Monday, February 8, 2016

కథ కుదిరింది


‘నేను.. శైలజ’ అంటూ ఓ ప్రేమకథ వినిపించి తొలి అడుగులోనే ఆకట్టుకొన్న దర్శకుడు కిషోర్‌ తిరుమల ఇప్పుడాయనకు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. నితిన్‌తో ఓ సినిమా ఓకే చేసుకొన్న కిషోర్‌..ఇప్పుడు వెంకటేష్‌కీ కథ వినిపించేశారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు వెంకటేష్‌. ఆ తరవాత కిషోర్‌ సినిమా పట్టాలెక్కుతుంది. మల్టీ డైమెన్షన్‌ రామ్‌మోహన్‌ నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇటీవలే వెంకటేష్‌గారికి కథ వినిపించా. ఆయనకు బాగా నచ్చింది. ఆయన సినిమాలంటే వినోదంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలూ ఉండాలనుకొంటారు. అలాంటి కథే ఇది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామ’’న్నారు.