న్యూజలాండ్ , పాకిస్థాన్ మధ్య జరుగుతన్న రెండు టెస్టుల సిరీస్లో పాక్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఐదేళ్ల తర్వాత పాకిస్థాన్ టెస్టు సిరీస్ గెలిచింది. చివరిసారిగా 2006లో వెస్డిండీస్తో సిరీస్ నెగ్గిన తర్వాత పాక్కు ఇదే తొలి విజయం. బుధవారం చివరి రోజు 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. సిరీస్ క్లీన్స్వీప్ చేసేందుకు అవకాశమున్నా పాక్ బ్యాట్స్మెన్ అనవసర రిస్క్ తీసుకోలేకపోయారు. మ్యాన్ ఆప్ ది మ్యాచ్ కెప్టెన్ మిస్బావుల్ హక్ ఎంపికయ్యాడు.
No comments:
Post a Comment