Thursday, April 27, 2017

నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి...!

 వెస్టిండీస్‌ క్రికెటర్‌ మార్లోన్‌ శామ్యూల్స్‌ నాలుగేళ్ల తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అడుగుపెడుతున్నాడు. దిల్లీ డేర్‌డెవిల్స్‌ యాజమాన్యం అతడితో ఒప్పందం కుదుర్చుకొంది. కుడిచేతి చూపుడు వేలి గాయంతో ఐపీఎల్‌ పదికి దూరమైన డికాక్‌ స్థానంలో శామ్యూల్స్‌ను తీసుకొంది. ఈ వెటరన్‌ క్రికెటర్‌ 71 టెస్టులు, 187 వన్డేలు, 55 టీ20ల్లో వెస్టిండీస్‌ తరఫున ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో రూ.కోటి కనీస ధరతో వచ్చిన శామ్యూల్‌ను ఎవరూ కొనగోలు చేయలేదు. చివరి సారిగా 2013లో పుణె వారియర్స్‌ తరఫున ఐపీఎల్‌ ఆడాడు.

No comments:

Post a Comment