Monday, June 20, 2016

రక్షించడానికి పోతే.. చంపేసింది..

ఎలుగుబంటి దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆ ఎలుగుబంటి కాళ్లకు కంచెఉచ్చు పడడంతో ఆరు గంటలపాటు మృతదేహం వద్దే ఉంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్‌పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. నల్లమల అటవీ సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి అటవీ జంతువులు రాకుండా ఉండేందుకు రైతులు కంచె ఏర్పాటు చే శారు.
 
గ్రామానికి చెందిన బోడ్యానాయక్(50) తన వ్యవసాయ పొలం వద్దకు సోమవారం తెల్లవారుజామున వెళ్లాడు. కంచెలో ఎలుగుబంటి చిక్కుకుంది. అయితే సదరు రైతు దానిని అడవిపంది అనుకొని వెళ్లగొట్టేందుకు దగ్గరికి వెళ్లాడు. ఎలుగుబంటి ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. అటు ఎలుగుబంటి, ఇటు రైతు బోడ్యానాయక్ కంచెలో ఇరుక్కుపోయారు. ఎలుగుబంటి దాడిలో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కంచెఉచ్చులో ఇరుక్కుపోయిన ఎలుగుబంటి తప్పించుకోలేకపోయింది. బోడ్యా శరీర భాగాలను చీల్చివేసింది.

అప్పటికే అరుపులను విన్న చుట్టపక్కల రైతులు.. కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కానీ ఎవరూ దగ్గరికి వెళ్లే సాహసం చేయలేదు. నగరపంచాయతీ కమిషనర్ కె.తులసీరాం అటవీశాఖ, పోలీసు,రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నాగర్‌కర్నూల్ ఆర్‌డీఓ దేవేందర్‌రెడ్డి, అటవీశాఖ డీఎఫ్‌ఓ బాలస్వామి, తహసీల్దార్ ఎం.సుదర్శన్‌రెడ్డి, అచ్చంపేట సీఐ వెంకటేశ్వర్లు,ఎస్‌ఐలు అనుదీప్,శ్రీధర్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉచ్చులో ఉన్న ఎలుగుబంటిని బయటికి తీయడానికి హైదరాబాద్ జూపార్కుకు సమాచారం ఇచ్చారు.

అటవీశాఖ అధికారులు ఎలుగుబంటి బయటికి వెళ్లకుండా ఉండేందుకు తాత్కాలిక వలయం ఏర్పాటు చేశారు. జూపార్కు అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ ఎంఏ హాకీం, అసిస్టెంట్ క్యూరేటర్ శ్రీదేవి, జేఏఓ ఎంఏ గఫార్, ఇంతియాస్, శివ, జిలానీలు వచ్చి ఎలుగుబంటికి బాణంతో మూడు మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. దీంతో అది మత్తులోకి జారుకున్న తర్వాత బోనులోకి ఎక్కించి హైదరాబాద్ జూపార్కుకు తీసికెళ్లారు. వన్యప్రాణి రక్షణ రిస్క్ టీం వచ్చి బోడ్యానాయక్ మృతదేహాన్ని బయటికి తీశారు. ఎలుగుబంటికి 4 నుంచి 5 ఏళ్ల వయస్సు ఉంటుందని, మగదిగా నిర్ధారించారు. ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరగగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆపరేషన్ పూర్తయ్యింది.

నేను డేటింగ్‌లో లేను!

బాలీవుడ్ తారలపై పుకార్లు అనేవి సర్వసాధారణం. ఎంత ఎక్కువ స్థాయిలో పుకార్లు వినిపిస్తే అంత పాపులారిటీ వస్తుందనేది అక్కడి తారలు నమ్మే సిద్ధాంతం. అయితే తాను అందుకు పూర్తిగా వ్యతిరేకమని చెబుతోంది కృతిసనన్. వివరాల్లోకి వెళితే...హీరో పంటి చిత్రంతో బాలీవుడ్ బాటపట్టిన కృతిసనన్ ప్రస్తుతం దినేష్ విజన్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రబ్తాలో నటిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్నాడు.
Kriti-Sanon
ఇటీవల తన ప్రేయసి అంకిత లోఖండేతో విడిపోవడంతో ఈ సినిమా చిత్రీకరణ సమయం నుంచి కృతిసనన్, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ల మధ్య ప్రేమాయణం మొదలైందని, ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్‌లో వున్నారని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా కృతిసనన్ మాట్లాడుతూ ఇక చాలు. నాపై రూమర్‌లు ఆపండి. సహనటులతో సన్నిహితంగా వుంటే డేటింగ్‌లో వున్నామని అనవసరమైన కథనాల్ని సృష్టిస్తున్నారు. అ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. సుశాంత్, నేను మంచి స్నేహితులం అంతే. ఓ సినిమా కోసం సన్నిహితంగా మెలిగితే ఇద్దరి మధ్య ఏదో వుందని ప్రచారం మొదలుపెట్టడం విచారకరం. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు అని తెలిపింది. మహేష్‌బాబు నటించిన వన్ నేనొక్కడినే చిత్రంతో కృతిసనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే.

Sunday, June 19, 2016

ఇక చాలు.. కట్టు కథలకు అడ్డుకట్ట వేయండి!

సెలబ్రిటీలు కాస్త క్లోజ్‌గా మూవ్ అయితే చాలు.. వాళ్ల మధ్య ఏదో నడుస్తోందనీ... డేటింగ్ చేస్తున్నారనీ.. ఇలా రకరకాల గాసిప్పులు ప్రచారమవుతాయి. ముఖ్యంగా సినిమా రంగంలో మాత్రం ఇటువంటి గాసిప్పులకు కొదవే ఉండదు. ఫలానా హీరో ఫలానా హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడట.. ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్నారట... త్వరలో పెళ్లి చేసుకుంటారట...! వంటి వార్తలు కోకొల్లలు. ప్రస్తుతం కృతీసనన్, సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ గురించి అలాంటి ఓ వార్తే ప్రచారంలో ఉంది.

మహేశ్‌బాబుతో ‘1 నేనొక్కడినే’, నాగచైతన్యతో ‘దోచెయ్’ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ‘రాబ్తా’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రకథానాయకుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌తో ఆమె క్లోజ్‌గా మూవ్ అవుతున్నారన్న వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో ఇది ఓ హాట్ టాపిక్. ఇంకా మౌనం వహిస్తే, ఈ ప్రచారం వీర విహారం చేస్తుందనుకున్న కృతీ సనన్ స్పందించారు.

‘‘ఒక సినిమా చేసేటప్పుడు హీరో, డెరైక్టర్.. ఇలా అందరితో క్లోజ్‌గా ఉంటాం. అంత మాత్రాన ఏదో ఉన్నట్లేనా? ఏదీ లేకుండా ప్యూర్ ఫ్రెండ్‌షిప్ ఉండదా? సరదాగా మాట్లాడుకున్నంత మాత్రాన లవ్‌లో ఉన్నట్లేనా? ఇక చాలు.. సుశాంత్‌తో నాకేదో ఉందని అల్లిన కట్టుకథలకు అడ్డుకట్ట వేస్తే బెటర్’’ అని ఘాటుగా అన్నారు కృతి.

ఇదిలా ఉంటే..  చాలా రోజులుగా బుల్లితెర తార అంకితా లోఖాండేతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి ‘సమ్‌థింగ్’ ఉండేదనే వార్తలు వచ్చేవి. ఇటీవల ఈ ఇద్దరూ విడిపోవడంతో.. ఇప్పుడా ప్లేస్‌ని కృతి రీప్లేస్ చేసిందని చెప్పుకుంటున్నారు. కానీ, కృతి క్లారిఫికేషన్ ఇచ్చేశారు కాబట్టి.. ఇక వీళ్ల గురించిన వదంతులకు ఫుల్‌స్టాప్ పడుతుందని ఊహించవ

Tuesday, June 14, 2016

నన్ను పోలీసు అనుకునేవారు



డ్వెయిన్‌ జాన్సన్‌ అనే కన్నా.. ‘ది రాక్‌’ అంటేనే అతనెవరో అందరికి బాగా తెలుస్తుంది. ‘హెర్కులస్‌’.. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ వంటి చిత్రాలతో మెప్పించి నటుడిగా స్థిరపడినా.. డ్వెయిన్‌ కెరీర్‌ మాత్రం రెజ్లింగ్‌ పోటీలతో ప్రారంభమైంది. ఆరు అడుగులకుపైగా ఎత్తు.. కండలు తిరిగిన దేహంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోకు.. చిన్నతనంలో భారీ శరీరాకృతే ఇబ్బందులు తెచ్చి పెట్టిందట.
‘మా నాన్న బాక్సర్‌. దీంతో చాలా ప్రదేశాలకు మారాల్సి వచ్చేది. ప్రతిసారి కొత్త ప్రాంతాలు.. కొత్త స్కూళ్లలో చదవాల్సి వచ్చేది. నాకు 14 ఏళ్ల వయస్సు వచ్చినప్పటినుంచి నా దేహాన్ని చూసి.. అందరూ నన్ను అండర్‌ కవర్‌ పోలీసు అని భావించేవాళ్లు. ఏ పాఠశాలకు వెళ్లినా అలాగే అనుకునేవారు. అది చాలా ఇబ్బందిగా అనిపించేది. 14 ఏళ్ల వయసులో నాలుగు స్కూళ్లు మారాను. దీంతో నాకు స్నేహితులెవరు లేకుండా పోయారు. కనీసం అమ్మాయిలతో సరదాగా గడిపే అవకాశం కూడా రాలేదు’ అని వాపోయాడు.

ఇది నాన్న కానుక: నిహారిక


నటుడు, నిర్మాత నాగబాబు తన కుమార్తె నిహారికకు ఆడి కారు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఈ విషయాన్ని నిహారిక అభిమానులు ఫేస్‌బుక్‌ ద్వారా తెలుపుతూ నిహారిక తండ్రి నాగబాబుతో కారు పక్కన కలిసి దిగిన ఫొటోలను పోస్ట్‌ చేశారు. యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నిహారిక ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే యూట్యూబ్‌ సిరీస్‌లో నటించింది. ‘ఒక మనసు’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగశౌర్య కథానాయకుడిగా నటించారు. ఈ నెల 24న ‘ఒక మనసు’ చిత్రం విడుదల కానుంది.

మహేష్‌ దత్తత గ్రామంలో వైద్య శిబిరం



సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు దత్తత తీసుకున్న గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో వైద్య ఆరోగ్య సర్వే నిర్వహించారు. మహేష్‌ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వైద్య విద్యార్థులు గ్రామస్థులను కలిసిన సమయంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఎంతో శ్రమించి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్న యంగ్‌ ఇండియా వాలంటీర్‌ ఆర్గనైజేషన్‌కు మహేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యం పట్ల గ్రామస్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో 150 మంది వైద్య విద్యార్థుల బృందం పాల్గొన్నట్లు మహేష్‌ తెలిపారు.

Monday, June 13, 2016

చిరు చిందేస్తే..!


వెండితెరపై చిరంజీవి స్టెప్పేసి చాలా కాలమైంది. ‘బ్రూస్‌లీ’లో చిరు కనిపించినా అది పోరాట సన్నివేశమే. చిరు స్టెప్పేస్తే చూడాలని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ చిరంజీవి కాలు కదిపారు. అయితే సినిమా కోసం కాదు. ఓ అవార్డు వేడుకలో! ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో చిరంజీవి స్టెప్పులేసి ఆహూతుల్ని అలరించారు. ‘గ్యాంగ్‌ లీడర్‌’లోని ‘చికు చికు చైలం..’ పాటకు చిరు రిథమిక్‌గా చెలరేగిపోవడం అందరినీ ఆకట్టుకొంది. చిరుతో పాటు శ్రీకాంత్‌, సాయిధరమ్‌తేజ్‌, సునీల్‌, నవదీప్‌ చిందులేశారు. త్వరలోనే చిరంజీవి తన 150వ చిత్రంగా ‘కత్తి’ రీమేక్‌తో తెరపైకి రాబోతున్నారు. ఆ సినిమాలో వేయబోయే స్టెప్పులకు ఇది టీజర్‌ అన్నమాట! ఇదే వేదికపై అందాల భామలు తమన్నా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రాశీ ఖన్నా, శ్రియ డ్యాన్స్‌లతో అలరించారు.
కథానాయికలు శ్రీయ, తమన్నా, రకుల్ ప్రీత్‌సింగ్, రాశీ ఖన్నా, ప్రగ్యా జైశ్వాల్, ముమైత్‌ఖాన్ ఆటాపాటా ఈ వేడుకకు హైలైట్‌గా నిలిచాయి. ఆసక్తికరంగా జరిగిన ఈ అవార్డు వేడుకను మాటీవీలో ఈ నెల 25, 26 తేదీల్లో సాయంత్రం ప్రసారం చేయనున్నట్లు చానల్ ప్రతినిధులు తెలిపారు.

హీరోయిన్‌కు విడాకులు మంజూరు


బాలీవుడ్ లో ఓ జంట విడిపోయింది. ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ ఆమె భర్త సంజయ్ కపూర్ విడిపోయారు. సోమవారం ముంబయి ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో వారిద్దరు చట్టబద్దంగా విడిపోయారు. 2003లో వివాహం చేసుకున్న ఈ జంట గత రెండేళ్ల కిందటే పలుమార్లు ఘర్షణలు పడిన విషయం తెలిసిందే.
తామిద్దరం ఇక కలిసి ఉండటం ఏమాత్రం సాధ్యం కాదన్న నిర్ణయం మేరకు 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి పలు మలుపులు తీసుకున్న ఈ వివాదం చివరకు సోమవారం ఓ కొలిక్కి వచ్చింది. వీరికి సమైరా, కియాన్ అనే ఇద్దరు చిన్నారులు ఉండగా వారి సంరక్షణ బాధ్యతలు కరిష్మా చూసుకోనుంది. రెండు వీకెండ్ లలో మాత్రం సంజయ్ కపూర్ వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది. కరిష్మా కపూర్ మరో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ వాళ్ల సోదరి అనే విషయం తెలిసిందే.

ఈ మొబైల్‌ వంచితే.. చేతి గడియారం

నేటి ఆధునిక యుగంలో సాంకేతిక ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటోంది. వినూత్న ఆవిష్కరణలతో మానవుని అవసరాలను తీర్చుతోంది. ఇక ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అది మరింత స్మార్ట్‌గా మన ముందుకు రాబోతోంది. ఇప్పటిదాకా మనం ఫోన్‌ను చేతితో పట్టుకుని మాత్రమే ఉపయోగించాం. కానీ త్వరలో చేతికి వాచీలా ధరించి ఉపయోగించుకునేలా ఓ కొత్త మొబైల్‌ రూపుదిద్దుకుంటోంది.

ఇటీవల శాన్‌ఫ్రాన్సికోలో నిర్వహించిన ‘టెక్‌ వరల్డ్‌-2016’లో లెనోవా సంస్థ మడతపెట్టుకోగలిగే మొబైల్‌, ట్యాబ్‌లను ప్రదర్శించింది. ‘సీ-ప్లస్‌’గా పిలుస్తున్న ఈ మొబైల్‌ను అవసరమైనప్పుడు వాచీలా చేతికి ధరించి ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. దీన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చు.
 

Sunday, June 12, 2016

నాకెవరూ పోటీ కాదు

 నాకెవరూ పోటీ కాదు అంటున్నారు యువ నటి కీర్తీసురేశ్. తల్లి మేనక వారసురాలిగా తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ ఆదిలోనే అనూహ్య విజయాలను అందుకుని విజయపథంలో కొనసాగుతున్నారు. కోలీవుడ్‌లో ఇప్పటికి ఈమె నటించిన చిత్రాలు విడుదలైనవి రెండే రెండు చిత్రాలు. అందులో ఒకటి ఓకే అనిపించుకున్నా, రెండోది ఘన విజయం సాధించింది. దీంతో కీర్తీసురేశ్ రేంజ్ కోలీవుడ్‌లో ఒక్కసారిగా పెరిగిపోయింది. నీ నవ్వే చాలు చామంతీ అన్నట్లు కీర్తీసురేశ్ నవ్వే పెద్ద వశీకరణం అని సినీ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంటున్నారు. రాబోయే చిత్రాలు ఈ సుందరి పేరును మరింత ఇననుమడింపజేస్తాయనే నమ్మకంతో ఉన్నారీమె. కారణం ప్రస్తుతం తను నటిస్తున్న చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. వాటి గురించి కీర్తీసురేశ్ తెలుపుతూ తాను ధనుష్‌కు జంటగా నటించిన తొడరి, బాబీసింహా నటించిన పాంబుసండై చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయన్నారు.

ప్రస్తుతం భరతన్ దర్శకత్వంలో విజయ్‌కు జంటగా నటిస్తున్న చిత్రం, శివకార్తికేయన్ సరసన నటిస్తున్న రెమో చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయని చెప్పారు. తొడరి చిత్రంలో తనది చాలా ముఖ్యమైన పాత్ర అన్నారు. ఈ పాత్రకు అవార్డు వస్తుందని అంటున్నారని, అలా వస్తే సంతోషమేనని అన్నారు. ప్రస్తుతానికి మలయాళం, కన్నడం చిత్రాల్లో నటించడం లేదని చెప్పారు. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయని అయితే అధిక చిత్రాల్లో నటించాలనే ఉద్దేశమేమీ తనకు లేదని పేర్కొన్నారు. నటనకు అవకాశం ఉన్న మంచి బలమైన పాత్రల కోసం ఎదురు చూస్తున్నానన్నారు. ఇకపోతే తాను ఇతర హీరోయిన్లను పోటీగా భావించడం లేదన్నారు. తన ముందు చిత్రాల్లో పాత్రలనే పోటీగా తీసుకుని నటిస్తానని నటి కీర్తీసురేశ్ తెలిపారు.

‘ఆస్ట్రేలియా ఓపెన్‌ సిరీస్‌లో క్వీన్ సైనా నెహ్వాల్‌




హైద‌రాబాదీ స్టార్ ష‌ట్ల‌ర్‌, ఏడో సీడ్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూప‌ర్ సిరీస్‌ను గెలుచుకుంది. ఫైన‌ల్లో అన్‌సీడెడ్ చైనా ప్లేయ‌ర్ సున్ యుపై 11-21, 21-14, 21-19 తేడాతో సైనా విజ‌యం సాధించింది. తొలి గేమ్‌లో త‌డ‌బ‌డి సునాయాసంగా త‌ల‌వంచిన సైనా.. రెండో గేమ్ నుంచి అనూహ్యంగా పుంజుకుంది. రెండో గేమ్ మొద‌టి నుంచీ దూకుడుగా ఆడిన సైనా.. ఆ గేమ్‌ను 21-14తో సొంతం చేసుకుంది. ఇక నిర్ణ‌యాత్మ‌క మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ నువ్వానేనా అన్న‌ట్లు త‌ల‌ప‌డ్డారు. చివ‌రికి గంటా ప‌ద‌కొండు నిమిషాలు పోరాడిన సైనా టైటిల్ ఎగ‌రేసుకుపోయింది. సైనా ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెల‌వడం ఇది రెండోసారి. 2014లోనూ ఈ సూప‌ర్ సిరీస్ టైటిల్‌ను గెలిచింది సైనా. ఆమెకు ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కావ‌డం విశేషం.
ప్రధాని మోదీ, ప్రముఖుల అభినందనలు
సైనా కెరీర్‌లో ఈ విజయం మరో మైలురాయి అని, 2016 రియో ఒలింపిక్స్‌కు ఈ విజయం ప్రేరణ కలిగిస్తుందని భారత బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు అఖిలేశ్‌ దాస్‌ గుప్తా అన్నారు. సైనా కోచ్‌ విమల్‌ కుమార్‌, సిబ్బందిని అభినందించారు. ‘ఆస్ట్రేలియా ఓపెన్‌ సిరీస్‌లో అద్భుత విజయం సాధించిన సైనాకు అభినందనలు. నీ క్రీడా విజయాలతో దేశం యావత్తూ గర్విస్తోంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్లో అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌, శిఖర్‌ధావన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సినీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తదితరులు సైనాకు శుభాకాంక్షలు తెలిపి ఒలింపిక్స్‌ మంచి ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు.

ఆ హీరో ని పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి?

 తెలుగు ఇండస్ట్రీ లో అందాల రాక్షసి సినిమా తో పరిచయమయ్యి తన నటన తో అందం తో అందరిని ఆకట్టుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి.అందాల రాక్షసి సినిమా తర్వాత వచ్చిన దుసుకేల్తా,భలే భలే మగాడివోయి,సోగ్గాడు సినిమా లతో బాక్స్ ఆఫీసు వద్ద హిట్స్ అందుకుంది లావణ్య.తర్వాత వచ్చిన లచ్చిందేవికి ఒక లేక్కుంది సినిమా నిరాశపరిచిన లావణ్య క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.లావణ్య ఒక తెలుగు హీరో ని పెళ్లి చేసుకోబోతుందంట్ట్ట.

Saturday, June 11, 2016

ఆ క్షణం... నాకే కొత్తగా!

 మనలో మనకు నచ్చని విషయాలు చాలానే ఉంటాయి. అవసరం, అవకాశం వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటాం. రాశీ ఖన్నా కూడా అలా ఎప్పట్నుంచో ఓ విషయంలో మార్పు కోసం ప్రయత్నిస్తోంది. అది ఎంతకీ సాధ్యం కావడం లేదట. ఇంతకీ అదేంటి? అని ఆరా తీస్తే ‘సిగ్గు’ అని తేలింది. ‘‘చిన్నప్పట్నుంచి నేను సిగ్గరినే. పెద్దయ్యాకా ఆ విషయంలో మార్పు రాలేదు. కథానాయికని అయ్యాను కాబట్టి ఇక మెల్లమెల్లగా సిగ్గు, బిడియం లాంటివన్నీ దూరమవుతాయిలే అని మొదట్లో భావించేదాన్ని. ఇప్పటికీ అది అలాగే ఉంది. నా దర్శకులు నేను కలలోనూ ­హించని పాత్రలు సృష్టిస్తున్నారు. వాటిని విన్నప్పుడు ‘ఇంత సిగ్గరిని, ఈ పాత్రల్లో నేనా? అసలు సాధ్యమేనా?’ అనుకొంటుంటా. దర్శకుల నమ్మకం చూసి నేనూ ఓకే చెప్పేస్తుంటా. సెట్‌కి వెళ్లాక నేను ఆ పాత్రల్లో ఒదిగిపోతుంటా. ఆ క్షణం నాకే కొత్తగా అనిపిస్తుంటుంది. తెరపై నన్ను నేను చూసుకొని ఎంత ఆశ్చర్యపోతుంటానో మాటల్లో చెప్పలేను తెలుసా?’’ అని చెప్పింది రాశీ ఖన్నా. ఆమె ప్రస్తుతం రామ్‌, గోపీచంద్‌తో కలిసి నటిస్తోంది

చుక్కలు చూపించిన దీపిక!

 అదో ప్రముఖ విమానయాన సంస్థ... తమకు ప్రచారకర్తగా ఓ స్టార్  హీరోయిన్ కావాలనుకున్నారు. దీపికా పదుకొనేని మించిన స్టార్ ఎవరుంటారు? అనుకున్నారు. పైగా నిన్న మొన్నటి వరకూ బాలీవుడ్‌కే పరిమితమైన ఆమె ఇప్పుడిప్పుడే హాలీవుడ్‌లో కూడా ఫేమస్ అయిపోతున్నారు. అందుకే ఇంటర్నేషనల్‌గా కూడా వర్కవుట్ అవుతుందని వాళ్ల ఆలోచన. దీపిక క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు.
అంతే.. తమ ఎయిర్‌లైన్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరించాలని అడిగారు. యాడ్ చిత్రీకరణ కోసం నాలుగు రోజులు కాల్షీట్ అడిగారు. దీపిక సంతోషంగా ఓకే చెప్పేశారు. కానీ ఆమె అడిగిన పారితోషికం విని, ఆ కంపెనీ ప్రతినిధులు కళ్లు తేలేశారు. ఏదో రెండు.. మూడు కోట్లు అడుగుతుందని లెక్కలేసుకున్నారట. కానీ, దీపిక ఎనిమిది కోట్లు అడగడంతో షాక్ తిన్నారు. ఆ తర్వాత ఆ షాక్ నుంచి తేరుకుని వేరే హీరోయిన్‌ని వెతికే పనిలో పడ్డారని సమాచారం.

అనుష్కకి జోడీగా?



‘సరైనోడు’తో విలన్‌గా మారిన కథానాయకుడు ఆది పినిశెట్టి. ఆయన త్వరలోనే అనుష్కకి జోడీగా కనిపించనున్నట్టు సమాచారం. అనుష్క ప్రధాన పాత్రలో ‘భాగ్‌మతి’ చిత్రం తెరకెక్కబోతోంది. అశోక్‌.జి దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయిక ప్రాధాన్యంతో కూడిన ఈ చిత్రంలో అనుష్కకి జోడీగా ఒక కథానాయకుడు కనిపించాల్సి ఉందట. ఆ పాత్ర కోసం ఆదిని ఎంపిక చేసుకొన్నట్టు తెలుస్తోంది. మరి ఆ పాత్ర కూడా ప్రతినాయక ఛాయలతో కనిపిస్తుందా అనేది తెలియాల్సి వుంది. యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ కూడా ఓ అతిథి పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.

Thursday, June 9, 2016

ఒక ప్రశ్న... ముగ్గురి పోరాటం



చర్చి ఫాదర్‌ విముక్తి కోసం ప్రయత్నిస్తున్నాడు...
ఓ పోలీసు అధికారిణి న్యాయం కోసం చూస్తోంది...
ఓ తాత నిజం కోసం ఎదురుచూస్తున్నాడు...
ఈ ముగ్గురు కలసి ఒకే విషయమై పోరాటం చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా వేధిస్తోన్న ఓ నిజాన్ని తెలుసుకోవడానికి కృషి చేస్తున్నారు. ఆ పోరాటం ఎవరిపై.. ఏ విషయంలో... ఎందుకు... అనే విషయాలు తెలియాలంటే ‘తీన్‌’ చూడాల్సిందే. అమితాబ్‌ బచ్చన్‌, విద్యా బాలన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది. రిబుదాస్‌ గుప్తా దర్శకుడు. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
‘‘పాప గురించి ఏమైనా తెలిసిందా’’
- తన కళ్ల ముందే కిడ్నాపైన మనవరాలి కోసం తాత జాన్‌ బిశ్వాస్‌ ప్రశ్న!
‘‘ఎనిమిదేళ్లుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారు...’’
- ఇదీ పోలీసు అధికారిణి సరితా సర్కార్‌ సమాధానం!
‘‘అంతకుమించి నా దగ్గర ఇంకో ప్రశ్న లేదు...’’ కన్నీళ్లు తుడుచుకుంటూ జాన్‌ బిశ్వాస్‌ స్టేషన్‌ నుంచి బయటికొచ్చేస్తాడు.
ఇది పోలీసు స్టేషన్‌లో జరిగే ప్రధాన సన్నివేశం. పోలీసు స్టేషన్‌కు వచ్చేముందు జాన్‌ బిశ్వాస్‌ (అమితాబ్‌ బచ్చన్‌) ఓ టేపు రికార్డర్‌లో ఓ చిన్న పిల్ల మాటలు, ఏడుపు విని వస్తాడు. ఈ రోజే కాదు గత ఎనిమిదేళ్లుగా ఇంతే. స్టేషన్‌ నుంచి తిన్నగా ఇంటికి వెళ్లకుండా రాత్రి వరకు వూరంతా ఓ పాప ఫొటో పట్టుకొని వెతుకుతూ ఉంటాడు. ఓ రోజు ఇలా పోలీసు స్టేషన్‌కు వెళ్తుంటే జాన్‌ కళ్లముందే ఓ చిన్న పిల్లాడు అపహరణకు గురవుతాడు. దీంతో సరితా సర్కార్‌ (విద్యా బాలన్‌) నేతృత్వంలో పోలీసు బృందం గాలింపు ముమ్మరం చేస్తుంది. గతంలో పోలీసుగా పని చేసి ప్రస్తుతం చర్చి ఫాదర్‌గా ఉంటున్న మార్టిన్‌ దాస్‌ (నవాజుద్దీన్‌ సిద్ధిఖీ) సహాయం తీసుకుంటారు. అడ్డంకులు దాటి ఆ ముగ్గురు ఈ మిస్టరీ చేధించారా? అనేదే కథ. దక్షిణ కొరియాలో విజయవంతమైన ‘మాంటేజ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అమితాబ్‌ బచ్చన్‌ నటన ఈ చిత్రానికి ప్రధానాకర్షణ.

హీరోయిన్‌ని ఇంట్లో నుంచి గెంటేశారు

మోడల్‌, బాలీవుడ్‌ నటి అలీసా ఖాన్‌ పరిస్థితి ఏమీ బాగోలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మికిజంటగా అలీసా ఓ చిత్రంలో నడుస్తోంది. రాత్రి వేళ్లల్లో ఇంట్లో ఉండాల్సిన అలీసా దిల్లీ వీధుల్లో ఒంటరిగా తిరుగుతుండడం మీడియా గమనించి ఏం జరిగిందని ఆరా తీశారు. తన మాజీ ప్రియుడు అసభ్యకర వీడియోలన్నీ తీసి బెదిరిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని ఈ విషయం తెలిసి తల్లి, సోదరుడు తనని ఇంట్లో నుంచి గెంటేశాడని అలీసా మీడియాకి తెలిపింది. ఎటూ వెళ్లలేక గుళ్లలో, స్నేహితుల ఇళ్లలో తల దాచుకుంటున్నానని అలీసా తెలిపింది. పోలీసులు విషయం తెలుసుకుని అలీసా తల్లిదండ్రులతో మాట్లాడేందుకు యత్నిస్తున్నారు.

కోహ్లీ విషయం అడగ్గానే.. యువీకి కోపమొచ్చింది


టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫౌండేషన్, మరో ఛారిటీ సంస్థ స్మైల్ ఫౌండేషన్ కలసి ముంబైలో శుక్రవారం రాత్రి నిర్వహించిన  ఛారిటీ కార్యక్రమంలో కోహ్లీ, డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా స్టెప్పులతో అదరగొట్టారు. ఈ కార్యక్రమంలో టీమిండియా టి-20, వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, కె.ఎల్ రాహుల్, అజింక్యా రహానేతో పాటు ఆకాశ్ అంబానీ, గౌతమ్ సింఘానియా, నికిల్ చతుర్వేది, దిగ్విజయ్ సిన్హ్ కతివాడా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. క్రికెటర్లు చిన్నారులతో ఫొటోలు దిగి సందడి చేశారు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కార్యక్రమానికి ముందు అనూహ్య సంఘటన జరిగింది. మీడియా ప్రతినిధులు ఊహించని ప్రశ్న అడిగే సరికి యువరాజ్ సింగ్ శాంతం కోల్పోయాడు. ఒక్కసారిగా యువీకి ఒకింత కోపం వచ్చింది. యువీ సహనం కోల్పోయేలా చేసిన ఆ ప్రశ్న ఏంటంటే.. అన్ని ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీని నియమించే అవకాశం గురించి మీడియా ప్రతినిధులు అడిగారు. 'ఈ ఈవెంట్ గురించి మాట్లాడేందుకు ఇక్కడి వచ్చా. క్రికెట్ గురించి మాట్లాడేందుకు కాదు. ఓకే..? థ్యాంక్యూ' అంటూ మీడియా ప్రతినిధులకు మరో ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వకుండా యువీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా యువీ ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఈవెంట్ లో అందరితో కలసి హుషారుగా పాల్గొన్నాడు.

Wednesday, June 8, 2016

‘ఆషిఖీ-3’లో అన్నీ నేనే పాడుతా!

 మహేశ్‌భట్‌ వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఆలియాభట్‌. విభిన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. రొమాంటిక్‌ చిత్రం ‘ఆషిఖీ 3’లో ఈ భామ నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆలియా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
ఎలాంటి అంచనాలు లేకుండా 2013లో వచ్చిన ‘ఆషిఖీ 2’ రొమాంటిక్‌ మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. అందులోని ప్రతి పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదేస్థాయిలో ‘ఆషిఖీ 3’ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మోహిత్‌ సూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో అన్ని పాటలు తానే పాడనున్నట్లు ఆలియాభట్‌ తెలిపింది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని చెప్పిన ఈ అమ్మడు... సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్లనుందో మాత్రం తెలియదంటోంది.

స్టెప్పులు అదిరిపోతాయ్‌

 ఎన్టీఆర్‌ డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకొని మరీ బరిలో దిగాడేమో, ఎలాంటి భంగిమనైనా చిటికెలో చేసేస్తాడు. మెరుపు కంటే వేగంగా కాలు కదుపుతాడు. ఈసారి ‘జనతా గ్యారేజ్‌’లోనూ అలాంటి స్టెప్పులతోనే అదరగొట్టబోతున్నాడట. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. సమంత, నిత్యమేనన్‌ కథానాయికలు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం నుంచి ఎన్టీఆర్‌, సమంతపై ఓ గీతాన్ని తెరకెక్కిస్తారు. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ గీతానికి శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ పాట కోసం కళా దర్శకుడు ప్రకాష్‌ ఆధ్వర్యంలో నాలుగు సెట్లు వేశారు. ‘‘డ్యాన్సుల విషయంలో ఎన్టీఆర్‌ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు. ప్రతి పాటలోనూ కొత్తదనం చూపిస్తారు. అయితే ఓ పాట మాత్రం మాస్‌ అభిమానుల్ని అలరించే విధంగా ఉంటుంది. ఈ పాట అదే. ఈ సినిమాలో ఈ పాట చాలా ప్రత్యేకం. దానికి తగ్గట్టు ఎన్టీఆర్‌ డ్యాన్సులు కూడా అదిరిపోతాయ’’ని చిత్రబృందం తెలిపింది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

నచ్చితే కొనేస్తా!

కథానాయికగా త్వరలో కాజల్ అగర్వాల్ పదేళ్లు పూర్తి చేసుకోనున్నారు. హీరోయిన్లు ఇన్నేళ్లు కొనసాగడం అంటే మాటలు కాదు. పైగా ఇంకా బిజీగా ఉండటం అంటే చిన్న విషయం కాదు. ఏంటా సీక్రెట్? అనే ప్రశ్న కాజల్ అగర్వాల్ ముందుంచితే - ‘‘సినిమా సినిమాకీ నటిగా ఇంప్రూవ్ అవుతుంటాను. కొత్త కొత్త పాత్రలు సెలక్ట్ చేసుకుంటుంటాను. అన్నింటికన్నా మించి సక్సెస్‌ని నెత్తికెక్కించుకోను. కష్టపడటానికి వెనకాడను’’ అన్నారు. ఒకవైపు సినిమాలు చేయడంతో పాటు మరోవైపు కొన్ని బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నారామె.
మరి... డ్రెస్సుల విషయంలో మీరు బ్రాండ్‌కి ప్రాధాన్యం ఇస్తారా? అని కాజల్‌ని అడిగితే - ‘‘బ్రాండ్ గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నట్లే.. నేను స్ట్రీట్ ఫుడ్ కూడా తింటుంటాను. బట్టలకు కూడా దీన్ని ఆపాదించొచ్చు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌తో పాటు చిన్న చిన్న షాఫుల్లో, స్ట్రీట్ సైడ్ కూడా కొంటాను. వాటిని బ్రాండెడ్ డ్రెస్సులతో మ్యాచ్ చేసి, వేసుకుంటా. ఏది కొన్నా నాకు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటా’’ అని చెప్పారు.

అప్పుడు ఇష్టం... ఇప్పుడు అయిష్టం!


రియల్ లైఫ్ లవర్స్ జంటగా నటిస్తే, రీల్‌పై వాళ్ల కెమిస్ట్రీ అదిరిపోతుంది. అందుకు ఓ ఉదాహరణ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్. ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నప్పుడు చేసిన ‘అజబ్ ప్రేమ్‌కీ గజబ్ కహానీ’లో రొమాంటిక్ సీన్స్‌లో జీవించారు. అప్పుడు ఇలాంటి సీన్స్‌లో ఇష్టంగా నటించిన ఈ జంట ఇప్పుడు మాత్రం అయిష్టంగా ఉన్నారట. విడిపోయాక ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘జగ్గా జాసూస్’. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అంగీకరించినప్పుడు రణబీర్, కత్రినా ప్రేమలోనే ఉన్నారు. షూటింగ్ కాస్త అయ్యాక విడిపోయారు.               దాంతో ఇప్పుడు రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి ఇష్టపడటంలేదట. మామూలుగా రిస్కీ ఫైట్ సీన్స్‌ని డూప్స్‌తో చేయిస్తారని అందరికీ తెలుసు. కానీ, ఈ చిత్రంలోని రొమాంటిక్ సీన్స్‌ని డూప్‌తో తీస్తున్నారట. రణబీర్, కత్రినా ఈ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడకపోవడంతో, చేసేదేం లేక ఈ విధంగా నకిలీలతో కానిచ్చేస్తున్నారట.                    ఒకవేళ నకిలీలు కనుక కెమిస్ట్రీ పండిస్తే.. అప్పుడు ప్రాబ్లమ్ లేదు. ఆ సంగతలా ఉంచితే.. దీపికా పదుకొనే నుంచి విడిపోయాక ఆమెతో కలిసి రణబీర్ నటించారు. మరి.. ఇప్పుడు కత్రినా విషయంలో ఈ చాక్లెట్ బోయ్ ఎందుకు అంత పట్టుబడుతున్నారో? అలాగే.. సినిమా కోసం కూడా రణబీర్‌తో రొమాన్స్ నటించడానికి కత్రినా ఎందుకు అంత ఇదవుతున్నారో?.. బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది.

Tuesday, June 7, 2016

'ఐపీఎల్ లో మళ్లీ చాన్స్ ఇవ్వండి'

 పాకిస్తాన్ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చోటు కల్పించాలని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ బీసీసీఐకి విజ్ఞప్తిచేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియంలో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి ఆయన రానున్నారు. బీసీసీఐ నూతన అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు పాక్ మాజీ కెప్టెన్ బెంగళూరుకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమ దేశ ఆటగాళ్లను లీగ్ లో ఆడనిస్తే ఐపీఎల్ కు మరింత జోష్ వస్తుందని అభిప్రాయపడ్డాడు.                        2007 తర్వాత పాక్, భారత్ మధ్య 2012-13 సీజన్లో మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు జరిగాయి. ఐపీఎల్ మొదటి సీజన్లో(2008లో) పాక్ క్రికెటర్లు భాగస్వాయులయ్యారని, అయితే ముంబై దాడుల తర్వాత తమ ఆటగాళ్లను లీగ్ నుంచి నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారత్ ఆహ్వానం మేరకు ఐపీఎల్ ఫైనల్ వీక్షించేందుకు వస్తున్నాను, ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగు పడేందుకు బీజం పడేలా చేస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచమంతా భారత్-పాక్ మ్యాచుల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుందని జహీర్ అబ్బాస్ పేర్కొన్నారు.

పోలీస్‌ స్టేషన్‌లో రామ్‌చరణ్‌

 పోలీసు కథలంటే మన కథానాయకులకు చాలా మక్కువ. అసలు సిసలైన హీరోయిజం చూపించే అవకాశం ఈ కథల్లోనే ఎక్కువ దొరుకుతుంది. మాస్‌కి త్వరగా దగ్గరైపోవొచ్చు. దానికి తోడు స్టైలిష్‌గానూ కనిపించొచ్చు. అందుకే రామ్‌చరణ్‌ మరోసారి ఖాకీ కట్టేశారు. పోలీసు స్టేషన్‌లో హంగామా మొదలెట్టారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రకుల్‌ప్రీత్‌సింగ్‌ కథానాయిక. అరవింద్‌ స్వామి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నవదీప్‌ కీలక పాత్రధారి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పోలీస్‌ స్టేషన్‌ సెట్‌లో రామ్‌చరణ్‌ పోలీస్‌ గెటప్‌ వేసి హంగామా చేస్తున్నాడు. ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్‌ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్‌ ఇది. ‘ధ్రువ’ అనే పేరు పరిశీలిస్తున్నారు. దసరా బరిలో ఈ సినిమాను దింపాలన్నది చిత్రబృందం ఆలోచన.

మేం కలిసి పనిచేయకపోవడమే మంచిది

 ‘పా’.. ‘డర్టీ పిక్చర్‌’.. ‘కహానీ’ వంటి చిత్రాలతో జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా నిరూపించుకుంది విద్యాబాలన్‌. ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌తో వివాహమైన తర్వాత కూడా వరుస సినిమాలతో కెరీర్‌ని గాడిన పెడుతోంది. ఇటీవల ‘తీన్‌’ చిత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న విద్యా.. తన మరిది కునాల్‌రాయ్‌ కపూర్‌ దర్శకత్వంలో చిన్న పాత్రైనా చేయాలని ఉంది అని చెప్పింది. కానీ.. తన భర్త నిర్మాణంలో మాత్రం నటించనంటోంది. వృత్తిని.. వ్యక్తిగత జీవితాన్ని కలపకుండా ఉంచడానికే మేం ప్రయత్నిస్తాం. అదే తమ వైవాహిక జీవితానికి చాలా మంచిదని చెబుతోంది విద్యాబాలన్‌.
‘‘మేం జంటగా కలిసి పనిచేస్తే చాలా బాగుంటుందని తెలుసు. కానీ వృత్తిని.. వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ కలపకూడదని నా అభిప్రాయం. ఆ విధంగా ఉండటానికి మేం ప్రయత్నిస్తాం. అదే మా వైవాహిక జీవితానికి మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా ఆడకపోవచ్చు. పైగా ఇప్పటివరకు వృత్తిపరంగా మేమిద్దరం చర్చించుకున్న సందర్భాలు చాలా తక్కువ. అందుకే కలిసి పనిచేయకపోవటమే మాకు మంచిది’’ అని చెప్పింది విద్యాబాలన్‌.

ఆమె కళ్లు చెమర్చాయి!


పాపం, పుణ్యం, ప్రపంచం... ఇవన్నీ తెలియక స్వచ్ఛమైన మనసుతో ఆనందంగా నవ్వుతూ, తుళ్లుతూ ఆడిపాడే ఆ పిల్లలను చూసి కాజల్ కళ్లు చెమర్చాయి. ఎందుకంటే ఈ అందమైన లోకాన్ని చూడలేని చిన్నారులు వాళ్లు. అందుకే ఓ మంచి నిర్ణయమే తీసుకున్నారు కాజల్. అసలు విషయంలోకి వెళితే...  హిందీ చిత్రం ‘దో లఫ్జోంకీ కహానీ’లో కాజల్ అగర్వాల్  అంధురాలిగా నటించిన విషయం తెలిసిందే.
               ఇప్పటివరకూ చాలా సినిమాల్లో అందాలతో కనువిందు చేసిన కాజల్ తొలిసారిగా ఓ అంధురాలి పాత్ర చేశారు. ఈ పాత్ర కోసం ఆమె చాలా హోం వర్క్ చేశారు. తన ఇంటి దగ్గర్లోని ఓ అంధుల పాఠశాలకు వెళ్లి వాళ్ల జీవన విధానం ఎలా ఉంటుంది..? ఎలా ప్రవరిస్తారు? అన్న విషయాలను గమనించారట. ఆ తర్వాత షూటింగ్‌కు వెళ్లారు... డెరైక్టర్ యాక్షన్ అని చెప్పగానే కాజల్ కంగారు పడిపోయారట. మరి.. మామూలుగా నటించకూడదు... కళ్లు లేని వాళ్లలా కనిపించాలి కదా.
             అందుకే టేక్‌ల మీద టేక్‌లు తీసుకున్నారు. దాంతో చిన్న పనులు చేయాలన్నా కళ్లు కనిపించని వాళ్లకెంత కష్టమో కాజల్‌కి అర్థమైంది. అందుకే తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. చనిపోయాక  మట్టిలో కలిసిపోయే కళ్లను దానం చేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించిన రణదీప్ హుడా కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం విశేషం.

Monday, June 6, 2016

నేటినుండి రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం


నేటినుండి ఉపవాస దీక్షలు ప్రారంభం
               రంజాన్‌కా చాంద్‌ నజర్‌ ఆగయా అంటూ ముస్లింసోదరులు ఒకరికొకరు ముబారక్‌ (శుభాకాం క్షలు) తెలుపుకున్నారు. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం ఉపవాస దీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆధ్యాత్మిక, సోదరభావాన్ని పరిమ ళింపజేసే పవిత్రమాసంగా రంజాన్‌ను భావిస్తారు. ముస్లింల దైవం అల్లా తన దివ్య సందేశాన్ని మానవాళికి అందించిన దైవ సందే శాన్ని దూత అందరికీ చేరవేసిన మాసంగా భావిస్తారు. ప్రవక్త హజ్రత్‌ మహ్మద్‌ (సల్లలాహు వాలిహి వసల్లం) ద్వారా దివ్య ఖురాన్‌ దివినుండి భువికి దిగివచ్చిన పవిత్ర మాసంగా రంజాన్‌ మాసాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో గడుపుతారు. ఈ మాసంలో ముస్లింలు నిష్టతో కూడిన ఉపవాస దీక్షలు పాటిస్తారు, ఉర్దూ క్యాలండర్‌ ప్రకారం సంవత్సరంలోని 9వ మాసంలో రంజాన్‌ నెల వస్తుంది. మొత్తం 29 రోజులపాటు ఉపవాస దీక్షలు చేపడ తారు. ఈ దీక్షలను తెల్లవారు జామున సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నియమ నిష్టలతో పూర్తిచేస్తారు. దీక్షాసమయంలో సత్యసం భాషణ, నైతిక ధర్మాచారాలతో దైవవిశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఉపవాసంచేసేవారు సాయంత్రం దీక్ష విరమించే వరకూ నీటినికూడా తాగరు. కనీసం లాలా జలాన్ని కూడా గొంతుదాటి లోనికి వెళ్ల కుండా జాగ్రత్త పడతారు. తెల్లవారు జామున లేచి అల్పాహారం తీసుకుని దీక్షను ప్రారంభి స్తారు. దీనిని సహార్‌ అంటారు. సూర్యో దయానికి ఫజర్‌ నమాజ్‌, మధ్యాహ్నం జోహర్‌ నమాజ్‌, సాయంత్రం 4నుండి 5వరకు అసర్‌ నమాజ్‌ చేస్తారు. సాయంత్రం 6గంటలకు ప్రార్థనా మందిరాలు (మజీద్‌)కు చేరుకుని ఉపవాస దీక్షలను విడుస్తారు. తమవెంట తెచ్చుకున్న పండ్లతో దీక్షను విరమించి మగ్రీభ్‌ నమాజ్‌ చేస్తారు. అనంతరం భోజనా లు ముగించుకుని ఇషా నమాజ్‌ తర్వా త తరావీ నమాజ్‌కు సిద్ధమవుతారు.
సోదరభావాన్ని పెంపొందించే ఇఫ్తార్‌ ..

              రంజాన్‌ ఉపవాస దీక్షల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6నుండి 6.30లోపు దీక్షలు విరమించే సమయాన్ని ఇఫ్తార్‌ అంటారు. చిన్నాపెద్ద, ధనికపేద తేడా లేకుండా ఒకేచోట వరుసగా మస్‌జిద్‌ కూర్చుని సామూహిక ఇఫ్తార్‌ చేస్తారు. ఈ సమయాల్లో మస్‌జిద్‌లు కొత్త కాంతులు సంతరిం చుకుంటాయి. ముస్లింలతోపాటు హిందువులు, క్రైస్తవులు ఇఫ్తార్‌ విందులో పాల్గొని మతసామరస్యా న్ని చాటుతారు. నెలరోజులపాటు ఇఫ్తార్‌ విందులు కొనసాగుతాయి.
దైవభక్తిని పెంపొందించే తరావి నమాజ్‌ ..           రంజాన్‌ మాసంలో ప్రత్యేకంగా చేసే తరావీ నమాజ్‌ దైవభక్తిని పెంపొందిస్తుంది. ఈనెలలో 29 రోజులపాటు ప్రతిరోజూ చేసే ఐదు పూటల నమాజ్‌తోపాటు తరవీ నమాజ్‌ను అదనంగా చేస్తారు. సుమారు గంటన్నరనుండి రెండున్నర గంటలపాటు ఏకధాటిగా ఈనమాజ్‌ కొనసాగుతుంది. నమాజ్‌లో దివ్య ఖురాన్‌కు చెందిన 30 అధ్యాయాల్లోని పవిత్ర శ్లోకాలను ఒకటినుండి రెండున్నర పేరాల వరకూ హఫీజ్‌ ఏ ఖురాన్‌ (ఖురాన్‌ చూడకుండా చదివేవ్యక్తి) ప్రతిరోజూ కొన్నింటిని చదువుతారు. ఇక ఇషా నమాజ్‌ తర్వాత తరాబీ నమాజ్‌ చేస్తారు. రంజాన్‌ ప్రారంభానికి ఒకరోజుముందు మొదలయ్యే ఈ నమాజ్‌ 29రోజుల దీక్షల అనంతరం ఈదుల్‌ ఫితర్‌ పండగ పర్వదినానికి ఒకరోజు ముందు ముగుస్తుంది. పండగరోజు ఊరిచివరన ఉండే ఈద్గాలవద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

ఫిత్రా ..            రంజాన్‌ మాసంలో ముస్లింసోదరులు తన ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా తన సంపాదనలో కొంతమేరకు దానం చేయాల్సి ఉంటుంది. దీనినే ఫిత్రాగా పిలుస్తారు. కుటుంబ సభ్యుల లెక్కన నాణ్యమైన గోధుమలు, జొన్నలు కిలో విలువ లెక్కగట్టి ఆలెక్కప్రకారం ఒక మనిషికి ఒక కిలో విలువకట్టి డబ్బులు పేదలకు పంచిపెట్టడమే ఈ ఫిత్రా ఆనవాయితీ.
దురలవాట్లకు దూరంగా ..               సిగరెట్‌, బీడీ, మద్యపానం, గుట్కాలతో పాటు ఇతరాత్ర అలవాట్లు సాధారణమైనా రంజాన్‌లో ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఈ పవిత్ర మాసంలో ముస్లిం లంతా విధిగా రోజా పాటించి అల్లా నిర్ధేశించిన అన్నిరకాల నమాజ్‌ను ఆచరిం చాలని ఖురాన్‌ ఆదేశిస్తుంది. అనారోగ్యం, దూర ప్రయాణాలు, ఇరత కారణాలతో కొందరికి మినహాయిం పు ఉంటుంది. అధికశాతం ముస్లింలు రంజాన్‌లో ఉపవాస దీక్షలను పాటిస్తారు. దురవాట్లకు బానిసైన చాలా మందిసైత ం నెలరోజులు మాత్రం ఉపవాసం ఉంటారు. ఉపాదీక్షలు లేనివారుసైతం తరా వి నమాజులకు వెళ్తుంటారు.

పండ్లకు ప్రాధాన్యం ..
           రంజాన్‌ ఉపవాస దీక్షలో ఉన్నవారు తెల్లవారు జాము నుండి సూర్యాస్తమయం వరకు ఎలాంటి ఆహారంగాని మంచినీళ్లుగాని తీసుకోరు. అయితే దీక్ష విరమణకు పండ్లను ఆరగిస్తారు. ముఖ్యంగా ఖర్జూర పల్లకు మతపరంగా ప్రాధాన్యముంది. మహ్మద్‌ ప్రవక్త ఉపవాస దీక్షను ఖర్జూర పళ్లుతిని విరమించారని ప్రతీతి. అందువల్ల ముస్లింలు రోజావిరమణ సమయంలో ఖర్జూర పళ్లను తినడం పవిత్ర కార్యంగా భావిస్తారు. ఇఫ్తార్‌లో జామ, సేపులు, ద్రాక్ష, పుచ్చకాయలు, అనాస, బొప్పాయి, సంత్రా, మోసంబి, అరటిపండ్లు తీసుకుంటారు. హలీం, హరీష్‌, దైవడ, ఇతర తి బండారాలకోసం ప్రత్యేకంగా హోటళ్లు వెలుస్తాయి.
29రోజులు.. 3 భాగాలు ..
               రంజాన్‌ నెలను మూడు భాగాలుగా భావిస్తారు. ఇందులో తొలి 10రోజులు ఉపవాస దీక్షలుండటాన్ని రహమత్‌ (దయను పొందుట), రెండో పదిరోజలు ఉపవాసముంటే మగ్‌ఫిరత్‌ (క్షమకోరడం), మూడోది పదిరోజులు ఉపవాసాలను జాహ్నంసే నజ్జత్‌ (నరకం నుంచి విముక్తి) అని పిలుస్తారు. చివరి 10రోజుల్లో వచ్చే బేసి సంఖ్యలైన 21, 23, 25, 27, 29 రోజుల్లో ఉపవాస రాత్రుల్లో ఖురాన్‌ను అల్లా భూమిమీదకు పంపినట్లు విశ్వసిస్తారు. ఆ రాత్రిని గుర్తించి జాగరణచేస్తే దేవుడు పాపాలను తొలగించి కోర్కెలు తీరుస్తారని విశ్వాసం. ఈ రాత్రులను తఖ్రత్‌ అని పిలుస్తారు.
షబ్‌-ఎ-ఖదర్‌ ..
              రంజాన్‌ మాసంలో 26వరోజున షబ్‌-ఎ-ఖదర్‌ జరుపుకుంటారు. ఆ రోజున 30 ఫారాల ఖురాన్‌ను పఠిస్తారు. ఖురాన్‌ పఠనం ఈరోజు ముగుస్తుంది. అదేరోజు రాత్రి మజీదులతోపాటూ తమ గృహాల్లో జగ్‌నేకిరాత్‌ (జాగరణ) పాటిస్తారు. ఈ సందర్భంగా కొత్త బట్టలు ధరించి జాగరణలో పాల్గొని అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం నెల రోజులపాటు ఖురాన్‌ను చదివి వినిపించిన హఫీజ్‌-ఎ-ఖురాన్‌(మౌల్విసాబ్‌)ను మస్‌జిద్‌ కమిటీల ఆధ్వర్యంలో సన్మానించి తమవంతు సహకారం అందజేస్తారు.

పేదల హక్కు జకాత్‌ ..
            ఇస్లాం నిర్ధేశించిన ఐదు సూత్రాల్లో జకాత్‌ ఒకటి. దీనినే దాన ధర్మాలకు ప్రతీకగా చెబుతారు. తమవద్ద ఉన్న ఆస్తిపాస్తులో కొంతైనా నిరుపేదలకు పంచివ్వాలన్నదే జాకత్‌ సారాంశం.
ఎతెకాఫ్‌ వ్రతం ..
              రంజాన్‌ మాసంలో 21వ రోజు రాత్రినుండి పండగ ముందురోజు వరకు ఉపవాస దీక్షాపరులు ఎతెకాఫ్‌ వ్రతాన్ని చేస్తారు. ఈ సందర్భంగా వారు బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరిచి మస్‌జిద్‌లలో దైవ ప్రార్థనల్లో నిమగమవుతారు. నెలవంక కనిపిస్తే వ్రతాన్ని విరమిస్తారు. పండగరోజు నమాజ్‌ అనంతరం తమతమ ఇళ్లకు చేరుకుని షీర్‌ఖుర్మా సేవిస్తారు. ప్రధాన పట్టణాలు, మండలాల్లో ఉపవాస దీక్షల అనంతరం హలీం, హరీస్‌్‌, దైవడ, కద్దుకీఖీర్‌, డబుల్‌కామీఠా, ఖుర్బానీకామీఠా తదితర వంటకాలను భుజిస్తారు.
షబ్‌-ఎ-ఖదర్‌ 26ట రోజున షబ్‌-ఎ-ఖాదర్‌ జరుపుకుంటారు. ఆరోజున 30పారాల ఖురాన్‌ను చదువుతారు. ఖురాన్‌ పఠనం ఈ రోజుతో ముగుస్తుంది. అదేరోజు రాత్రి మస్‌జిద్‌లతో పాటు తమ గృహాల్లో జగ్‌నేకిరాత్‌ (జాగరణ) చేస్తారు. ఈ సందర్భంగా కొత్తబట్టలు ధరించి జాగరణలో పాల్గొని అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

రోజులు మారాయి..

 వరుస హిట్లతో దూసుకెళుతున్న దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ‘రోజులు మారాయి’. చేతన్ మద్దినేని, పార్వతీశమ్, కృతిక, తేజస్వి ప్రధాన పాత్రల్లో మురళీ కృష్ణ ముడిదానిని దర్శకునిగా పరిచయం చేస్తూ జి.శ్రీనివాసరావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. జేబీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ‘దిల్’రాజు మాట్లాడుతూ- ‘‘మారుతి కథలు ప్రధానంగా యువతను ఆకట్టుకుంటాయి. కానీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్నివర్గాల వారిని ఆకట్టుకుంటుంది.
ఇప్పటికే ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా బిజినెస్ ట్రేడ్‌లో సూపర్ క్రేజ్ రావడం విశేషం. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలై 7న సినిమా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. అలీ, పోసాని కృష్ణమురళి, రాజారవీంద్ర, హర్ష, సంధ్యా జనక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సారధ్యం: గుడ్ సినిమా గ్రూప్, సహ నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

Saturday, June 4, 2016

కావాలనే మాజీ లవర్‌తో ఫొటో దిగలేదు!

 'ఉడ్తా పంజాబ్‌' సినిమాతో మళ్లీ వెండితెర మీద కనిపించబోతున్నారు షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌. చాలాకాలం కిందటే విడిపోయిన ఈ మాజీ ప్రేమజంట.. గతంలో ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా విలేకరులు ఎంత కోరినా.. కలిసి ఫొటో దిగేందుకు ఒప్పుకోలేదు. ఇందుకు కారణం ఏమిటంటే.. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ వెల్లడించాడు. కావాలనే తామిద్దరం కలిసి ఫొటో దిగలేదని, ఒకవేళ ఫొటో దిగితే అప్పట్లో మీడియా మొత్తం దీనిపైనే మాట్లాడేదని, అందుకే మేం కలిసి ఫొటో దిగకూడదని తాను భావించానని షాహిద్ చెప్పాడు.
ఎన్నో ఏళ్ల గ్యాప్‌ తర్వాత షాహిద్‌, కరీనా..  అభిషేక్ చుబే తెరకెక్కించిన 'ఉడ్తా పంజాబ్‌'లో నటించారు.  నిజానికి ఒకే సినిమాలో నటిస్తున్నారనే మాటే కానీ.. ఈ ఇద్దరు కలిసి కనిపించే సీన్‌ ఒక్కటి కూడా ఈ చిత్రంలో లేదట. అంతేకాకుండా మీ ఇద్దరు భవిష్యత్తులో కలిసి నటించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు వీరు సమాధానం దాటేశారు. సహ నటులు ఆలియా భట్‌, డైరెక్టర్‌ అభిషేక్‌ చుబే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఈ ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమంలో షాహిద్, కరీన చాలా ఇబ్బందిగా కనిపించారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై స్పందిస్తూ 'మేం ఇబ్బందిగా ఫీలైనట్టు మీరు ఎలా నిర్ణయిస్తారు? మేం అలా కనిపించామా? అలా ఎలా రాస్తారు?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

బాహుబలితో బ్రిటిష్ బ్యూటీ

 బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్, బాహుబలి 2 సెట్స్ మీద ఉండగానే తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు, ఇప్పటికే ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలం అవుతోంది. అందుకే బాహుబలి పూర్తవ్వగానే గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. చాలాకాలం క్రితమే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సినిమా ఉంటుందంటూ ప్రకటించాడు ప్రభాస్.

యువి క్రియేషన్స్ బ్యానర్.., ప్రభాస్, సుజిత్ ల సినిమాను భారీగా నిర్మించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే జాతీయస్థాయిలో ప్రభాస్ కు  ఫాలోయింగ్ రావటంతో ఈ సినిమాను కూడా మూడు భాషల్లో భారీగా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా గుర్తింపు ఉన్న అమీజాక్సన్ ను ఈ సినిమాను హీరోయిన్ గా ఫైనల్ చేశారట. తొలిగా ఈ బ్రిటిష్ బ్యూటీ ప్రభాస్ పక్కన నటించటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్.

Wednesday, June 1, 2016

పండుగొచ్చింది..

 
అంతటా పండుగ వాతావరణం, విద్యుత్ కాంతుల్లో నగరం, స్పెషల్ అట్రాక్షన్‌గా, అతిపెద్ద జెండా ఆవిష్కరణ, ఆవిర్భావ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబు
కోట్ల కళ్లు ఎదురుచూస్తున్న పండుగ..అరవై ఏండ్ల కొట్లాట..వేయి మంది అమరుల బలిదాన ఫలితమైన రాష్ర్టావతరణ ఉత్సవం వచ్చేసింది. ఈ సంబురాలను అంబరాన్నంటేలా చేసుకునేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. నభూతో..నభవిష్యత్ అనే రీతిలో సిటీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు ప్రధాన కూడళ్లు విద్యుత్ కాంతులు, త్రీడీ లైటింగ్‌తో ధగధగలాడుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివళ్లు, జెండావిష్కరణలతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించడానికి నగరం సిద్ధమైంది.

తెలంగాణ జాతికి పెద్ద పండుగొచ్చింది. రాష్ట్రం రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడోఏట అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లతో పాటు ట్యాంక్‌బండ్, పర్యాటక ప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అసెంబ్లీ, సచివాలయం, నెక్లెస్‌రోడ్, హుస్సేన్‌సాగర్ తీరం, ైఫ్లె ఓవర్లు విద్యుత్ వెలుగులతో జిగేల్‌మంటున్నాయి. అమరవీరుల స్తూపాలను పూలతో అలంకరించారు. ప్రధానంగా నగర వీధుల్లో ఎక్కడచూసినా దసరా, దీపావళి లెక్కన ఉత్సాహం కనిపిస్తున్నది. 
 
నగరం..సప్తవర్ణశోభితం..
పురివిప్పిన నెమళ్లు, కనువిందు చేసే పూలు ఇంకా అనేక రకాల అలంకారాలతో నగర కూడళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబైన నగరం సప్తవర్ణ శోభతో అలరారుతోంది. మరోపక్క పరేడ్ మైదానంలో వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. వేడుకలకు స్వాగతం పలుకుతూ హెచ్‌ఎండీఏ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. సంజీవయ్య పార్కులో ఎత్తైన జాతీయ పతాకం ఎగురవేయడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. దసరా, దీపావళి కలిసి వచ్చినట్టు నగరమంతా పండుగశోభను సంతరించుకుంది. 











 

ముచ్చటగా మూడో నెల?

 ‘‘నేను ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు? రెండేళ్ల వరకూ పిల్లలు వద్దనుకున్నాం. అసలు ఎక్కణ్ణుంచి ఇలాంటి వార్తలు పుట్టుకొస్తాయో అర్థం కావడంలేదు’’ అని కరీనా కపూర్ ఆ మధ్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. దాంతో ఇప్పట్లో కరీనా, సైఫ్ అలీఖాన్ తల్లిదండ్రులయ్యే అవకాశం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో తాజాగా ఓ వార్త ప్రచారంలోకొచ్చింది. కరీనా ప్రెగ్నెంట్ అన్నది ఆ వార్త సారాంశం.

ఆమెకు మూడో నెల అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే కరీనా, సైఫ్ లండన్ వెళ్లారు. హాలిడేస్‌ని ఎంజాయ్ చేసి, మంగళవారం ఇండియా వచ్చారు. కరీనా ప్రెగ్నెంట్ అనే వార్త బుధవారం గుప్పుమంది. బాలీవుడ్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్. దీనికి ఈ భార్యభర్తల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మౌనం అర్ధాంగీకారం అంటారు. సో.. కరీనా నిజంగానే తల్లి కాబోతున్నారా? లేక గతంలో ప్రచారం అయినట్లుగా ఇది కూడా వదంతిగా మిగిలిపోతుందా? వేచి చూడాల్సిందే.
 

ఈ మెగా సెల్ఫీ చాలా అరుదు గురూ

 ఒక సాధారణ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటేనే ఒక వార్తగా నిలుస్తుంది. అలాంటిది ఓ ఐదుగురు ప్రముఖులు ఓ చోట చేరి సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ పట్టరాని సంతోషంతో.. ఇంకా ఆసక్తిగా చెప్పాలంటే ఒకే రకమైన వస్త్రాలు వేసుకొని.. ఎవరి మొఖంలో నవ్వుచూసినా అదే పరిమాణంలో ఉండి.. ఈ అరుదైన సెల్ఫీ తిరుపతిలో ఆవిష్కృతమైంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ చెరిగిపోని చరిత్రను లిఖించుకున్న ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి, నట సామ్రాట్ అక్కినేని నాగార్జున, గీతా ఆర్ట్స్ సారధి అల్లు అరవింద్.. వీళ్లందరికీ ఒక్కసారిగా అదనపు రంగు అద్దినట్లుగా మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, వ్యాపార ప్రముఖుడు నిమ్మగడ్డ ప్రసాద్ కలిసి ఈ స్వీయ చిత్రాన్ని తీసుకున్నారు. బయటకు వచ్చిన ఈ ఫొటోను చూసిన వారంతా కూడా వావ్ వాట్ ఏ సెల్ఫీ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.