Thursday, February 10, 2011

రగడ అర్థ శతదినోత్సవం

 నాగార్జున నటించిన 'రగడ' ఫిబ్రవరి 11 నాటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. క్రిస్మస్‌ కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా, 89 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయమై నాగార్జున స్పందిస్తూ...'పాటలు, ఫైట్స్‌, డైలాగ్స్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులు మెచ్చేలా కమర్షియల్‌గా పెద్ద హిట్‌. ఫిబ్రవరి 11 నాటికి 50 రోజులు పూర్తి చేసుకోవడం, ఇదే రోజున దిల్‌రాజు బ్యానర్‌లో చేసిన 'గగనం' రిలీజ్‌ అవడం, రేపు ఫిబ్రవరి 12న ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో శ్రీనివాస్‌రెడ్డి డైరెక్షన్‌లో 'ఢమరుకం' షూటింగ్‌ ప్రారంభం అవుతుండడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. 'రగడ'ను ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు' అని అన్నారు. నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ..'సంక్రాంతి పండగకు మంచి కలెక్షన్స్‌ రాబట్టి ఇప్పుడు రాబోయే శివరాత్రి వరకు తన జైత్రయాత్రని కొనసాగిస్తుందన్న నమ్మకం వుంది. 89 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని, అన్ని సెంటర్స్‌లో స్ట్రాంగ్‌గా వుండటం హ్యాపీగా వుంది. 'రగడ' చిత్రాన్ని మా బ్యానర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌. ఆదరించిన ప్రేక్షకులకు, నాగార్జునగారి అభిమానులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా'నని అన్నారు.

No comments:

Post a Comment