Wednesday, December 2, 2015

నేడు సెహ్వాగ్‌కు సన్మానం


అక్టోబర్‌లో అంతర్జా తీయ క్రికెట్‌ నుంచి తప్పు కున్న డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను అతని సొంత మైదానం ఫిరోజ్‌ షా కోట్లలో నేడు బీసీసీఐ సన్మానించనుంది. దక్షిణా ఫ్రికాతో మ్యాచ్‌ ఆరంభా నికి ముందు.. 9 గంట లకు బీసీసీఐ అధ్యక్షుడు లేదా కార్యదర్శి వీరూను మోమెంటోతో సత్కరిం చనున్నారు. సిల్వర్‌ మోమెంటోపై సెహ్వాగ్‌ సాధించిన రికార్డులను పొందిపరిచారు. ఐతే సెహ్వాగ్‌కు 17 ఏళ్లు సొంత అసోసియేషన్‌గా ఉన్న డిడిసీఏ మాత్రం ఈ సన్మాన కార్యక్రమానికి దూరంగా ఉంటోంది. బీసీసీఐ నుంచి వీరూ సన్మానంపై లేఖ అందింది. కానీ ఢిల్లీ అసోసియేషన్‌ దీనికి హాజరుకావటం లేదని డిడిసీఏ తాత్కాలిక అధ్యక్షుడు చేతన్‌ చౌహన్‌ వెల్లడించారు. జట్టు మేనేజ్‌మెంట్‌తో విభేదాల నేపథ్యంలో సెహ్వాగ్‌ ఈ సీజన్‌లో ఢిల్లీని వీడి హర్యానాకు తరలివెళ్లిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment