Wednesday, November 16, 2016

పవన్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసింది

  ‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక కీర్తీసురేశ్‌ పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఈ విషయాన్ని కీర్తీసురేశ్‌ స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రకటించారు. తన తర్వాతి చిత్రం పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌లతో కావడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగులో ఆయన స్వరాలు అందిస్తున్న తొలి చిత్రమిది. పవన్‌-త్రివిక్రమ్‌ కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ ఘన విజయాలు సాధించడంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. డిసెంబరు నుంచి ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ ‘కాటమరాయుడు’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కీర్తీసురేశ్‌ ‘భైరవ’, ‘నేను లోకల్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.