Wednesday, January 27, 2016

ఆన్‌లైన్‌లో ఘరానా మోసం!

 కొత్తకోట రూరల్: ఇటీవల ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వాటర్‌ ఫిల్టర్‌కు బదులు ఓ వినియోగదారుడికి ఇటుక రాయి వచ్చింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పాలెం గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి స్నాప్‌డీల్‌లో ఇటీవల రూ.8 వేలు వెచ్చించి వాటర్‌ ఫిల్టర్‌ను బుక్ చేసుకున్నాడు.
             మంగళవారం కొరియర్ బాయ్ వచ్చి కస్టమర్ బుక్ చేసుకున్న వస్తువుకు సంబంధించి ఓ బాక్స్ అందజేశాడు. దీంతో బాల్‌రెడ్డి బాక్స్‌ను తీసుకుని ఇంటివద్దకు వెళ్లి తెరిచి చూడగా వాటర్‌ఫిల్టర్‌కు బదులు ఇటుక రాయి కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ మోసం ఆన్‌లైన్ వారి మూలంగా జరిగిందా.. లేదా కొరియర్ సంస్థ ద్వారా జరిగిందా అన్న తెలియాల్సి ఉంది.

No comments:

Post a Comment