Saturday, January 8, 2011
గంభీర్ దక్కించుకున్న కోల్కత్తా నైట్ రైడర్స్
ఈ ఉదయం ప్రారంభమైన ఐపీఎల్ -4 వేలంలో గౌతమ్ గంభీర్ను కోలకతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. రూ. 11.04 కోట్లతో గంభీర్ను, రూ. 9.66 కోట్లతో యూసుఫ్ పఠాన్ను నైెట్ రైడర్స్ చేజిక్కించుకుంది. రూ. 2.9 కోట్లతో దిల్షాన్ను, రూ. 4.14 కోట్లతో జహీర్ఖాన్ను, రూ. 5 కోట్లతో డివిలియర్స్ను బెంగుళూరు రాయల్ ఛాలంజర్స్ దక్కించుకుంది. రూ. 4.6 కోట్లతో రాస్ టేలర్ను రాజస్థాన్ రాయల్స్ చేజిక్కించుకుంది. రూ. 2.9 కోట్లతో కెవిన్ పీటర్స్న్ను డెక్కన్ ఛార్జర్స్ సొంతం చేసుకుంది. రూ.6.9 కోట్లతో మహేళ జయవర్థనేను కొచ్చి దక్కించుకుంది. రూ. 8.28 కోట్లతో యువరాజ్సింగ్ను పూణే చేజిక్కించుకుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment