Thursday, March 31, 2016

పవన్ vs మహేష్

 టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ కి పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ వేసవిలో తమ సినిమాలతో రిలీజ్ కు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఇద్దరి సినిమాల మధ్య చాలా గ్యాప్ ఉన్నా, రికార్డ్ ల విషయంలో మాత్రం భారీగా పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ కాగా, ఏప్రిల్ 8న ఈ సినిమాను  తెలుగు, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ చేయాడానికి రెడీ అవుతున్నారు.

ఇక మహేష్ హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం ఆడియోను ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేసి మే లో సినిమా విడుదల కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బిజినెస్ విషయంలో ఈ రెండు సినిమాల మధ్య పోటీ పక్కాగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫారిన్ మార్కెట్ లో గట్టి పట్టున్న మహేష్, ఓవర్సిస్ రైట్స్ విషయంలో పై చేయి సాధించాడు.

బ్రహ్మోత్సవం ఓవర్సీస్ రైట్స్ 13 కోట్లకు అమ్ముడవ్వగా, సర్థార్ గబ్బర్ సింగ్ 11.5 కోట్లతో సరిపెట్టుకున్నాడు. కానీ శాటిలైట్ రైట్స్ విషయంలో మాత్రం పవన్ ముందున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ శాటిలైట్ రైట్స్ 13 కోట్లకు అమ్ముడవ్వగా, బ్రహ్మోత్సవం రైట్స్ 11.5 కోట్లతో సరిపెట్టుకుంది. బిజినెస్ లోనే ఇంతగా పోటి పడుతున్న ఈ ఇద్దరు స్టార్స్, రిలీజ్ తరువాత కలెక్షన్ల విషయంలో ఎలాంటి రికార్డ్స్ నమోదు చూస్తారో చూడాలి.

ఆయన నటనకు పడిపోయా!

  విజయ్ నటనకు ఫ్లాటైపోయానంటోంది ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్. ఈ భామ ఇప్పుడు రెండు భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం 2.ఓ కాగా మరొకటి ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేస్తున్న తెరి చిత్రం. 2.ఓ చిత్రం గురించి చెప్పుకోవడానికి ఇంకా చాలా రోజులు ఉన్నాయి. కాబట్టి తమిళ ఉగాదికి విడదలకు ముస్తాబవుతున్న తెరి గురించి మాట్లాడుకుందాం అంటోంది నటి ఎమీజాక్సన్. 
 
 ఈ చిత్రంలో విజయ్‌కి జంటగా సమంత, ఎమీజాక్సన్ నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చెన్నై చిన్నది సమంతదే ప్రధాన పాత్ర అట. విజయ్‌కు భార్యగా నటిస్తున్న సమంతకు కూతురుగా నటి మీనా కూతురు నటిస్తోంది.ఇది తల్లీ కూతుర్లు అనుబంధం ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం అని,చిత్ర కథ వీరి చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ఎమీ ఇందులో టీచర్‌గా కనిపించనున్నారట. 
 
 దీని గురించి ఎమీ తెలుపుతూ తాను నటుడు విజయ్ వీరాభిమానిని ఆయన నటన, డాన్స్ చూసి ఎప్పుడో ఫ్లాటైపోయానని చెప్పింది. ఆయనతో నటించే అవకాశం వస్తే చాలని కోరుకున్నానని, అందుకే తెరి చిత్రంలో రెండో కథానాయకి పాత్ర అయినా నటించడానికి అంగీకరించానని అంది. ఇందులో తాను టీచర్‌గా నటించానని తన పాత్రకు మంచి పేరు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

Wednesday, March 30, 2016

అయ్యోపాపం! వాళ్లూ విడిపోతున్నారంట!


పదకొండు సంవత్సరాల వైవాహిక జీవితం.. అరడజనుకుపైగా పిల్లలు. హాలీవుడ్‌లోనే అత్యంత బలమైన అనుబంధమున్న జంటగా భావించిన బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ వైవాహిక బంధానికి బీటలు వారినట్టు కనిపిస్తోంది. ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోనుందన్న వార్తలు ప్రస్తుతం విదేశీ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి.
గతకొన్ని నెలలుగా పిట్‌-జోలీ అనుబంధంలో లుకలుకలు మొదలయ్యాయని, తాజాగా బ్రాడ్ పిట్‌ ఒక్కడే తమ పిల్లలు పాక్స్, జాహరా, మడొక్స్, షిల్హా, నాక్స్‌, వివియెన్నెలతో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించడం.. వీరి బంధం విడిపోవడానికి చేరినట్టు సూచిస్తోందని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పత్రిక పేర్కొంది. జోలీ తన డైరీలో రాసుకున్న వ్యక్తిగత నిజాలను పిట్ చదువడం వల్లే వీరి మధ్య విభేదాలు మొదలైనట్లు ఆ పత్రిక పేర్కొంది. ఆమె గత జీవితానికి సంబంధించిన సమస్యలు మళ్లీ వెలుగుచూడటంతో, ఆమె చిత్రంగా ప్రవర్తిస్తుండటంతో బ్రాడ్ పిట్‌ జోలీకి దూరమవుతున్నట్టు ద నేషనల్ ఎంక్వైరెర్ పత్రిక పేర్కొంది.

పిట్‌తో అనుబంధం నానాటికీ సన్నగిల్లుతుండటంతో ఆమె బేలగా, నీరసంగా మారిపోయిందని, ఇటీవల లండన్‌లో తన పిల్లలతో బయటకొచ్చిన జోలీ 'ఎముకల గూడు'లా కనిపించడంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్నదని 'టచ్ మ్యాగజీన్' తెలిపింది. పిట్‌తో గొడవలు, వ్యవహారం విడాకుల దాకా వెళుతుండటంతో జోలీ చాలా నీరసంగా మారిపోయి మరింత బరువు తగ్గిపోయిందని, తీవ్ర ఒత్తిడిలో భావోద్వేగానికి లోనవుతున్న ఆమె శారీరకంగా, మానసికంగా బ్రేక్‌డౌన్ అయ్యేలా కనిపిస్తున్నదని ఆ మ్యాగజీన్ పేర్కొంది. ఈ పరిస్థితిలో జోలీకి సహాయపడటం కానీ, తమ వైవాహిక బంధాన్ని నిలుపుకోవడానికిగానీ బ్రాడ్ పిట్ ప్రయత్నించడం లేదని చెప్పింది. అయితే ఇన్ని కథనాలు వెలువడుతున్నా ఈ దంపతులు మాత్రం ఇప్పటివరకు పెదవి విప్పలేదు.

సెమీస్‌లో యువరాజ్ ఔట్.. మనీశ్ పాండే ఇన్

 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో విండీస్‌తో తలపడే మ్యాచ్‌కు యువరాజ్‌సింగ్‌ దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు, వికెట్ల మధ్య పరుగు తీసేందుకు యువీ చాలా ఇబ్బంది పడ్డాడు. గాయం నయం కాకపోవడంతో విండీస్‌తో ఆడే తుది జట్టు నుంచి యువీ తప్పుకున్నాడు. యువరాజ్‌ స్థానంలో మనీష్‌ పాండేకు అవకాశం కల్పించారు.

Tuesday, March 29, 2016

ఆ హీరోయిన్ పెళ్లైపోయింది

  హీరోయిన్ అంకిత సోమవారం పెళ్లి చేసుకుంది. పుణేకు చెందిన వ్యాపారవేత్త విశాల్ జగ్తాప్ ను ఆమె వివాహమాడింది. ముంబై వర్లీ ప్రాంతంలో ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
రస్నాబేబీగా పాపులర్ అయి ఆ తరువాత బాలతారగా పలు చిత్రాలలో నటించింది. 'లాహిరి లాహిరి లాహిరి' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. తెలుగు తమిళ, కన్నడ భాషాల్లో 20 పైగా చిత్రాల్లో నటించింది. సింహాద్రి, విజయేంద్రవర్మ, అందురూ దొంగలే దొరికితే, మనసు మాట వినదు, ఖతర్నాక్, సీతారాములు, నవ వసంతం, అనసూయ, వినాయకుడు, అర్జునుడు, పోలీస్ అధికారి తదితర తెలుగు సినిమాల్లో కనిపించింది.

కొంత కాలం క్రితం నటనకు దూరం అయిన అంకిత న్యూయార్క్ వెళ్లి అక్కడ సినిమాకు సంబంధించిన కోర్స్ చేసింది. ఆ సమయంలో పరిచయం అయిన వ్యాపారవేత్త విశాల్‌తో అంకిత లవ్ లో పడింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి పెళ్లి చేయడంతో ప్రేమకథ సుఖాంతం అయింది.

కొత్త లుక్‌తో... దిల్ ఖుష్!

 ఎర్రటి పంజాబీ డ్రెస్‌లో, చందమామ లాంటి మోముతో తళతళలాడుతున్న అందాల తార ఐశ్వర్యారాయ్ ‘సరబ్‌జిత్’ సిన్మా లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఐష్‌ది మెయిన్ రోల్ కాకపోయినా ఆమే ఈ చిత్రానికి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అని వేరే చెప్పాల్సిన పని లేదు.

 అందుకే చిత్ర బృందం ఐష్ స్టిల్స్‌ను ఎక్కువగా విడుదల చే సి, సినిమాకు మరింత ప్రచారం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. భారత గూఢచారి అనే అభియోగంతో జీవితాంతం జైల్లోనే మగ్గిపోయిన ‘సరబ్‌జిత్’ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. తమ్ముడికి జరిగిన అన్యాయం గురించి పోరాడిన సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో ఐష్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

 అందుకు తగ్గట్టే సహజత్వానికి దగ్గరగా లుక్స్ విషయంతో చిత్ర దర్శకుడు ఒమంగ్ కుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరబ్‌జిత్‌గా రణదీప్‌హుడా, ఆయన భార్యగా రిచా చద్దా కనిపించనున్నారు. ఆ మధ్య ‘జజ్బా’ చిత్రం అనుకున్న ఫలితమివ్వకపోవడంతో, ఈ సినిమాతోనైనా హిట్ సాధించాలని ఐశ్వర్య శ్రమిస్తున్నారు.

మరో ఇద్దరు స్టార్‌ వారసుల ఎంట్రీ!


బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జోహర్‌ తీసిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌' సినిమా ఇండస్ట్రికి ఏకంగా ముగ్గురు వారసులను అందించింది. ఈ సినిమా ద్వారా అలియా భట్‌, వరుణ్ ధావన్‌, సిద్ధార్థ మల్హోత్రా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా స్టార్లుగా తమను తాము ఫ్రూవ్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్ రాబోతున్నది. ప్రస్తుతం ఇండస్ట్రిలో వినిపిస్తున్న మాట నిజమైతే.. ఈ స్వీకెల్ ద్వారా సైఫ్‌ అలీఖాన్‌, ఆయన మొదటి భార్య అమృతా సింగ్ కూతురు సరా అలీఖాన్‌, షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్‌ హీరోహీరోయిన్‌లుగా ఇండస్ట్రికి పరిచయం కాబోతున్నారు.










అంతేకాదండోయ్‌.. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాహ్నావి కపూర్‌ను కూడా తీసుకోవాలనే ఆలోచన ఉందట. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్టులతో హల్‌చల్ చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో తన కెరీర్‌ మొదలు పెట్టాలని భావిస్తోందట. అయితే  'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్ లో సైఫ్ కూతురు సరా, ఇషాన్‌ను ఇప్పటికే తీసుకున్నట్టు వార్తలు వినిస్తున్నాయి. మరోవైపు కరణ్ జోహర్ మాత్రం ఈ సినిమా నటినటులపై ఎక్కడా నోరువిప్పడం లేదు. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని ఇటీవల కరణ్ అధికారికంగా ప్రకటించాడు. దీంతో స్టార్ వారసులు చాలామంది తమను లాంచింగ్ చేయమని కరణ్‌ను కోరుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. ఇక షాహిద్ కపూర్ మాజీ ప్రియురాలైన కరీనా సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లాడింది. తాజాగా కరీనా, షాహిద్ 'ఉడ్తా పంజాబ్' సినిమాలో కలిసి నటిస్తున్నారు.

Monday, March 28, 2016

అమితాబ్‌ × ఫ్లింటాఫ్‌

 ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌పై భారత్‌లోని రెండు మతాల వాళ్లు ఒకేసారి విరుచుకుపడ్డారు. అదేనండి క్రికెట్‌, సినిమా మతాలకు చెందిన వాళ్లు. ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగిన విరాట్‌ కోహ్లీని పొగుడుతూనే.. ‘‘విరాట్‌ ఇలాంటి ఆటతీరునే కొనసాగిస్తే ఏదో ఒక రోజు ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రూట్‌ అంతటివాడవుతాడు’’ అంటూ ట్వీట్‌ చేసి ఓ చురక అంటించాలని ప్రయత్నించాడు ఫ్లింటాఫ్‌. దీనికి విరాట్‌ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తుండగానే.. ఏకంగా అమితాబ్‌ బచ్చన్‌ రంగంలోకి దిగాడు. ‘‘రూట్‌ (వేరు) ఏంటీ రూట్‌? రూట్‌ను కుదుళ్లతో సహా పీకేస్తాం’’ అంటూ రివర్స్‌ పంచ్‌ ఇచ్చాడు. ఈసారి బిగ్‌ బీనే ఆటపట్టిద్దామని ‘‘ఇంతకీ మీరెవరూ?’’ అనేశాడు ఫ్లింటాఫ్‌. ఇక అభిమానులు వూరుకుంటారా! యువీ ఆరు సిక్సర్లు, లార్డ్స్‌లో గంగూలీ చొక్కా విప్పడం లాంటి అనుభవాలు గుర్తు చేసి మరీ ఫ్లింటాఫ్‌ను వాయించేశారు. ‘‘బంధుత్వంలో ఆయన మీ బాప్‌ (తండ్రి) లాంటి వారు. పేరు షెహన్‌షా’’ అంటూ ఓ అభిమాని.. ‘‘వెళ్లి మేడమ్‌ టుసాడ్స్‌ మ్యూజియం చూడు. ఇంగ్లాండ్‌లో నీకన్నా ఆయనే ప్రముఖుడు’’ అంటూ మరో ఔత్సాహికుడు ఫ్లింటాఫ్‌కు బిగ్‌-బిని పరిచయం చేశాడు.

ఐసీసీ ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌ గ్రూప్‌ జట్లు వివరాలు ...





Sunday, March 27, 2016

ఆ హీరో 16 సినిమాలు కాదన్నాడా..?

 భలే భలే మగాడివోయ్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన నాని, ప్రస్తుతం సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటున్నాడు. స్టార్ డైరెక్టర్ల నుంచి కొత్త దర్శకుల వరకు అందరూ నానితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నా.. అతడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మంచి విజయం సాధించినా, ఆ సినిమా బ్లాక్ బస్లర్స్ లిస్ట్ లో చేరకపోవటంతో నెక్ట్స్ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.            ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు నాని. ఆ తరువాత ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మతో ఓ సినిమా చేస్తాన్న టాక్ వినిపిస్తున్నా, అఫీషియల్ గా మాత్రం ఎనౌన్స చేయలేదు. దీంతో తరువాత నాని చేయబోయే సినిమాపై ఇంత వరకు ఎలాంటి క్లారటీ రాలేదు. ఇప్పటికే 16 కథలు విన్న నాని వాటిలో ఏ ఒక్క కథకు ఓకె చెప్పలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇలా నాని కాదన్న కథల్లో స్టార్ డైరెక్టర్లు తెచ్చినవి కూడా ఉండటంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.

Thursday, March 24, 2016

రనౌట్ కు ముందు ధోని ఏం చేశాడంటే...

టీ20 ప్రపంచకప్ లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో చివరికి రనౌట్ తో టీమిండియా విజయం సాధించింది. రనౌట్ చేయాలని 'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోని ముందుగానే సిద్ధమైనట్టు కనబడుతోంది. హార్ధిక్ పాండ్యా చివరి బంతిని వేసే ముందు ధోనిని నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
బంతి వేయడానికే ముందే ధోని తన కుడిచేతి గ్లౌజ్ తీసేశాడు. సాధారణంగా వికెట్ కీపర్లు చేతులకు రెండేసి గ్లౌజులు వేసుకుంటారు. చేతికి అంటిపెట్టుకుని గ్లౌజులతో పాటు వదులుగా ఉండే గ్లౌజులు ధరిస్తారు. బంతిని ఒడిసిపట్టిన తర్వాత దాన్ని విసిరే క్రమంలో చేతికున్న పెద్ద గ్లౌజును తీసేస్తుంటారు. వదులుగా ఉండే పెద్ద గ్లౌజులు ధరించి వికెట్లను కొట్టడం కష్టం. కాబట్టి ధోని ముందుగానే రనౌట్ కు ప్లాన్ చేసుకున్నట్టు కనబడుతోంది.
ఇక రెండో ఎండ్ లో ఉన్న బ్యాట్స్ మన్ వచ్చేలోపే 15 గజాల దూరం పరుగెత్తి ధోని రనౌట్  చేయడం విశేషం. దూరం నుంచి బంతి విసిరితే అది వికెట్లకు తగలకపోతే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదముందని గ్రహించిన టీమిండియా కెప్టెన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తి పరుగులు తీయడంలో ధోని ఎక్స్ పర్ట్  అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విశ్వాసంతోనే ధోని వికెట్ల దగ్గరకు పరుగెత్తికొచ్చి రనౌట్ చేయగలిగాడని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు.

Wednesday, March 23, 2016

వేడుకగా చలాకీ చంటి నిశ్చితార్థం


బుల్లితెర కార్యక్రమం ‘జబర్దస్త్‌’ ద్వారా అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్న నటుడు చలాకీ చంటి. ఆయన త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ విషయాన్ని చలాకీ చంటి స్వయంగా సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ రోజు నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించినట్లు చంటి తెలిపారు. ఈ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫొటోలను చంటి అభిమానులతో పంచుకున్నారు.


Tuesday, March 22, 2016

మహేశ్‌బాబు కుమార్తె డ్యాన్స్‌ చూశారా..!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గారాలపట్టి సితార ఇటీవల జరిగిన పాఠశాల వేడుకలో నృత్యం చేసింది. బ్లూ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ ఉన్న డ్రెస్‌తో ‘క్లాప్‌ క్లాప్‌’ అనే పాటకు ముద్దుముద్దుగా డ్యాన్స్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతోత్వరలో మహేశ్‌బాబు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌, సమంత, ప్రణీత కథానాయికలు.

Monday, March 21, 2016

పడవ తెచ్చే పిజ్జా ఇది..



మనకు పిజ్జా కావాలంటే ఇలా ఆర్డర్‌ చేస్తే అలా తెచ్చి ఇచ్చేస్తారు. సమయానికి పిజ్జా డెలివరీ ఇవ్వడానికి రోడ్ల మీద డెలివరీ బాయ్స్‌ బైక్‌లపై రయ్‌ రయ్‌మని తిరగడం చూస్తుంటాం. కానీ పడవలో వెళ్లి పిజ్జా డెలివరీ ఇవ్వడం చూశారా.. కరేబియన్‌ సముద్రంలోని ద్వీపాల మధ్య పడవల్లో వెళ్లే వారికి పిజ్జా బోట్‌ సౌకర్యం ఉంది తెలుసా. ఆర్డర్‌ చేస్తే పడవలో వెళ్లి పిజ్జా ఇచ్చేస్తున్నారు అమెరికాకు చెందిన దంపతులు.
 

సాషా, తారా బోయిస్‌ అనే దంపతులకు పడవలు అన్నా, పడవ ప్రయాణం అన్నా.. పిజ్జాలు అన్నా చాలా ఇష్టమట. ఈ రెండింటినీ కలిపి ‘పిజ్జా పై’ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఇందుకోసం అమెరికాలో ఉద్యోగాలు వదిలేసి కరేబియన్‌ సముద్రంలో పిజ్జాబోట్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. సాషా కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, తారా ఎలిమెంటరీ టీచర్‌ ఉద్యోగాన్ని వద్దనుకున్నారు. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బోట్‌నే కిచెన్‌గా మార్చేసి నోరూరించే పిజ్జాలు తయారుచేసి అమ్ముతున్నారు. అదే బోట్‌ను ఇల్లుగా మలుచుకొని ఆనందంగా గడిపేస్తున్నారు.
 

Sunday, March 20, 2016

ఔను... నేనంతే!

 సినిమాల్లో తప్ప నయనతార విడిగా కనిపించరు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. యాడ్స్‌లో నటించరు. అప్పుడెప్పుడో ఓ యాడ్‌లో నటించారంతే. పబ్లిక్ దర్శనాలు ఎక్కువ ఇవ్వకపోవడానికి నయనతార కారణాలు నయనతారకున్నాయి. అయితే, ఇలా చేయడం వల్ల నయనతార ఫ్రెండ్లీ టైప్ కాదనీ, గర్వం అనీ, పొగరనీ చాలామంది అనుకుంటారు. ఈ విషయం గురించి నయనతార ప్రస్తావిస్తూ, ‘‘అవును. నేను పొగరుబోతునే! అహంకారిని కూడా! అయితే, నాతో వేళాకోళంగా ప్రవర్తించే వాళ్ల దగ్గరే అలా ఉంటాను. మిగతావాళ్ల దగ్గర అలా ఉండాల్సిన అవసరం నాకేంటి?’’ అన్నారు. తమిళ, తెలుగు, మలయాళ భాషా చిత్రాలతో తెగ బిజీగా ఉన్న ఈ మలయాళ సుందరి తన స్వభావం గురించి ఇంకా చాలానే చెప్పారు.            ‘‘నాతో సినిమాలు చేసినవాళ్లకూ, చేసేవాళ్లకూ నేనెంత ఫ్రెండ్లీగా ఉంటానో తెలుసు! నా గురించి నేను ఎక్కువ చెప్పుకుంటున్నానని అనుకోకపోతే ఒక్క మాట. నాది చాలా స్వీట్ నేచర్! షూటింగ్ లొకేషన్లో చాలా సరదాగా ఉంటాను. అందరితోనూ మాట్లాడుతుంటాను’’ అని ఆమె తన వాదన వినిపించారు. ఇన్నీ చెబుతూనే, ఒక్క విషయం కుండబద్దలు కొట్టారు. ‘‘ఏమైనా, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. నాకు మర్యాద ఇస్తే... నేనూ వాళ్ళకు మర్యాద ఇస్తా. ఒకవేళ నా దగ్గర మర్యాదగా నడుచుకోకూడదని ఎవరైనా నిశ్చయించుకుంటే, నా నుంచి కూడా ఇక మర్యాద ఎక్స్‌పెక్ట్ చేయొద్దు’’ అన్నారు.

షారుఖ్‌.. సన్నీ లైలా ఓ లైలా

 80వ దశకంలో బాలీవుడ్‌ను ఓ వూపు వూపేసిన క్లబ్‌ పాట ‘లైలా ఓ లైలా...’. ఫిరోజ్‌ ఖాన్‌, జీనత్‌ అమన్‌, వినోద్‌ ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ఖుర్బానీ’లో పాట అది. ఆ హుషారును మరోసారి బాలీవుడ్‌ తెరపై చూపించడానికి రంగం సిద్ధమవుతోంది. షారుఖ్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘రాయీస్‌’లో ఈ పాటను రీమేక్‌ చేయాలని నిర్ణయించారట. ఇందులో షారుఖ్‌ పక్కన సన్నీ లియోని స్టెప్పులేయబోతోంది. ‘‘రాయీస్‌’లో ఓ ప్రత్యేక గీతం పెట్టాలనే ఆలోచన వచ్చింది. అందులోనూ అది 80వ దశకం నాటి వాతావరణంలో ఉండాలి. అందుకే ‘లైలా ఓ లైలా..’ పాటను ఎంచుకున్నాం. ఇప్పటికే దీని హక్కుల కొనుగోలు జరిగిపోయింద’’ని సినిమా వర్గాలు చెబుతున్నాయి. నాటి కాలాన్ని ప్రతిబింబించేలా ఓ బార్‌ సెట్‌ కూడా వేశారు. ఇందులో రెండు రోజులపాటు చిత్రీకరణ జరుపుతారు. ఇప్పటికే షారుఖ్‌, సన్నీ రిహార్సల్స్‌ మొదలెట్టేశారని తెలుస్తోంది.

ధోనీ భార్యకు కోపం వచ్చింది..


గత రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టి 20 మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై గెలిచిన ఆనందంలో క్రికెట్ అభిమానులంతా సంబరాలు జరుపుకోగా ధోనీ సతీమణి సాక్షికి మాత్రం చిరు కోపం వచ్చిందట.. అది కూడా భారత్ అభిమానులపై!  అంత చిరాకు పెట్టేలా అభిమానులు ఏం చేసుంటారనుకుంటున్నారా ? ధోనీ గారాల పట్టి జీవాకు నిద్రా భంగం కలిగించారు.         భారత్ మ్యాచ్ గెలిచిన సంబరంలో కొందరు అభిమానులు ధోనీ ఇంటి ముందు బాణా సంచా పేల్చి హంగామా చేయడం మొదలుపెట్టారు.అప్పటికే బాగా పొద్దు పోవడంతో సాక్షి కాస్త ఇబ్బంది పడ్డారు. పాప నిద్ర లేస్తుందని చెప్తూ చిరు కోపాన్ని ట్విట్టర్ లో ప్రదర్శించారు!           టీం ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూనే.. ఇంటి ముందు హంగామాను కూడా వివరించారు. 'మీరంతా కలిసి నా చిన్నారిని నిద్ర లేపేలా ఉన్నారు. నేను తప్పకుండా ఏదో ఒక రోజు భారత్-పాక్ మ్యాచ్ గురించి పాపకు చెప్తాను, కానీ ఇప్పుడు తను చాలా చిన్నపిల్ల కదా.. ఏం జరుగుతుందో, వాళ్ల నాన్న ఎవరో .. ఇవేమీ పాపకు అర్థం కావు' అంటూ ట్వీట్ చేశారు సాక్షి సింగ్ ధోనీ.

Saturday, March 19, 2016

ఈ డ్రెస్‌కు బాలీవుడ్‌ స్టార్స్‌ ఫిదా అయ్యారట!

 పరిణితీ చోప్రా ధరించిన దుస్తులకు బాలీవుడ్‌ స్టార్స్‌ ఫిదా అయ్యారట. పరిణితీ తన ట్విట్టర్‌ ఖాతాలో ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డుల కార్యక్రమంలో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. అందులో ఆమె ధరించిన బ్లూ లాంగ్‌ ఫ్రాక్‌ను బాద్‌షా షారుక్‌ ఖాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, రణ్‌వీర్‌ సింగ్‌, వరుణ్‌ ధావన్‌లు సరదాగా పట్టుకుని ఉన్నారు. వీరంతా తన డ్రెస్‌కు ఫ్యాన్స్‌ అయిపోయారంటూ... పరిణితీ తనదైన స్టైల్‌లో ఫన్నీగా ట్వీట్‌ చేశారు. ఇలా స్టార్స్‌ అంతా ఒకే చోట సరదాగా ఉన్న ఫొటోకు అభిమానులు నుంచి తెగ లైక్‌లు వస్తున్నాయి. నిజంగానే ఆమె డ్రెస్‌ చక్కగా ఉందని అభిమానులు కామెంట్స్‌ పెట్టారు.

Thursday, March 17, 2016

బుర్రిపాలెంలో నమ్రత

ప్రభుత్వ పథకాల వల్లె వేయడంతో గ్రామస్తుల నిరాశ
రెండునెలల్లో మహేష్‌ వచ్చి ప్రణాళికను వెల్లడిస్తాడని ప్రకటన



బ్రహ్మరథం పట్టిన బుర్రిపాలెం గ్రామస్తుల కోలాహాలం మధ్య సినీ నటుడు మహేష్‌ భార్య నమ్రత శిరోద్కర్‌ గ్రామంలో గురువారం పర్యటించారు. తెనాలి మండలం బుర్రిపాలేన్ని మహేష్‌బాబు ఆన్‌లైన్‌ ద్వారా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామ స్థితిగతులు తెలుసుకునేందుకు మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌, అతని సోదరి, ఎంపి గల్లా జయదేవ్‌ భార్య పద్మావతి బుర్రిపాలెంలో పర్యటించారు. పలు ప్రార్థనా మందిరాలను సందర్శించినానంతరం సూపర్‌స్టార్‌ కృష్ణ తల్లి నాగరత్నమ్మ నిర్మించిన జడ్‌పి పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభకు ఎంపిడిఒ బి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. నమ్రతా మాట్లాడుతూ గ్రామీణుల్లో చైతన్యం తెచ్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచ్చేందుకు సిఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. సిఎం స్ఫూర్తితో స్మార్ట్‌ గ్రామాలకు తామూ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పలు ప్రభుత్వ పథకాలను ఆమె ఇక్కడే ఉదహరించారు. సిఎం, పిఎం పాలనపై ప్రశంసలు కురిపించిన ఆమె ప్రతిఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకుంటే ప్రభుత్వాలే ప్రత్యేక గ్రాంటులు విడుదల చేస్తాయని చెప్పారు. మహేష్‌బాబు సోదరి, ఎంపి గల్లా జయదేవ్‌ భార్య పద్మావతి మాట్లాడుతూ తన తండ్రి సొంతూరు బుర్రిపాలెం, అమ్ముమ సొంతూరు కంచర్లపాలెం అంటే తనకు అమితమైన మక్కువన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు. తమ గ్రామంలోని మూడు అంగన్వాడీ కేంద్రాలూ పాఠశాలల్లోనే కొనసాగుతున్నాయని, ప్రత్యేక భవనాలు నిర్మించాలని కార్యకర్త కోరారు. అయితే వారి నుండి మాత్రం సరైన స్పందన వ్యక్తమవ్వలేదు. ఈ సందర్భంగా జడ్‌పి పాఠశాల నేతృత్వంలో రూపొందించిన కృష్ణ, మహేష్‌బాబు కుటుంబ సభ్యుల డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అనంతరం కృష్ణ నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలోనూ పై అంశాలనే ప్రస్తావించారు. ఎంపి గల్లా జయదేవ్‌ నిధుల నుండి రూ.27లక్షలతో సిసి రోడ్లు నిర్మిస్తారని రెండురోజుల కిందటి నాటి అంశాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపిపి ఎస్‌.వెంకట్రావు, జడ్‌పిటిసి ఎ.జయలక్ష్మి, సర్పంచ్‌ కె.సామ్రాజ్యం, ఎంపిటిసి ఎస్‌.రామ్మోహనరావు, హెచ్‌ఎం లలితప్రసాద్‌, గ్రామ కార్యదర్శి కిషోర్‌ పాల్గొన్నారు.
కంచెర్లపాలెంలో పద్మావతి..
అనంతరం ఎంపి గల్లా జయదేవ్‌ భార్య పద్మావతి తాను దత్తత తీసుకున్న కంచర్లపాలెంలో పర్యటించారు. అభివృద్ధి పనులపై అధికారుల నుండి వివరాలు సేకరించారు. స్థానిక ప్రజలతో సమావేశం కాగా సిసి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, శ్మశాన వాటికల అభివృద్ధి, కమ్యూనిటీ హాలు, బస్సు ఏర్పాటు అంశాలను గ్రామస్తులు ఆమె దృష్టికి తెచ్చారు. పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు కలుగుతాయని కోరారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ గ్రామాభివృద్దికి రూ.27లక్షలతో డ్రెయిన్‌ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఉపాధి హామీ, రూ.60 లక్షల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కె.నిర్మలాకుమారి, తహశీల్దార్‌ జివి సుబ్బారెడ్డి, ఎంపిపి, జడ్‌పిటిసి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

'బాహుబలి 2లో నటించడం లేదు'


 తాను 'బాహుబలి 2' సినిమాలో నటించడం లేదని హీరోయిన్ శ్రియ తెలిపింది. ఈ చిత్రంలో భల్లాలదేవుడిగా నటించిన దగ్గుబాటి రానాకు జోడీగా శ్రియ నటించనుందని అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను శ్రియ తోసిపుచ్చింది. 'బాహుబలి 2'లో తాను లేనని వెల్లడించింది. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన అమెజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో ఆమె పాల్గొంది. డిజైనర్ కనిజ సలూజ డిజైన్ చేసిన దుస్తులు ధరించి ర్యాంప్ పై మెరిసిపోయింది.
         ఈ సందర్భంగా విలేకరులు 'బాహుబలి 2' గురించి అడగ్గా... ఈ సినిమాలో నటించమని తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపింది. ఈ చిత్రం నటించాలని ఉన్నా తనకు అవకాశం రాలేదని వెల్లడించింది.
            'బాహుబలి' తొలి భాగంలో రానా కొడుకు పాత్రను మాత్రమే చూపించిన దర్శకుడు రాజమౌళి.. రెండో భాగంలో భల్లాలదేవుడి భార్యను కూడా చూపించనున్నాడు. ఈ పాత్ర ఎవరికి దక్కుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, రానా లీడ్ రోల్స్‌ లో నటించిన 'బాహుబలి 2' వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

Wednesday, March 16, 2016

అర్జంట్‌గా నాకొక కూతురు కావాలి..

 టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతకు అర్జెంట్‌గా  ఓ కూతురు కావాలట. అదీ మూడు రోజుల్లోనే. 'శనివారం లోగా నాకో బేబీ కావాలి. ఇప్పుడెలా అంటూ..' ట్వీట్‌ చేశారు సమంత. ఇంత అర్జెంట్‌గా సమంతకి కూతురి అవసరం ఎందుకొచ్చిందో ఓసారి చూద్దాం..ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' షూటింగ్‌లో బిజీగా ఉన్న సమంత.. మహేష్‌బాబు తనయ సితారతో గడిపేందుకు శనివారం సమయాన్ని కేటాయించింది. అయితే సితార తనతో ఆడుకోవడానికి సమంత కూతురిని కూడా తీసుకురమ్మని రిక్వెస్ట్‌ చేసిందట. దీంతో ఏం చేయాలో తెలీయక సమంత పై విధంగా ట్వీట్‌ పెట్టింది. 'శనివారం సితారతో ఆడుకోవడానికి డేట్‌ ఫిక్స్‌ చేశా. కాని సితారకి నా కూతురు కూడా కావాలంట. శనివారంలోగా ఓ బేబీని ఎలా ఎరేంజ్‌ చేయాలి' అంటూ సితారతో దిగిన ఓ ఫోటోను సరదాగా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది సమంత. 'బ్రహ్మోత్సవం'తోపాటు సమంత నితిన్‌ సరసన 'అ...ఆ' చిత్రంలోనూ నటిస్తున్న విషయం విదితమే.

రాజకుమారిగా కాజల్‌

  ‘మగధీర’ చిత్రంలో రాజకుమారి మిత్రవిందగా అందరినీ ఆకట్టుకొంది నటి కాజల్‌. ఇప్పుడు ఈ భామ తన తరువాతి చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లోనూ రాజకుమారిగా కనిపించనుందట. కాజల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... సర్దార్‌ సెట్‌లోని ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, రాజకుమారి అర్షి అంటూ హ్యాష్‌టాగ్‌లు పెట్టారు.
కాజల్‌ తొలిసారి ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌కు జంటగా నటించారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ నెల 20న చిత్రం ఆడియో విడుదల వేడుకలను నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tuesday, March 15, 2016

సానియా మీర్జా X షోయబ్ మాలిక్


 భారత్, పాకిస్తాన్ ప్రపంచకప్ మ్యాచ్‌కు ముందు ఉన్న ఉత్కంఠను కార్పొరేట్ కంపెనీలు కూడా వాడుకుంటున్నాయి. తాజాగా నెస్లేసంస్థ తమ ఉత్పత్తి కోసం పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, అతని భార్య (భారత టెన్నిస్ స్టార్) సానియా మీర్జాలతో కలిసి ఓ యాడ్‌ను రూపొందించింది. ఇందులో ఇద్దరూ తమ తమ దేశాల్లో ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులే గొప్ప అంటూ వాదనకు దిగుతారు. సచిన్ స్ట్రయిట్ డ్రైవ్ గొప్పని సానియా అంటే... అక్తర్ యార్కరే గ్రేట్ అని మాలిక్ అంటాడు. ప్రస్తుతం ఈ యాడ్ పాకిస్తాన్‌లో ప్రసారం అవుతోంది.

అమితాబ్‌, రజనీల షికార్లు!

 తారల పాట్లు తారలవి. సరదాగా ఏ రోడ్డు మీదనో షికారుగా నడవాలంటే కుదరదు. అభిమానులు గుర్తుపట్టి మూగిపోతారు. అయినా అప్పుడప్పుడు ఏ మారువేషంలోనే సరదాలు తీర్చుకుంటారు. అలాగే చేశారు అమితాబ్‌ బచ్చన్‌.
నిర్మాత సూజిత్‌ సర్కార్‌ అమితాబ్‌ బచన్‌తో ుఆగ్రా కా దాబ్రా’ సినిమా తీస్తున్నారు. దిల్లీ నేపథ్యంలో సాగే ఈ సినిమా అనిరుద్ద రాయ్‌ చౌదరి దర్శకత్వంలో రూపు దిద్దుకుంటోంది. సినిమా షూటింగు కోసం దిల్లీ వెళ్లిన అమితాబ్‌ ఒక ఖాకీ ప్యాంటు, బాగా వదులుగా వుండే చొక్కా ధరించి ముఖాన్ని కవర్‌ చేసే టోపీ ధరించి క్రిక్కిరిసి వుండే దిల్లీ ప్రధాన వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లారు. అయితే ఎవరూ ఆయనను గుర్తుపట్టలేదు. ునాకు తోడుగా ఒక వీధి కుక్క మాత్రం నడిచింద’ని అమితాబ్‌ ట్వీట్‌ చేసారు.

 తనను గుర్తుపట్టని విధంగా మేకప్‌ చేసిన వ్యక్తిని అభినందించుకుంటూ తాను బాలీవుడ్‌కు రాకముందు తిరిగిన వీధిని చుట్టబెట్టేశారు. అమితాబ్‌ లాగే మరో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా బెంగళూరులో తన స్నేహితుల్ని, తను నిత్యం ఆరాధించే దేవాలయాన్ని చూడాలనిపిస్తే మారువేషంలో వెళుతుంటారు. ుుఈ స్టార్‌ డమ్‌ రావడం వల్ల కానీ, లేకపోతేనా... బెంగళూరు వీధుల్లో డ్యాన్స్‌ చేస్తూ తిరిగేవాడిని’’ అంటూ చెబుతుంటారు రజనీకాంత్‌.

Sunday, March 13, 2016

రజనీ చిత్రం రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్

 సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని రూ.350 కోట్లకు ఇన్సూరెన్స్ చేశారు. ఇలా ఇన్సూరెన్స్ చేసిన తొలి తమిళ చిత్రం బహుశా ఇదే కావొచ్చు. రజనీకాంత్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.అందులో ఒకటి కబాలి, మరొకటి 2.ఓ.ఇది ఎందిరన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం అన్నది గమనార్హం. స్టార్ దర్శకుడు శంకర్ మరో అద్భుతానికి పూనుకున్న చిత్రం ఇది. ఎమీజాక్సన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో విలన్‌గా నటించడం విశేషం.
            నీరవ్‌షా చాయాగ్రహణం, సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతంతో పాటు, హాలీవుడ్ సాంకేతికనిపుణులు పనిచేస్తున్న 2.ఓ చిత్రాన్ని లైకా సంస్థ రూ.350 కోట్లతో బ్రహ్మాండంగా నిర్మిస్తోంది.ఇంత భారీ బడ్జెట్‌లో తొలి తమిళ చిత్రం ఇదేననీ ఘంటాపథంగా చెప్పవచ్చు. విదేశీ స్టంట్ కళాకారులు, మేకప్ నిపుణులు,అబ్బుర పరచే సెట్స్ అంటూ నిరాటంకంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 2.ఓ చిత్రాన్ని లైకా సంస్థ 350 కోట్లకు ఇన్సూరెన్స్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

Thursday, March 10, 2016

త్రిష తెలుగు పాట పాడిందోచ్!

 త్రిష హీరోయిన్‌గా వచ్చి 13 ఏళ్లయింది. ఈ తమిళ పొణ్ణు తెలుగులో టాప్‌స్టార్‌గా ఎదిగింది. అగ్ర హీరోలు చిరంజీవి నుంచి మహేశ్‌బాబు వరకూ అందరితోనూ నటించిన ఈ భామ ఇప్పటి దాకా తెర మీద తెలుగులో గొంతు విప్పలేదు. బయట కూడా పొడి పొడి తెలుగే వచ్చు.
ఇప్పటివరకూ డబ్బింగ్ చెప్పని త్రిష ఏకంగా పాటే పాడేశారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాయకి’. గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, ఎం. పద్మజ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న నాయకి కోసం రెండు భాషల్లోనూ త్రిష పాడడం విశేషం. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున సంగీత దర్శకుడు రఘు కుంచె సారథ్యంలో  త్రిష ఈ పాట రికార్డింగ్ పూర్తిచేశారు. 

Wednesday, March 9, 2016

గిన్నిస్‌ రికార్డులో సోనాక్షి సిన్హాకు స్థానం


మహిళలందరితో కలిసి ఒకేసారి గోళ్లకు రంగు వేసుకొని బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సంపాదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబయిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పలు కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని ఏకకాలంలో గోళ్లకు రంగు వేసుకున్నారు.
పోలాండ్‌కు చెందిన కాస్మోటిక్‌ బ్రాండ్‌ ఇంగ్లోట్‌తో కలిసి సోనాక్షి సిన్హా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కార్యక్రమ అనంతరం గిన్నిస్‌ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని నిర్వాహకులు సోనాక్షికి అందజేశారు.

Monday, March 7, 2016

సమ్మర్‌లో సై!

 శత్రువులపై కన్నెర చేసే సింహం..  ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే ఆపద్బాంధవుడు.. సమాజం కోసం పాటుపడే మంచి సంఘ సంస్కర్త... టోటల్‌గా మంచితనానికి చిరునామా కబాలి. ఈ మాఫియా డాన్ లక్ష్యం ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. టైటిల్ రోల్‌లో రజనీకాంత్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో ‘కలైపులి’ ఎస్. థాను నిర్మిస్తున్న ‘కబాలి’ ఫస్ట్ లుక్‌కి భారీ ఎత్తున స్పందన లభించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా ‘కలైపులి’ ఎస్. థాను మాట్లాడుతూ - ‘‘రజనీకాంత్‌తో సినిమా నిర్మించాలన్న నా కల ఈ చిత్రంతో నెరవేరింది. మంచి కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రంలో ఆయన గెటప్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. రంజిత్ మంచి స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఏప్రిల్ మొదటి వారంలో టీజర్‌ను, రెండో వారంలో పాటలను, వేసవి కానుకగా మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. రాధికా ఆప్టే, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: సాహితి, సంగీతం: సంతోశ్ నారాయణ్, పాటలు: సిరివెన్నెల, చంద్రబోస్, అనంతశ్రీరామ్, కెమెరా: మురళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవి-శ్రీదేవి సతీశ్.

Sunday, March 6, 2016

సూపర్ స్టార్ భార్యకు బెదిరింపులు

 హాలీవుడ్ సూపర్ స్టార్ జార్జి క్లూనీ భార్య అమల్ అలముద్దీన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్ లోని జార్జి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమల్.. అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది. జైలుపాలైన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తరపున ఆమె వాదిస్తోంది. బెదిరింపులు రావడంతో అమల్ కు పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేశారు.
సౌత్ ఆక్స్ ఫర్డ్ షైర్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ పాల్ హారిసన్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. జార్జి ఇంటి వద్ద భద్రతతో పాటు నిఘా ఉంచారు. జార్కి ఎక్కువ భద్రత అవసరం లేదని, అమల్ కు పటిష్టమైన భద్రత కల్పించామని హారిసన్ చెప్పారు. అత్యున్నత స్థాయి కేసులు వాదిస్తున్నందున ఆమెకు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. మాల్దీవులు అధ్యక్ష పదవి నుంచి 2012లో ఉద్వాసనకు గురైన మహ్మద్ నషీద్ కు.. ఉగ్రవాద నిర్మూలన చట్టం కింద గతేడాది 13 ఏళ్ల జైలు శిక్షపడింది. కాగా వెన్నెముకకు సర్జరీ చేయించుకునేందుకు గాను ఆయన ఇంగ్లండ్ కు వెళ్లేందుకు ఇటీవల అనుమతిచ్చారు.

రూపం ఒక్కటే!

 ఒకే గర్భం పంచుకొన్నారు. క్షణాల తేడాలో జన్మించారు. ఇద్దరి రూపం ఒక్కటే. మరివారిలో ఎవరేం చేశారో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు సూర్య. ఆయన కథా నాయకుడిగా నటించిన చిత్రం ‘24’. సమంత, నిత్య మేనన్‌ కథానాయికలు. విక్రమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. తెలుగు ప్రచార చిత్రాన్ని యువ కథానాయకుడు నితిన్‌ ట్విట్టర్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘సైన్స్‌ ఫిక్షన్‌ కథతో తెరకెక్కిన థ్రిల్లర్‌ చిత్రమిది. ఉన్నతమైన సాంకేతిక హంగులతో రూపుదిద్దుకొంది. ప్రేక్షకులను అడుగడుగునా థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం, తిరు కెమెరా పనితనం చిత్రానికి మరింత వన్నె తెచ్చేలా ఉంటాయి. దర్శకుడు విక్రమ్‌ చిత్రాన్ని దృశ్యకావ్యంలా తీర్చిదిద్దారు. టీజర్‌కి మంచి ఆదరణ లభిస్తోంద’’న్నారు. అజయ్‌ ఈ చిత్రంలో ముఖ్యభూమిక పోషించారు. సమర్పణ: శ్రేష్ఠ్‌ మూవీస్‌, గ్లోబల్‌ సినిమాస్‌

Saturday, March 5, 2016

రివ్యూ: గుంటూర్ టాకీస్


            కొద్ది కాలంగా తెలుగు తెరపై క్రైమ్ కామెడీ చిత్రాల సంద‌డి ఎక్కువైంది.  ఇలాంటి చిత్రాల్లో ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశం, క‌థ‌ను వేగంగా న‌డిపించే స్ర్కీన్‌ప్లే,  సంద‌ర్భోచిత హాస్యాన్ని అందించే సంభాష‌ణ‌లు ఉంటే చాలు, తారాగ‌ణంతో సంబంధం లేకుండానే ప్రేక్ష‌కులు విజ‌యాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈకోవ‌లోనే తెర‌కెక్కిన చిత్రం గుంటూర్ టాకీస్‌. జాతీయ పుర‌స్కారం సాధించిన చంద‌మామ క‌థ‌లు చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కుడు కావ‌డం, బుల్లితెర యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మి నాయిక‌గా న‌టించ‌డం, శ్ర‌ద్ధ‌దాస్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌టంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కులు మంచి అంచ‌నాలు పెట్టుకున్నారు.

           క‌థేంటంటే: గుంటూర్ టాకీస్ మెడిక‌ల్ షాపులో చిరుద్యోగులుగా  ప‌నిచేసే హ‌రి(సిద్ధు), గిరి(న‌రేష్‌) రాత్రివేళ చిల్ల‌ర‌దొంగ‌త‌నాలు చేస్తుంటారు.  ఓరోజు రాత్రి దొంగ‌త‌నానికి వెళ్లిన‌ప్పుడు ఓ ఇంట్లో హ‌రికి రూ. ఐదు ల‌క్ష‌లు దొరుకుతుంది. ఆ విష‌యం గిరికి చెప్ప‌డు. మ‌రో ఇంట్లో గిరికీ రూ.ఐదుల‌క్ష‌లు దొరుకుతాయి. ఆ విష‌యం హ‌రికి చెప్ప‌కుండా దాస్తాడు.  అయితే ఆ రెండిళ్లు సీఐ ర‌ఘ‌బాబువ‌న్న విష‌యం వారికి తెలియ‌దు. హ‌రి ఆ డ‌బ్బుతో త‌ను ప్రేమించే ర‌ష్మితో క‌ల‌సి ఎంజాయ్ చేయ‌డానికి గోవా వెళ్లిపోతాడు.  అక్క‌డ ఓ రౌడీ బ్యాచ్ హ‌రిని బంధిస్తారు. అప్ప‌టికే గిరినీ వారు బ‌ల‌వంతంగా తీసుకొచ్చుంటారు.  వారు తాము దొంగ‌లించిన డ‌బ్బు తాలుకు మ‌నుషులేమో అని హ‌రి, గిరి అనుకుంటారు. అయితే వారు మాత్రం కోటి రూపాయ‌లు విలువ చేసే ఓ డ‌బ్బా గురించి అడుగుతూ ఎక్క‌డ దాచారంటూ తీవ్రంగా కొడ‌తారు.  మ‌రోవైపు సీఐ ఇంట్లో దొంగ‌త‌నం చేసిన హ‌రి, గిరిల‌ను పోలీసులు వెంబ‌డిస్తుంటారు. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య చిక్కుకున్న హ‌రి, గిరి ప‌రిస్థితి ఏంటి? అస‌లు ఆ డ‌బ్బా సంగ‌తేంటి? హ‌రికి, రివాల్వ‌ర్ రాణి(శ్ర‌ద్ధ‌దాస్‌)కు సంబంధ‌మేంటి?  ఇంత‌కూ ఆ కోటి రూపాయ‌ల డ‌బ్బా ఎవ‌రి సొంత‌మైంది? త‌దిత‌ర విషయాలు తెర‌పై చూడాలి.
            ఎలా ఉందంటే:  ఇలాంటి క‌థ‌ల‌కు ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం వేగం. అయితే ప్ర‌థ‌మార్ధంలో అది క‌ర‌వైంది. గంట నిడివికే సాగ‌తీత ఎక్కువైన‌ట్లు అనిపిస్తుంది.  విశ్రాంతి సమ‌యం నుంచే అస‌లైన క‌థ మొద‌లైన అభిప్రాయం క‌లుగుతుంది.  అప్ప‌టి వ‌ర‌కూ సిద్దు, న‌రేష్ పాత్ర‌లే ఎక్కువ‌గా క‌నిపించిన ప్రేక్ష‌కుల‌కు,   ద్వితీయార్ధంలో మ‌హేష్ మంజ్రేక‌ర్‌, ర‌ఘుబాబు త‌దిత‌రుల ప్ర‌వేశంతో  కొత్త‌ద‌నం ఉంటుంద‌న్న ఆశ క‌లుగుతుంది. గిలిగింత‌లు పెట్టే సంభాష‌ణ‌లు కాకుండా సంద‌ర్భోచిత హాస్యాన్ని పండించ‌డం బాగుంది.  అయితే శ్ర‌ద్ధాస్ చేసిన రివాల్వ‌ర్ రాణి పాత్ర‌ను కుటుంబ ప్రేక్ష‌కులు జీర్ణించుకోవ‌డం క‌ష్టం. మ‌హేష్ మంజ్రేక‌ర్, ఫిష్ వెంక‌ట్‌,ర‌విప్ర‌కాష్‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు న‌వ్విస్తాయి.  మ‌హేష్ మంజ్రేక‌ర్ పాత్ర‌తో  ప‌లికించిన సంభాష‌ణ‌లు కొంద‌రికి రుచించ‌క‌పోవ‌చ్చు. మొత్తంగా ఇది  యువ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన సినిమా క‌నుక వారికి న‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌.
            ఎవ‌రెలా:  సిద్ధు, న‌రేష్ పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌మెక్కువ‌.  సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌నుకునే పైలా ప‌చ్చీస్ యువ‌కుడిగా సిద్దు ఒదిగిపోయాడు. న‌రేష్ అనుభ‌వం ముందు ఇలాంటి పాత్ర‌లు కొట్టిన పిండి. ర‌ష్మి క‌నిపించే స‌మయం  ఎక్కువైనా ప‌లికే సంభాష‌ణలు చాలా త‌క్కువ‌. ఓ పాట‌తో పాటు మ‌రికొన్ని స‌న్నివేశాల్లో గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటుంది. శ్ర‌ద్ద‌దాస్ చేయ‌డానికి పెద్ద‌గా స్కోప్ లేదు.  మ‌హేష్ మంజ్రేక‌ర్ వైవిధ్య‌మైన డైలాగ్ డెలివ‌రీతో ఆక‌ట్టుకుంటాడు. ఇత‌రులు వారి పాత్ర‌ల మేర‌కు న‌టించారు.  పాత్ర‌ల రూప‌క‌ల్ప‌న‌పై శ్ర‌ద్ధ పెట్టే ద‌ర్శ‌కుడిగా పేరున్న ప్ర‌వీణ్ స‌త్తారు ఇందులో ఆ విషయాన్ని మ‌రిచాడు.  పాత్ర‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నా వాటి ప్ర‌భావం అంత‌గా క‌నిపించ‌దు.  శ్రీ చ‌ర‌ణ్‌కు పాట‌లతో ప్ర‌తిభ నిరూపించుకోవ‌డానికి ఇందులో అవ‌కాశం లేదు. నేపథ్య సంగీతంలో ఫ‌ర్వాలేద‌నిపించాడు.  ద‌ర్శ‌కుడు బిగువైన క‌థ‌నంపై దృష్టి పెట్టి ఉంటే బాగుండ‌నిపిస్తుంది.

Friday, March 4, 2016

'శౌర్య' మూవీ రివ్యూ


కరెంటు తీగ లాంటి హిట్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ సరికొత్త అవతారంలో శౌర్యగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఎక్కువగా ఎనర్జిటిక్ రోల్స్ లోనే కనిపించిన మనోజ్, ఈ సినిమాలో డీసెంట్ లుక్ తో, సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్స్ మాత్రమే తీసిన దర్శకుడు దశరథ్ కూడా ఈ సినిమాతో రూటు మార్చే ప్రయత్నం చేశాడు. తొలిసారిగా ఓ క్రైమ్ థ్రిల్లర్ తో అభిమానుల మెప్పించడానికి ప్రయత్నించాడు. మనోజ్ లుక్ తో పాటు ప్రమోషన్ పరంగా ఆకట్టుకున్న శౌర్య థియేటర్స్ కు వచ్చిన ఆడియన్స్ ను ఆ స్ధాయిలో థ్రిల్ చేశాడా..?
కథ :
శౌర్య( మంచు మనోజ్), నేత్ర (రెజీనా) చాలా కాలంగా ప్రేమించుకుంటుంటారు. వీరి పెళ్లికి నేత్ర తండ్రి సత్యమూర్తి(నాగినీడు), బాబాయి కృష్ణమూర్తి(సుబ్బరాజు) ఒప్పుకోలేదన్న కారణంతో తన గోల్ ను కూడా వదులుకొని యుకె వెళ్లి సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్న శౌర్య, చివరిసారిగా నేత్ర మొక్కు చెల్లించటం కోసం శివరాత్రి జాగరం చేయటానికి ఆమె సొంత ఊరికి వస్తారు. ఇద్దరు నిద్రపోయిన సమయంలో నేత్ర మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది.


శౌర్య పక్కన ఉండగానే ఎవరో నేత్ర గొంతుకోసి పారిపోతారు. ఆ నేరం, ఆమెతోనే ఉన్న శౌర్య మీద పడుతుంది. నేత్ర తండ్రి ఎంపీ కావటంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకుంటారు. ఇంతకీ నేత్ర మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు..? ఆ కేసు శౌర్య మీదకు ఎందుకు వచ్చింది..? శౌర్య ఈ కేసు నుంచి బయటపడి అసలు నేరస్థులను ఎలా పట్టించాడు..? అన్న అంశాన్ని ఆసక్తి కరమైన మలుపులతో, థ్రిల్లింగ్ ట్విస్ట్ లతో తెరకెక్కించారు.
 
నటీనటులు :
ప్రతీ సినిమాలో ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే మనోజ్ ఈ సినిమాతో సెటిల్డ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో తనదైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. పాజిటివ్, నెగెటివ్ రెండు యాంగిల్స్ ను పర్ఫెక్ట్ గా చూపించి సినిమాకు ప్లస్ అయ్యాడు. రెజీనా కూడా తన పాత్ర మేరకు ఆకట్టుకుంది. నాచురల్ యాక్టింగ్ తో కథను ముందుకు నడిపించింది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రకాష్ రాజ్ మరోసారి తన మార్క్ చూపించాడు. హీరో పాత్రకు ధీటుగా పోలీస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో నాగినీడు, సుబ్బరాజు, శియాజీ షిండే లు తమ పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ శీను కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.

Thursday, March 3, 2016

నేను షారుక్ అభిమానిని!

 ఆ మధ్య వరకూ షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఆ తర్వాత సీన్ మారింది. సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్ పెళ్లి నుంచి ఈ ఇద్దరి మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. ఆ తర్వాత తమ మధ్య ఉన్న విభేదాలన్నింటినీ మరిచిపోయి ఇద్దరూ హ్యాపీగా ఉంటున్న సంగతి తెలిసిందే.

  ఇప్పుడు సల్మాన్‌ఖాన్ తాను షారుక్‌ఖాన్ అభిమానిని అని పేర్కొనడం బాలీవుడ్ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యాన్’ ప్రచార చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా కండలవీరుడు సల్మాన్ ‘‘బీయింగ్ ఎ ఫ్యాన్ ఆఫ్ షారుక్’’ అంటూ ‘ఫ్యాన్’ ట్రైలర్ లింక్‌ను తన ట్విటర్‌లో షేర్ చేశారు. గత ఏడాది సల్మాన్ నటించిన ‘బజరంగీ భాయ్‌జాన్’ చిత్రం ఫస్ట్ లుక్‌ను షారుక్ ట్విట్టర్‌లో ఆవిష్కరిస్తే, ఆ తర్వాత షారుక్ నటించిన ‘దిల్‌వాలే’ చిత్రం డైలాగ్స్‌తో సల్మాన్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ టీమ్ డబ్‌స్మాష్ చేసింది.

  ఇదంతా చూస్తుంటే, ఎలాంటి ఈగోలు లేకుండా సల్మాన్, షారుక్‌లు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ, ఒకరి చిత్రాలను మరొకరు ప్రమోట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద పోటీ పోటీనే... స్నేహం స్నేహ మే అన్న మాట. సల్మాన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. షారుక్ కూడా అంతే. కొత్తగా చిగురించిన ఈ ఇద్దరి స్నేహం ఎందాకా కొనసాగుతుందో కాలమే చెప్పాలి.

మహిళలకు శ్రుతిహాసన్‌ ప్రత్యేక బహుమతి

 నటి శ్రుతిహాసన్‌ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఓ పాటను అంకితం చేయనున్నారట. సంగీత దర్శకులు ఎహ్‌సాన్‌ నూరానీ, లాయ్‌ మెన్‌డోన్కాలతో కలిసి ఆమె ఈ పాటను విడుదల చేస్తున్నారు. మహిళలను చైతన్య పరిచే దిశగా ఈ పాటను రచించినట్లు శ్రుతి పేర్కొన్నారు. స్త్రీలకు కలలు కనే శక్తి నిస్తూ... ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనలు రాకుండా చేసే దిశగా పాట ఉంటుందని తెలిపారు. ఈ పాటలోని సంగీతం చక్కగా ఉంటుందని, పాట అందరికీ నచ్చుతుందని అభిప్రాయపడ్డారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న శ్రుతి ఇలా సమయం కేటాయించి మరీ మహిళల కోసం పాట విడుదల చేయడం విశేషమే కదా.
         ప్రస్తుతం శ్రుతిహాసన్‌ తెలుగులో నాగచైతన్యతో ‘ప్రేమమ్‌’లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘రాకీ హ్యాండ్సమ్‌’ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్‌ అబ్రహం కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నిశికాంత్‌ కామత్‌ దర్శకత్వం వహించారు.

Wednesday, March 2, 2016

విడాకులు కోరుతున్న నటి

 తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రేమ తన జీవిత భాగస్వామి జీవన్‌ అప్పచ్చు నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు. విడాకులు తీసుకోవడానికి తన భర్త అంగీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. అభిప్రాయబేధాల కారణంగా వీరిద్దరూ కొద్దికాలంగా విడిగా ఉంటున్నారు.
బెంగుళూరులోని కొడగు ప్రాంతానికి చెందిన ప్రేమ 2006లో పారిశ్రామిక వేత్త జీవన్‌ అప్పచ్చును వివాహం చేసుకున్నారు. 1995లో ‘సవ్యసాచి’ అనే కన్నడ చిత్రం ద్వారాప్రేమ తెరంగేట్రం చేశారు. వెంకటేశ్‌ సరసన ‘ధర్మచక్రం’ చిత్రంతో తెలుగు సినీపరిశ్రమకు పరిచయమయ్యారు.

బాహుబలి 2 రిలీజ్ డేట్


దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ముందుగా ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించినా, భారీ గ్రాఫిక్స్ తో పాటు షూటింగ్ పార్ట్ కూడా చాలా మిగిలి ఉండటంతో వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. 2017 ఏప్రిల్ 17న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.        ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి ద బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించటంతో పాటు 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న బాహుబలి 2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునే స్థాయిలో మరింత ప్రతిష్ఠాత్మకంగా బాహుబలి 2 ను తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్.

Tuesday, March 1, 2016

'24' టీజర్ రిలీజ్ కు ముహుర్తం కుదిరింది

 సౌత్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ 24. ఇష్క్, మనం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ మూవీలో సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ లు అభిమానులను ఆకట్టుకోగా త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.
తొలి రోజు నుంచి సినిమా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న చిత్రయూనిట్ టీజర్ లాంచ్ చేయబోతున్న విషయాన్ని కూడా క్రియేటివ్ గా ఎనౌన్స్ చేశారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా జానర్ ను రివీల్ చేసే విధంగా సైంటిస్ట్ ఉపయోగించే పరికరాలతో పోస్టర్ ను రిలీజ్ చేశారు. మార్చి 4, సాయింత్రం 6గంటలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు.  ఈవిషయాన్ని సూర్య తన ట్విట్టర్ లో వెల్లడించారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 16 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న ప్రీతి జింతా



బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా ఎట్టకేలకు పెళ్లి కూతురైంది. ప్రీతి తన ప్రేమికుడు, అమెరికాకు చెందిన ఆర్థిక విశ్లేషకుడు జీని గుడెనఫ్ ను వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 29న లాస్ ఏంజిలెస్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వివాహానికి ప్రీతి, గుడెనఫ్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం.            ఏడాదిన్నరగా ప్రీతి జింతా, గుడెనఫ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు వచ్చినా ప్రీతి వీటిని ఖండించింది. అయితే లాస్ ఏంజిలెస్ లో ప్రీతి తన బాయ్ ఫ్రెండ్ ను వివాహం చేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీతికి సన్నిహితంగా ఉండే సుజానే ఖాన్, సురిలీ గోయెల్ లాస్ ఏంజిలెస్ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రీతి ఏప్రిల్ లో ముంబైకు రానుంది.            ఈ దిల్ సే  హీరోయిన్  ప్రముఖ  వ్యాపారవేత్త నెస్ వాడియాను వివాహం చేసుకోనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ను కొనుగోలు చేశారు. అనంతరం వారిద్దరి మధ్య వివాదం ఏర్పడటం, పరస్పరం కేసులు పెట్టుకునే దాకా వ్యవహారం వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.