Monday, February 1, 2016

మా మధ్య ఉన్నది అది కాదు

సిద్ధార్థ్‌ మల్హోత్రా, ఆలియా భట్‌ల మధ్య బంధం గురించి కొంత కాలంగా బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’తో అరంగేట్రం చేసిన వీరిద్దరూ అప్పటి నుంÍే మంచి స్నేహితులుగా మారిపోయారు. పార్టీలకు, ప్రివ్యూ షోలకు జంటగా హాజరై మీడియా దృష్టిని ఆకర్షించారు. దీంతో వీరి మధ్య స్నేహానికి మించిన బంధమేదో ఉందన్న వార్తలు బలంగా వినపడుతున్నాయి. దీని గురించి సిద్ధార్థ్‌ స్పందించాడు. ‘‘నాకు, ఆలియాకు సినిమాల్లోకి రాకముందు నుంచే పరిచయముంది. ఒకే చిత్రంతో వెండితెరకు పరిచయం కావడం వల్ల స్నేహితులుగా మారిపోయాం. అవసరమైనప్పుడు ఒకరి సినిమాలకు మరొకరం మద్దతుగా నిలుస్తుంటాం. అంతమాత్రాన మా స్నేహాన్ని వేరే ఉద్దేశంతో చూడకూడదు. అలాంటి వార్తలు నా కుటుంబాన్ని బాధించాయ’’ని చెప్పాడు సిద్ధార్థ్‌. ప్రస్తుతం వీరిద్దరూ ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’లో నటిస్తున్నారు. ఆలియా అద్భుతమైన నటి అని, ‘హైవే’ చూస్తే ఆమె సత్తా అర్థమవుతుందని ప్రశంసించాడు సిద్ధార్థ్‌.

No comments:

Post a Comment