Monday, February 14, 2011

ఐదు రోజుల్లో దొంగల ముఠా సినిమా ఘాటింగ్‌ పూర్తి

 దొంగల మూఠా సినిమా ఘాటింగ్‌ మునుపే చెప్పినట్లుగా ఐదు రోజుల్లో , కేవలం ఎనిమిది మంది క్య్రూమెంబర్స్‌తో దిగ్విజయంగా పూర్తియ్యింది. అందరూ ఊహించుకున్నట్లుగా ఘాటింగ్‌ ఇరవై నాలుగు గంటల షెడ్యూల్‌తో కాకుండా కేవలం సాదారణ పని గంటలలో, ఏ ఒక్క రోజు నిర్ధేశించిన సమయం మించకుండా పూర్తి చేయడం జరిగింది.
ఇంత వరకూ మొత్తం ఫిలం ఇండ్రస్టీలోనే ఎవరూ ఊహించని విధంగా ఆలోచించి, దానికి ఈ విధంగా కార్యరూపం ఇవ్వడం సినిమా మేకింగ్‌ లోనే ఒక సరి కొత్త అధ్యాయానికినాంది. నాలుగు కెనాన్‌ కెమెరాలను ఉపయోగించి. ఒకేసారి నాలుగు అంగిల్స్‌ లో ప్రతీ షాట్‌ తీయడం వల్ల అత్యంత వేగంగా ఘాట్‌ చేయడం సాధ్యపడింది.
అసలు లైట్స్‌ మరియు డాలి, జిబ్‌ మొదలుగు ఎక్విప్‌మెంట్స్‌ ఉపయోగించకుండా సినిమా మొత్తం సహజమైన లైటింగ్‌లో చేయడం జరిగింది. రవితేజ, ఛార్మి, ప్రకాష్‌ రాజ్‌, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజ్‌, బ్రహ్మాజి, మరియు సుప్రిత్‌ మొదలగు వారున్న ఈ సినిమాను ఇండస్టీలోనే మొదటి సారిగా జీరో బడ్జెట్‌ తో నిర్మించడం జరిగింది. ఆక్టర్లకని గాని, టెక్నీషియన్లకు ఎటువంటి రెమ్యునరేషన్‌ ఇవ్వబడలేదు. మార్చి 4న ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతోంది.

No comments:

Post a Comment