Monday, January 18, 2016

ఆ కుటుంబాన్ని కలవడం ఆనందం: నాగార్జున

 బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ దంపతులను కలవడం ఎప్పటికీ ఆనందమేనని నాగార్జున అన్నారు. ఓ వాణిజ్య సంస్థ ప్రకటన షూటింగ్‌లో భాగంగా నటుడు ప్రభుతోపాటు అమితాబ్‌, జయ బచ్చన్‌లను కలిసిన ఫొటోను నాగార్జున తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రకటన కోసం తన స్నేహితుడు ప్రభు, అమితాబ్‌, జయ బచ్చన్‌లను కలవడం ఆల్‌వేస్‌ ప్లెజర్‌ అంటూ ట్వీట్‌ చేశారు. అదేవిధంగా వారితో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. గతంలో కూడా నాగార్జున బిగ్‌బి అమితాబ్‌తో కలిసి ఓ వాణిజ్యసంస్థ ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment