అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పట్లో రిటైర్కానని పాకిస్థాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది స్పష్టం చేశాడు. వీడ్కోలు మ్యాచ్ కావాలని తాను పీసీబీని కోరినట్లు వస్తున్న వార్తలను అతడు కొట్టిపారేశాడు. ‘‘నేను 20 ఏళ్లు పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడా. పీసీబీ తరఫున కాదు. ఒక మ్యాచ్ కోసం నేనెవరిపైనా ఆధారపడిలేను. శ్రేయోభిలాషులు, అభిమానుల నుంచి పొందిన ప్రేమే నాకు పెద్ద బహుమానం’’ అని అఫ్రిది చెప్పాడు. వీడ్కోలు మ్యాచ్ కోసం పాకిస్థాన్ బోర్డును అడగబోనని అతడు అన్నాడు. ‘‘నా కెరీర్ ముగిసిందని అనుకోవట్లేదు. క్రికెట్లో కొనసాగుతా. ఇక పాకిస్థాన్ జట్టుకు ఎంపికవడం అనేది సెలక్టర్ల చేతుల్లో ఉంది’’ అని అఫ్రిది చెప్పాడు.
No comments:
Post a Comment