Wednesday, June 1, 2016

పండుగొచ్చింది..

 
అంతటా పండుగ వాతావరణం, విద్యుత్ కాంతుల్లో నగరం, స్పెషల్ అట్రాక్షన్‌గా, అతిపెద్ద జెండా ఆవిష్కరణ, ఆవిర్భావ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబు
కోట్ల కళ్లు ఎదురుచూస్తున్న పండుగ..అరవై ఏండ్ల కొట్లాట..వేయి మంది అమరుల బలిదాన ఫలితమైన రాష్ర్టావతరణ ఉత్సవం వచ్చేసింది. ఈ సంబురాలను అంబరాన్నంటేలా చేసుకునేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. నభూతో..నభవిష్యత్ అనే రీతిలో సిటీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు ప్రధాన కూడళ్లు విద్యుత్ కాంతులు, త్రీడీ లైటింగ్‌తో ధగధగలాడుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివళ్లు, జెండావిష్కరణలతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించడానికి నగరం సిద్ధమైంది.

తెలంగాణ జాతికి పెద్ద పండుగొచ్చింది. రాష్ట్రం రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడోఏట అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లతో పాటు ట్యాంక్‌బండ్, పర్యాటక ప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అసెంబ్లీ, సచివాలయం, నెక్లెస్‌రోడ్, హుస్సేన్‌సాగర్ తీరం, ైఫ్లె ఓవర్లు విద్యుత్ వెలుగులతో జిగేల్‌మంటున్నాయి. అమరవీరుల స్తూపాలను పూలతో అలంకరించారు. ప్రధానంగా నగర వీధుల్లో ఎక్కడచూసినా దసరా, దీపావళి లెక్కన ఉత్సాహం కనిపిస్తున్నది. 
 
నగరం..సప్తవర్ణశోభితం..
పురివిప్పిన నెమళ్లు, కనువిందు చేసే పూలు ఇంకా అనేక రకాల అలంకారాలతో నగర కూడళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబైన నగరం సప్తవర్ణ శోభతో అలరారుతోంది. మరోపక్క పరేడ్ మైదానంలో వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. వేడుకలకు స్వాగతం పలుకుతూ హెచ్‌ఎండీఏ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. సంజీవయ్య పార్కులో ఎత్తైన జాతీయ పతాకం ఎగురవేయడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. దసరా, దీపావళి కలిసి వచ్చినట్టు నగరమంతా పండుగశోభను సంతరించుకుంది. 











 

ముచ్చటగా మూడో నెల?

 ‘‘నేను ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు? రెండేళ్ల వరకూ పిల్లలు వద్దనుకున్నాం. అసలు ఎక్కణ్ణుంచి ఇలాంటి వార్తలు పుట్టుకొస్తాయో అర్థం కావడంలేదు’’ అని కరీనా కపూర్ ఆ మధ్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. దాంతో ఇప్పట్లో కరీనా, సైఫ్ అలీఖాన్ తల్లిదండ్రులయ్యే అవకాశం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో తాజాగా ఓ వార్త ప్రచారంలోకొచ్చింది. కరీనా ప్రెగ్నెంట్ అన్నది ఆ వార్త సారాంశం.

ఆమెకు మూడో నెల అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే కరీనా, సైఫ్ లండన్ వెళ్లారు. హాలిడేస్‌ని ఎంజాయ్ చేసి, మంగళవారం ఇండియా వచ్చారు. కరీనా ప్రెగ్నెంట్ అనే వార్త బుధవారం గుప్పుమంది. బాలీవుడ్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్. దీనికి ఈ భార్యభర్తల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మౌనం అర్ధాంగీకారం అంటారు. సో.. కరీనా నిజంగానే తల్లి కాబోతున్నారా? లేక గతంలో ప్రచారం అయినట్లుగా ఇది కూడా వదంతిగా మిగిలిపోతుందా? వేచి చూడాల్సిందే.
 

ఈ మెగా సెల్ఫీ చాలా అరుదు గురూ

 ఒక సాధారణ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటేనే ఒక వార్తగా నిలుస్తుంది. అలాంటిది ఓ ఐదుగురు ప్రముఖులు ఓ చోట చేరి సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ పట్టరాని సంతోషంతో.. ఇంకా ఆసక్తిగా చెప్పాలంటే ఒకే రకమైన వస్త్రాలు వేసుకొని.. ఎవరి మొఖంలో నవ్వుచూసినా అదే పరిమాణంలో ఉండి.. ఈ అరుదైన సెల్ఫీ తిరుపతిలో ఆవిష్కృతమైంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ చెరిగిపోని చరిత్రను లిఖించుకున్న ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి, నట సామ్రాట్ అక్కినేని నాగార్జున, గీతా ఆర్ట్స్ సారధి అల్లు అరవింద్.. వీళ్లందరికీ ఒక్కసారిగా అదనపు రంగు అద్దినట్లుగా మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, వ్యాపార ప్రముఖుడు నిమ్మగడ్డ ప్రసాద్ కలిసి ఈ స్వీయ చిత్రాన్ని తీసుకున్నారు. బయటకు వచ్చిన ఈ ఫొటోను చూసిన వారంతా కూడా వావ్ వాట్ ఏ సెల్ఫీ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.