భారత్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లితో గతంలో ఎన్నోసార్లు మైదానంలో గొడవపడ్డాను. కానీ అతని కెప్టెన్సీలోనే ఇప్పుడు ఆడాల్సి వస్తోందని.. ఇలాంటి వింతలు ఐపీఎల్ లాంటి దేశవాళీ టోర్నీలోనే సాధ్యమవుతాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్-9 వేలంలో వాట్సన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ సీజన్లోనే అత్యధిక ధర రూ.9.5 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మంగళవారం తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు కెప్టెన్ కోహ్లి గురించి వాట్సన్ మాట్లాడుతూ ‘ఇలా కోహ్లితో కలిసి ఆడతానని అసలు వూహించలేదు.. ఓ క్రికెటర్గా అతణ్ని ఎక్కువగా గౌరవిస్తా’ అని అన్నాడు.
అలానే జట్టులో ఉన్న వెస్టిండీస్ విధ్వసంక ఓపెనర్ క్రిస్గేల్తో 2009లో జరిగిన గొడవపై కూడా వాట్సన్ స్పందించాడు. ఆ గొడవ అనంతరం క్రిస్గేల్ ఓ ఇంటర్వ్యూలో ‘వాట్సన్ చూడ్డానికి గంభీరంగా ఉన్నా చాలా సున్నితమైన వ్యక్తి’ అంటూ వ్యాఖ్యానించాడని గుర్తు చేశాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన వాట్సన్ జట్టు అవసరార్థం తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించాడు. కోహ్లి, క్రిస్గేల్, డివిలియర్స్ లాంటి హిట్టర్లు ఉన్నప్పటికీ ఇంతవరకూ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. మరి టీ20ల్లో అత్యుత్తమ ఆల్రౌండర్గా పేరొందిన వాట్సన్ రాకతోనైనా ఈ సీజన్లో బెంగళూరు విజేతగా నిలుస్తుందేమో చూడాలి..!
No comments:
Post a Comment