Tuesday, March 15, 2011

అనాథల్ని చేసిన హంతకి...

సునామీ ఆ పేరు వింటేనే గుండెలు దడేల్‌ మంటాయి. ఇక అది కబలిస్తే బ్రతుకు చిద్రమే.. బిడ్డ,తల్లిని.. అన్నా, తమ్ముళ్లని.. భార్యా, భర్తలను దూరం చేసి. కనీసం గూడు లేకుండా అనాదల్ని చేసి. మరణకేళి ఆడుకున్న సునామీకి తోడు భూకంపాలతో జపాన్‌ అతలాకుతలం అయ్యింది. దీనికి తోడు అక్కడ పేలిన మూడు అణు రియాక్టర్లవల్ల ప్రమాదస్థాయి ఇంకా పెరిగిపోయింది. ఇప్పటికే హిరోషీమా, నాగసాకి ప్రమాదం నాటి అణు భీభత్స తాకిడినుంచి సరిగ్గా కుదురుకోని జపాన్‌ ఈ అణు రియాక్టర్లు పేలడంతో అంతకంటే ఎక్కువ నష్టానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. వారి పచ్చటి జీవితాలను పాడె మీదకు తెచ్చిన ప్రళయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ అభాగ్యజీవులకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలి...

No comments:

Post a Comment