Friday, February 4, 2011

పెళ్లికొడుకు కాబోతున్న జూనియర్‌ ఎన్టీఆర్‌

 టాలీవుడ్‌ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ పెళ్లికొడుకు కాబోతున్నాడు. ప్రముఖ రియల్డర్‌ నార్నె శ్రీనివాసరావు కుమారై లక్ష్మీ ప్రణతితో ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి, మార్చిల్లో వివాహం జరపాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 13న జూనియర్‌ ఎన్టీఆర్‌ తండ్రి హరికృష్ణ నివాసంలో సమావేశమై వివాహం తేదీని పెద్దలు ఖరారు చేయనున్నారు.

నాగవల్లి ఆర్థశతదినోత్సవం


వెంకటేష్‌ హీరోగా నటించిన 'నాగవల్లి' అన్ని ముఖ్యకేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకుంది. పి.వాసు దర్శకత్వంలో శ్రీసాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌పై బెల్లంకొండ సురేష్‌ నిర్మించారు. 50 రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ...'మా నాగవల్లి చిత్రాన్ని ఆదరించి సూపర్‌హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అని కేంద్రాల్లో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్నందుకని హ్యాపీగా వుంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గారు ఈ సినిమా చూసి మేకింగ్‌ ఎక్స్‌ట్రార్డినరీగా వుందని ఫోన్‌ చేసి చెప్పడం ఎంతో థ్రిల్‌ కలిగించింది' భారీ చిత్రాని తీసే అవకాశం ఇచ్చిన వెంకటేష్‌బాబుకి, సురేష్‌బాబుకి థాంక్స్‌' అనిఅన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ తీన్‌మార్‌ వాల్‌పేపర్స్‌






ఈ 25 ఏళ్లలో డా || రాజశేఖర్‌...

డా || రాజశేఖర్‌... ఆయన పుట్టిన రోజు నేడే ..
నటుడిగా రాజశేఖర్‌ వయసు 25. ఈ ఏళ్ల కెరీర్‌ను విశ్లేషించుకుటే అనందంగా ఉందని ఆయన అన్నారు. అలాగే అయాన మెడిసన్‌ పూర్తి చేసి కూడా 25 ఏళ్లవుతుంది. '' ఒకవైపు నటుడిగా చేస్తు మరోవైపు వైద్యం కూడా చేస్తున్నాను. నటుడిగా ప్రేక్షకులికి వినోదాని అందించడంతో పాటు ఓ డాక్టర్‌గా ఎంతో మందిని ఆరోగ్యవంతుల్ని చేస్తున్నందుకు ఆనందంగా వుంది. ప్రస్తుతం ఆయన ' మహంకాళి' లో నటిస్తున్నారు. రాజశేఖర్‌ సతీమణి జీవిత దర్శకత్వంలో ఈ చిత్రాని ఏలూరు సురేందర్‌రెడ్డి ని ర్మిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలు రాజశేఖర్‌ చెబుతూ.. '' శత్రువులను శిక్షించే నిజాయితీగల ఓ పోలీసాఫీసర్‌గా మహంకాళిగా ఇందులో నటిస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్నో పోలీస్‌ కథలు వచ్చాయి. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల చేస్తాం.

' జైబోలో తెలంగాణ ' తిలకించిన కేసీఆర్‌

 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో దర్శకఁడు ఎస్‌. శంకర్‌ రూపొందించిన జైబోలో తెలంగాణ సినిమా శ్రుకవారం విడుదల అయ్యింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన జైబోలో తెలంగాణ చిత్రాన్ని టీఆర్‌ఎస్‌ అధ్యక్షడు కేసీఆర్‌ తిలకిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్‌ దియేటర్‌లో తన కుటుంబ సభ్యులతో కలసి జైబోలో తెలంగాణ చిత్రాన్ని చూశారు.