Friday, December 9, 2016

వైభవంగా అఖిల్‌ నిశ్చితార్థం


ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, అమల కుమారుడు అఖిల్‌ నిశ్చితార్థం శ్రీయా భూపాల్‌తో హైదరాబాద్‌లో శుక్రవారం వైభవంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలైన శ్రీయా భూపాల్‌, అఖిల్‌లు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబాలు వారికి వివాహం చేయాలని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక అతికొద్దిమంది సన్నిహితుల మధ్య ఓ ప్రైవేటు అతిథిగృహంలో వైభవంగా నిర్వహించినట్టు సమాచారం. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీయా భూపాల్‌ వృత్తిరీత్యా ఫ్యాషన్‌ డిజైనర్‌.

 

No comments:

Post a Comment