌లో 49 ఏళ్ల వసీం అక్రమ్ మరోసారి తన యార్కర్ పవర్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. స్పిన్నర్లు వెటోరి, సక్లయిన్ ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి.

 జట్లు
 సచిన్ బ్లాస్టర్స్: సచిన్ (కెప్టెన్), గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్, లారా, జయవర్ధనే, హూపర్, మొయిన్ ఖాన్, మురళీధరన్, స్వాన్, అంబ్రోస్, పొలాక్, మెక్‌గ్రాత్, క్లూసెనర్, అక్తర్.
 వార్న్ వారియర్స్: వార్న్ (కెప్టెన్), హేడెన్, వాన్, పాంటింగ్, రోడ్స్, కలిస్, సైమండ్స్, సంగక్కర, సక్లయిన్, వెటోరి, వాల్ష్, అక్రం, డొనాల్డ్, అగార్కర్.

Thursday, November 5, 2015

ఆల్-స్టార్ టీ 20 సిరీస్ వార్న్ vs సచిన్ టీమ్ ప్రకటన


సచిన్ బ్లాస్టర్స్ జట్టులో వార్న్ వారియర్స్ ప్లేయర్స్ జాబితా, ఆల్ స్టార్ T20 లీగ్ 2015  క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఉంటాయి.
                   1st T20 మ్యాచ్ నవంబర్ 7, 2015 న మొదలు. 2nd T20 నవంబర్ 11 హాయౌస్టన్ లో మినట్ మైడ్ పార్క్ వద్ద ఆడతారు. మూడవ మరియు ఆఖరి T20 నవంబర్ 14 న లాస్ ఏంజిల్స్ లో మోసగాడు స్టేడియం ఆతిథ్యమిస్తుంది. 



 

Wednesday, November 4, 2015

కోచ్ గా మారనున్న పాక్ మాజీ బ్యాట్స్ మన్

 పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్- హక్ కోచ్ అవతారం ఎత్తనున్నాడు. అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్ గా అతడు ఎంపికయ్యాడు. రెండేళ్ల పాటు అతడీ పదవిలో కొనసాగనున్నాడు. ఈమేరకు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇంజమామ్ అంగీకరించాడని అఫ్గానిస్థాన్ మాజీ కోచ్, పాకిస్థాన్ క్రికెట్ సెలెక్టర్ కబీర్ ఖాన్ తెలిపారు. జింబాబ్వేతో మ్యాచ్ గెలిచాక అఫ్గానిస్థాన్ ప్రదర్శనపై ఇంజమామ్ సంతృప్తి వ్యక్తం చేశాడని, కోచ్ కు ఉండేందుకు ఒప్పుకున్నాడని చెప్పాడు. ఇంజమామ్ గొప్ప ఆటగాడని, అతడి నేతృత్వంలో అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు ప్రమాణాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ తరపున ఇంజమామ్ వుల్-హక్ 120 టెస్టులు, 388 వన్డేలు ఆడాడు. పాకిస్థాన్ టీమ్ కు కోచ్ గా రెండేళ్ల క్రితం అతడికి అవకాశం వచ్చింది. అయితే పాక్ క్రికెట్ బోర్డుతో ఆర్థిక వివాదాల కారణంగా ఆ అవకాశాన్ని అతడు తిరస్కరించాడు.

నిజమైన పెళ్లిలా అనిపించింది !

 ఈ సినిమాలో నా పాత్ర పేరు కూడా నవీన్‌చంద్ర. ఈ సినిమాలో పెళ్లి సీన్ ఉంటుంది. నిజంగా పెళ్లి జరుగుతుందేమో అని భయం వేసింది. స్వాతి మెడలో తాళి కట్టే టైమ్‌లో నా చేతులు వణికాయి కూడా. స్వాతి కూడా కొంచెం టెన్షన్ ఫీలైంది. అయినా సింగిల్ టేక్‌లో ఈ సీన్‌ను ఓకే చేశాం. త్రిపుర పాత్రలో స్వాతి బాగా నటించింది. స్వాతి నా కంటే సీనియర్ కావడంతో తనతో ఎలా యాక్ట్ చేయాలా అనుకున్నా. ఆమె కూడా ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో నాకు ఆ భయం పోయింది.  మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ప్రస్తుతం హీరోగా నటించిన ‘లచ్చిందేవికో లెక్కుంది’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరితే త్వరలో నా నుంచి పెళ్లి కబురు అందుతుంది’’ అని చెప్పారు. స్వాతి నా కంటే సీనియర్ కావడంతో తనతో ఎలా యాక్ట్ చేయాలా అనుకున్నా. ఆమె కూడా ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో నాకు ఆ భయం పోయింది.  మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ప్రస్తుతం హీరోగా నటించిన ‘లచ్చిందేవికో లెక్కుంది’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరితే త్వరలో నా నుంచి పెళ్లి కబురు అందుతుంది’’ అని చెప్పారు.