బౌలర్ల విజయం
ప్రపంచకప్కు సన్నాహకంగా ఆదివారం నాడిక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్లో భారత్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాట్స్మెన్ విఫలమై 214 పరుగులకు ఆలౌటైనప్పటికీ బౌలర్లు, ముఖ్యంగా పియూష్ చావ్లా, హర్భజన్ సింగ్ భారత్కు అద్భుత విజయం అందించారు. వన్డే మ్యాచ్ మజాను భారత బౌలర్లు అందించారు. ఒక వికెట్ నష్టానికి 118 పరుగులతో విజయంవైపు దూసుకెళుతున్న ఆసీస్కు పియూష్ చావ్లా అడ్డుకట్ట వేసాడు. చావ్లా తొమ్మిది ఓవర్లలో 31 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ సింగ్ ఐదు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ 37.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. రెండో వార్మప్ మ్యాచ్ న్యూజిలాండ్తో జరుగుతుంది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 214 పరుగులు మాత్రమే చేయ్యగలిగింది. భారత బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. భారత్ నిర్ణీత 44.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కడే భారత బ్యాట్స్మెన్లో రాణించి అర్ధసెంచరీ చేసాడు. సెహ్వాగ్ 56 బంతులను ఎదు ర్కొని ఎనిమిది బౌండరీలు, ఒక సిక్సర్తో 54 పరుగులు చేసాడు. వీరూ తరువాత చెప్పు కోతగ్గ స్కోరు చేసింది యూసుఫ్ పఠాన్. పఠాన్ 38 బంతుల్లో రెండు సిక్సర్లతో 32 పరు గులు చేసాడు.
కెనాడాపై బంగ్లా విజయంచిట్టగాంగ్లో జరిగిన వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల తేడాతో కెనడాను ఓడించింది. తొలిగా బ్యాటింగ్ చేసిన కెనాడా 37.3 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌట్ కాగా విజయానికి అవసరమైన 113 పరుగులను బంగ్లాదేశ్ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఇంకా 184 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ 69, ఇమ్రుల్ కేయిస్ 39 పరుగులు చేసారు. తొలి వికెట్కు వీరు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బౌలింగ్లో షకీబ్ అల్ హసన్ రాణించి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
కెన్యాపై విండీస్ విజయం
కెన్యాతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. కెన్యాను 45.3 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌట్ చేసింది.
గుప్తిల్ సెంచరీ
ఐర్లండ్తో శనివారం నాగపూర్లో జరిగిన మరో వార్మప్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెనర్ గుప్తిల్ సెంచరీ చేసాడు. గుప్తిల్ సెంచరీతోపాటు వన్డౌన్ జెస్సీ రైడర్ 48, ఫ్రాంక్లిన్ 49 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఆరంభంలోనే బ్రెండన్ మెక్కలమ్ను కోల్పోయిన న్యూజిలాండ్ రెండో వికెట్కు రైడర్, గుప్తిల్ 79 పరుగులు చేయడంతో కోలుకుంది. టేలర్ 33 పరుగులు చేయడంతోపాటు గుప్తిల్తో కలసి 47 పరుగులు జోడించాడు. ఇందులో టేలర్ వాట 33 పరుగులు . గుప్తిల్ 134 బంతుల్లో 12 బౌండరీలు, మూడు సిక్సర్లతో 130 పరుగులు చేసాడు. ఐర్లండ్ ఓపెనర్ పోర్టర్ఫీల్డ్ 72 పరుగులు చేయడం విశేషం. కడపటి వార్తలు అందే సమయానికి ఐర్లండ్ 35 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
శ్రీలంక
మరో మ్యాచ్లో నెదర్లాండ్స్పై శ్రీలంక 156 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక జట్టులో ఐదుగురు బ్యాట్స్మెన్ అర్ధసెంచరీలు చేయడం విశేషం.
No comments:
Post a Comment