Monday, December 20, 2010

అనుష్క , త్రిష మధ్య అధిపత్య పోరు

 అనుష్క కథానాయాకగా నటించిన రగడ, త్రిష నటించిన మన్మథ బాణం డిసెంబర్‌ 23న విడుదల కానున్నాయి. మన్మథ బాణం అనువాద చిత్రమే అయినా కానీ కమల్‌హాసన్‌ కథానాయకుడు కావడంతో ఈ చిత్రంపై కూడా అంచానాలు భారీగా ఉన్నాయి. త్రిష ' మన్మథ బాణం' తో హిట్టు కొట్టి తెలుగు, తమిళనాడుల్లో సత్తా చాటాలని త్రిష ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ' రగడ' పై కూడా అంచనాలు ఘనంగానే ఉన్నాయి. టైటిల్‌ దగ్గర్నుంచి పాటల వరకు అంతా మాస్‌ మయమైన ఈ చిత్రం దుమ్ము రేపుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ' మన్మథ బాణం ' చిత్రాన్ని ' రగడ'తో సమానంగా విడుదల చేయాడానికి ఆ చిత్ర నిర్మాతలు కూడా ప్లాన్‌ చేసుకోవడంతో ఈ రెండింటి మధ్య పోటీ తప్పదనిపిస్తోందిసో .... రెండు సినిమాలతో ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు అమీ తుమీ తేల్చుకోనున్న ఈ సందర్బంలో విజయం ఎవరిని వరిస్తుందనేది తేరపై చూడాలి.

No comments:

Post a Comment