Friday, October 2, 2015

వార్మప్‌ మ్యాచ్‌ను తిరగేసిన సౌతాఫ్రికా

రోహిత్‌ శర్మ సెంచరీ వృధ్దా
ఏబి డివిలర్‌ అర్థసెంచరీ
మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ డుమిని


                 వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం సాధించింది. ఇప్పుడు సౌతాఫ్రికా జట్టు టి20 మ్యాచ్‌లో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం సాధించింది. భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు మధ్య జరిగిన మొదటి టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టు మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యం సాధించింది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్‌మెన్‌ జె.పి. డుమిని కేవలం 34 బంతులల్లో ఏడు సిక్స్‌లు, ఒక ఫోరు సహయంతో 68 పరుగులు చేసి విజయం జట్టుకు విజయం అందించాడు. అతని తోడు బిహర్‌డిన్‌ 23 బంతులల్లో ఒక సిక్స్‌, నాలుగు ఫోర్లుతో సహయంతో 32 పరుగులు చేసి జట్టుకు సహయ పడ్డాడు. వీరిద్దరు కలసి నాల్గొవికెట్టుకు 105 పరుగుల బాగ్యస్వామం నెలకోల్పారు. అంతక ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేశారు. ఓపెనరు శిఖర్‌ ధావన్‌ 3 పరుగులకే రనౌట్‌గా పెవిలియన్‌ చేరుకున్నాడు. రోహిత్‌కు తోడుగా విరాట్‌ కోహ్లి జతకలిశారు. రెండో వికెట్లుకు 138 పరుగులు చేశారు. రోహిత్‌ శర్మ మొదటి ఓవర్‌ నుంచి సౌతాఫ్రికాపై ఎదురుదాడి చేశాడు. ఆవాకాశం దొరికినప్పుడల్లా ఫోర్లు, సిక్స్‌లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఎడ్‌లో విరాట్‌ కోహ్లి కూడా అతని సమానంగా అడ్డాడు. ఇమ్రాన్‌ తాహిర్‌ బౌలింగ్‌లో ఏకంగా మూడు సిక్స్‌లతో రోహిత్‌ చేలరెగిపోయాడు. రోహిత్‌ సెంచరీ చేసి తర్వాత ఓవర్లల్లో అబాట్‌ బౌలింగ్‌లో ఔట్‌ అయ్యాడు. అదే ఓవర్లల్లో విరాట్‌ కోహ్లి   ( 43) ఔట్‌ అయ్యాడు. అతరువాత వచ్చిన బ్యాట్‌మైన్‌ తక్కువ పరుగులు చేశారు. భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. సౌతాఫ్రికా జట్టు ముందు భారీ లక్షాన్ని ఉంచింది. టీమిండియా మంచి స్కోరు రాబట్టింది. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో అబాట్‌ రెండు వికెట్లు తీయగా మౌరిస్‌ ఒక వికెటు లభించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. డివిలర్‌ 42 బంతులల్లో ఒక సిక్స్‌, ఏడు ఫోర్లులతో అర్థసెంచరీ చేశాడు. ఆమ్లా 36 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ 4 పరుగులు చేసి నిరాశపరిచాడు. డుమిన్‌ 68, బిహర్‌డిన్‌ 32 పరుగులు చేసి విజయం సాధించారు.