Wednesday, July 13, 2016

చూడకుండా ఉండలేనే...

సాయిరామ్‌శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం నేనోరకం శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రేష్మీమీనన్ కథానాయిక. సుదర్శన్ సలేంద్ర దర్శకుడు. శ్రీకాంత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. మహిత్ నారాయణ్ సంగీత దర్శకత్వంలో అంబట్ల రవి రచించిన చూడకుండా ఉండలేనే ఒక్క క్షణమైనా.. అనే పల్లవితో రూపొందిన ఈ చిత్ర సాంగ్ టీజర్‌ను దేవిశ్రీప్రసాద్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేనోరకం టీజర్, సాంగ్స్ ఎంటర్‌టైనింగ్‌గా వున్నాయి. సాయిరామ్‌శంకర్ కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. మహిత్‌నారాయణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది అన్నారు. 

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ సమకాలీన అంశాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆద్యంతం ఆసక్తికరమైన కథ, కథనాలతో థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నా గత చిత్రాలకు భిన్నంగా వుండే చిత్రమిది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ టైటిల్‌కు తగ్గట్లుగానే సరికొత్త ట్రీట్‌మెంట్‌తో రూపొందిస్తున్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్న నమ్మకముంది అన్నారు. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని రాధిక శరత్‌కుమార్ ఆసక్తిచూపిస్తున్నారు అని నిర్మాత తెలిపారు.