Monday, December 26, 2016

అక్కడ రాత్రి.. ఇక్కడ పగలు!

 అమ్మ మధు చోప్రా, నిర్మాత వసు భగ్నాని కూతురు దీప్షికా దేశ్‌ముఖ్‌లతో కలసి ప్రియాంకా చోప్రా నిర్మించిన పంజాబీ చిత్రం ‘సర్వన్న్‌’. ఈ సినిమా షూటింగ్‌ జరిగినన్ని రోజులూ ‘క్వాంటికో’ టీవీషో, ‘బేవాచ్‌’ సినిమా కోసం ప్రియాంక విదేశాల్లోనే ఉన్నారు. అయితే.. నిర్మాణ బాధ్యతలన్నీ మిగతా ఇద్దరిపై వేయలేదట!
మనకూ, అమెరికాకీ సుమారు 11 గంటల వ్యత్యాసం ఉంది. అమెరికాలో పగలంతా షూటింగ్‌ చేసి, రాత్రి హోటల్‌ రూమ్‌కి చేరుకునేసరికి ఇండియాలో పగలు అవుతుంది. అప్పుడు ప్రియాంక ఫోనులో ‘సర్వన్న్‌’ టీమ్‌కి సలహాలిస్తూ, పనులను పర్యవేక్షించేవారట! అలా.. పగలు నటిగా.. రాత్రి నిర్మాతగా కష్టపడి పనిచేశానన్నారు.

No comments:

Post a Comment