Monday, April 11, 2016

నాలో చాలా మార్పు వచ్చింది

 బాలీవుడ్‌లో ‘ఏక్‌ విలన్‌’.. ‘బ్రదర్స్‌’ వంటి చిత్రాలతో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించాడు. అయినా.. ఆ సినిమా నటన పరంగా తన ప్రవర్తనను మార్చేసిందని చెబుతున్నాడు.
‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ సినిమాతో పని పట్ల నా ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నాలో ఎంతో మార్పొచ్చింది. తొలినాళ్లలో చేసిన కొన్ని సినిమాలు ఎప్పుడూ కొత్తగా అనిపించేవి. అందులో బాగా చేస్తున్నానా? లేదా? అని నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని. కానీ ఈ చిత్రంలోని పాత్రకు నా నిజ జీవితానికి చాలా సారూప్యత ఉంది’’ అని అన్నాడు సిద్ధార్థ్‌.
అంతేకాదు.. ‘‘నేను పనిచేసిన ఇతర దర్శకులందరితో కంటే.. ఈ సినిమాలో శకున్‌తో కలిసి పని చేయటం కొత్త అనుభూతిని కలిగించింది. సెట్‌లో ఉన్నప్పుడు ఆ పాత్రలో నువ్వే కనపడాలి అని చెబుతుండేవాడు’’ అని దర్శకుడ్ని పొగిడేశాడు సిద్ధార్ధ్‌.

No comments:

Post a Comment