Tuesday, April 5, 2016

వాళ్ల బ్రేకప్‌ ఉత్తిదేనా..?

 బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రణ్‌బీర్‌ కపూర్‌.. కత్రినా కైఫ్‌ బ్రేకప్‌ విషయం ఓ పట్టాన కొలిక్కిరావట్లేదు. ఇటీవల బ్రేకప్‌ అయిన వీరిద్దరిని కలపడానికి ఒకవైపు వారి స్నేహితులు.. సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నా.. మరోవైపు ఎక్కడికి వెళ్లినా రణ్‌బీర్‌.. కత్రినా ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారు. దీంతో ఇక వాళ్లిద్దరు కలిసే అవకాశాలు లేవని బీటౌన్‌లో అనుకున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన వీరిద్దరు మళ్లీ ఒక్కటవుతున్నారన్న సందేహాన్ని కలిగించిందట.
ప్రస్తుతం వీరు బ్రేకప్‌ అయినా.. ‘జగ్గాజాసూస్‌’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రణ్‌బీర్‌.. కత్రినా ఒకరినొకరు కలవకుండా వేరువేరుగా ఉన్నారట. కానీ.. వీరిద్దరికి సన్నిహిత స్నేహితురాలైన ఆర్తి పుట్టిన రోజు పార్టీకి మిస్‌ కాకుండా ఒకే సమయంలో వచ్చారట. అంతేకాదు.. ఇరువురు ఆప్యాయంగా పలుకరించుకొని చాలా సేపు మాట్లాడుకున్నారట. పార్టీ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి రణ్‌బీర్‌ వెళ్లిన తర్వాత కత్రినా వెళ్లిపోయిందట. దీంతో వీరిద్దరు మళ్లీ కలిసిపోతున్నారంటూ బాలీవుడ్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఇది అంత విశ్వసనీయ సమాచారం కాకున్నా ఒకవేళ నిజంగానే సర్దుకుపోయి.. ప్రేమను కొనసాగిస్తే వారి జంటను అభిమానించే అభిమానులకు సంతోషకరమైన విషయమే కదా!

No comments:

Post a Comment