కాగా ఇప్పటివరకూ భారత పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆమీర్ రెండు నెలల కిత్రం.. భారత్లో అసహనంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఆమీర్ వ్యాఖ్యలను కేంద్రమంత్రులతో పాటు, బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో అతిథి దేవో భవ ప్రచార బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం అతడినిను తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ రేసులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్పా, అక్షయ్ కుమార్ ఉండగా, చివరకు బిగ్ బి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది.
మరోవైపు ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ నుంచి తొలగించడంపై ఆమీర్ ఖాన్ స్పందించాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని అతడు పేర్కొన్నాడు.
No comments:
Post a Comment