Sunday, April 17, 2011

సచిన్‌ కల నెరవేరింది.

 సచిన్‌ కల నెరవేరింది. టీమిండియా అనుకున్నది సాధించి జట్టు సభ్యులందరు కలసి సచిన్‌కు వరల్డ్‌కప్‌ అంకితం చేశారు. భారత జట్టు 27 సంవత్సరాల తరువాత ప్రపంచకప్‌ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పట్టుదల, సమిష్టతత్వంతో భారత జట్టు విజయం సాధించింది. సచిన్‌కు కోసం ప్రపంచకప్‌ గెలుచుకుంటామని జాతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. సచిన్‌ సెంచరీ చేయలేకపోవడంతో కొంత నిరాశ అనిపించినప్పటికీ సచిన్‌ కోరిక నెరవేరింది. తన చేతుల్లో ప్రపంచకప్‌ను చూసి మురిసిపోవాలని సచిన్‌ కన్న కలలు ఫలించాయి. మ్యాచ్‌ మూగిసిన తరువాత సచిన్‌ టెండ్కూలర్‌ని యూసుఫ్‌ పఠాన్‌ తన భూజాలపై ఎంతుకోన్ని స్టేడియం అంతటా తిరిగారు. 
అలాగే భారత జట్టు కోచ్‌ కిర్‌స్టీన్‌ను కూడా వారు తమ భుజాలపై మోసారు. భారత జట్టు ప్రతి ఒక్కరి కోరిక నెరవేరింది. యువరాజ్‌ సింగ్‌, యూసుఫ్‌ పఠాన్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ ఇలా ఒక్కరి తరువాత ఒక్కరు సచిన్‌ని దగ్గరికి తీసుకోన్ని కౌగిలించుకున్నారు. గెలిచిన ఆనందంలో ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు.

No comments:

Post a Comment