Wednesday, September 23, 2015

'దసరా' దమాకా

అక్టోబర్‌లో సినిమా సందండి              సినీ ప్రేక్షకులకు వినోదాల విందు అందించేందుకు తెలుగు కథానాయకులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్‌ నెలలో భారీ అంచనాలతో విడుదల కాబోతున్నాయి. రామ్‌ ' శివమ్‌' నఅఉష్క ప్రధాన పాత్రలో రూపొందిన ' రుద్రమదేవి', రామ్‌చరణ్‌ ' బ్రూస్‌లీ' అక్కినేని నటవారసుడుగా అఖిల్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న ' అఖిల్‌, నందమూరి కల్యాణ్‌ రామ్‌ ' షేర్‌' చిత్రాలు బరిలోకి వస్తున్నాయి. అక్టోబర్‌లో విడుదలకానున్న ఈ చిత్రాలూ విజయపరంపరను కొనసాగిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. దసరా పండుగకు అటూ ఇటూగా విడుదలవుతున్న చిత్రాలన్నీ భారీ స్థాయిలోనే ఉన్నాయి. పండుగా సందర్భంగా సెలవులు కలిసొచ్చే అవకాశం ఎలాగూ ఉంటుంది. దీంతో దియేటర్లకు మంచి అవకాశం వచ్చింది. ఈ ఒక నెలల్లోనే నాలుగు సినిమాలు భారీ బడ్డెట్‌తో వస్తున్నాయి.


మరో ప్రేమకథతో రామ్‌ ' శివమ్‌ '
         రామ్‌, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ' శివమ్‌' అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వస్తుంది అదే రోజు గాంధీ జయంతి వర్థంతి ఉత్సవం కావున సెలవు ఉంటుంది. ఈ సినిమా దర్శకుడిగగా శ్రీనివాస్‌ రెడ్డి పరిచమవుతున్నారు. సంగీతం దేవీశ్రీ ప్రసాద్‌ అందించారు.
' రుద్రమదేవి'గా వస్తున్న అనుష్క
        ఈ చిత్రం అక్టోబర్‌ రెండో వారంలో 9న విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడింది. దర్శకుడు గుణశేఖర్‌ పట్టువదల కుడా సినిమాని ప్రేక్షకుల ముందుకుతెస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్క టైటిల్‌ పాత్రలో నటిస్తుండగా అల్లు అర్జున్‌ గోనగన్నారెడ్డిగా. దగ్గుబాటి రానా చాశుక్య వీరభద్రుడిగా కన్పించనున్నారు. కృష్ణంరాజు, ప్రకాశ్‌రాజ్‌, నిత్యామీనన్‌, కేథరిన్‌గా నటిస్తుంది.


రామ్‌చరణ్‌ ' బ్రూస్‌లీ'           శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్న రామచరణ్‌ చిత్రం ' బ్రూస్‌ లీ' ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 16న విడుదలవుతోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ఫైటర్‌గా కన్పించనున్నాడు. హిరోయినుగా రకుల్‌ప్రీతిసింగ్‌ నటిస్తుంది. మెగాస్టార్‌ చిరంజీవి అతిధి పాత్రలో మెరవనున్నారు. ఆయన ఓ పాటలో సైతం కన్పిస్తారని సమాచారం.


అక్కినేని ' అఖిల్‌'       
       అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్‌ కథానాయకుడిగా పరిచయవతున్న చిత్రం ' అఖిల్‌' వీవీ వినాయక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరో కథానాయకుడు నితిన్‌ నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం మరో విశేషం. థమన్‌, అనూప్‌రూబెన్స్‌ పాటలకు స్వరాలు సమకుర్చగా.. మణిశర్మ నేపథ్యంలో సంగీతమందించారు. కథానాయికగా అయేషా సెహగల్‌ నటిస్తుంది.


' షేర్‌గా వస్తున్న కల్యాణ్‌రామ్‌

          నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ' షేర్‌' ఈ చిత్రం అక్టోబర్‌ 30న విడుదవుతోంది. కథానాయిక సోనాల్‌ చౌహాన్‌ నటిస్తుంది.